Sushil Kumar: అప్రూవర్‌గా మారిన సుశీల్‌ ప్రాణ మిత్రుడు!

యువ రెజ్లర్‌ సాగర్ రాణా హత్యకేసు దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. తాజాగా సుశీల్‌ కుమార్‌ ప్రాణ మిత్రుడు ప్రిన్స్‌ ప్రభుత్వ అప్రూవర్‌గా మారేందుకు అంగీకరించాడని తెలిసింది. ....

Published : 30 May 2021 01:35 IST

దిల్లీ: యువరెజ్లర్‌ సాగర్ రాణా హత్యకేసు దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. తాజాగా సుశీల్‌ కుమార్‌ ప్రాణమిత్రుడు ప్రిన్స్‌ అప్రూవర్‌గా మారేందుకు అంగీకరించాడని తెలిసింది. ఛత్రసాల్‌ స్టేడియంలో దాడి జరిగినప్పుడు అతడే ఘటనను వీడియో తీసిన సంగతి తెలిసిందే.

ఈ హత్య కేసులో తొమ్మిదో అరెస్టు నమోదైంది. బిందర్‌ (అసలు పేరు విజేందర్‌)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాగర్‌ను అతడూ గాయపరచడం గమనార్హం. మొత్తంగా ఈ కేసులో 12 మందిపై అభియోగాలు నమోదు కాగా ప్రవీణ్‌, ప్రదీప్‌, వినోద్‌ ప్రధాన్‌ తప్పించుకొని తిరుగుతున్నారు. వారిని పట్టుకొనేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు.

ఛత్రసాల్‌ స్టేడియంలో మే 4న సాగర్‌ రాణాపై సుశీల్‌ కుమార్‌ బృందం దాడి చేసింది. తీవ్రంగా గాయపడ్డ సాగర్‌ రెండు రోజుల తర్వాత మరణించాడు. అప్పటి నుంచి సుశీల్‌ తప్పించుకొని తిరిగాడు. పోలీసులు ఎనిమిది బృందాలుగా విడిపోయి అతడి ఆచూకీ కనుగొన్నారు. గత ఆదివారం అరెస్టు చేసి కోర్టుకు తరలించగా అతడికి న్యాయస్థానం ఆరు రోజుల రిమాండ్‌ విధించగా.. తాజాగా మరో నాలుగు రోజుల కస్టడీని పొడిగించింది. విచారణలో భాగంగా సుశీల్‌ కుమార్‌తోపాటు, అతడి సహచరుడు అజయ్‌కి నాలుగు రోజుల కస్టడీని పొడిగిస్తూ శనివారం దిల్లీ హైకోర్టు తీర్పు వెలువడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని