T20 World Cup Final: టాస్ గురించి ఆందోళన చెందట్లేదు: ఆరోన్ ఫించ్
టీ20 ప్రపంచకప్ పైనల్లో టాస్ గురించి ఆందోళన చెందట్లేదని, మ్యాచ్ ఫలితం దానిపై ఆధారపడి ఉండదని ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ అభిప్రాయపడ్డాడు. దుబాయ్ వేదికగా కొన్ని రోజుల క్రితం జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ గురించి ఫించ్ ప్రస్తావించాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్ పైనల్లో టాస్ గురించి ఆందోళన చెందట్లేదని, మ్యాచ్ ఫలితం దానిపై ఆధారపడి ఉండదని ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ అభిప్రాయపడ్డాడు. దుబాయ్ వేదికగా కొన్ని రోజుల క్రితం జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ గురించి ఫించ్ ప్రస్తావించాడు. అక్కడ టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 27 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేశాడు. అయితే, దుబాయ్లో ఇప్పటివరకు 17 మ్యాచ్లు రాత్రివేళ జరగ్గా.. ఛేదనకు దిగిన జట్టు 16 మ్యాచ్ల్లో విజయం సాధించడం విశేషం. ఇప్పటివరకు ఈ టోర్నీలో ఆసీస్ ఐదు విజయాలు సాధించగా..అన్నింట్లోనూ రెండోసారి బ్యాటింగ్ (ఛేదన) చేయడం గమనార్హం.
‘‘టాస్ గురించి ఆందోళనపడట్లేదు. దాన్ని కచ్చితంగా అధిగమించవచ్చు. టోర్నమెంట్లో కొన్నిసార్లు తొలుత బ్యాటింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. టోర్నీలో గెలవాలంటే ముందుగా ఆ జట్టు బ్యాటింగ్లో గెలవాలి. పాకిస్థాన్తో జరిగిన సెమీ ఫైనల్లో నేను టాస్ ఓడిపోవాలని ఆశించా. ఎందుకంటే మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోరును ప్రత్యర్థి ముందు ఉంచడానికి ఇష్టపడతాను. దాంతో చేయాల్సిన స్కోరు ఎక్కువగా ఉండటంతో ప్రత్యర్థి జట్టు ప్రారంభంలో రిస్క్ తీసుకుంటుంది’ అని ఫించ్ అన్నాడు.
"ప్రపంచంలోని చాలా జట్లు టీ20 క్రికెట్లో ఛేజింగ్ను ఇష్టపడతాయని భావిస్తున్నా. అయితే ఇది రిస్క్తో కూడుకున్నది. ఒక జట్టు భారీ స్కోరును చేస్తే దాన్ని ప్రత్యర్థి జట్టు ఛేదించడం కష్టం. కానీ, ఈ టోర్నీలో ఛేదనకు దిగిన జట్టే గెలుస్తోంది. న్యూజిలాండ్ ఎంత పోటీగా ఆడుతుందో తెలుసు. ఆ జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. ఎలాంటి స్థితిలోనైనా పోరాడి మ్యాచ్లో పైచేయి సాధించగలదు’ అని ఆస్ట్రేలియా కెప్టెన్ పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా న్యూజిలాండ్, ఆసీస్ జట్లు తలపడనున్న సంగతి తెలిసిందే.
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గౌతమ్ గంభీర్ బాధ పడొద్దు.. కాస్త నవ్వుతూ ఉండు: షారుఖ్ ఖాన్
ఈ సీజన్లో కోల్కతాకు రెండో ఓటమి ఎదురైంది. భారీ లక్ష్య ఛేదనలో రాజస్థాన్ చివరి బంతికి గెలిచింది. -
కోహ్లీనే తక్కువ పరుగులు ఇస్తాడేమో.. బెంగళూరు 11 మంది బ్యాటర్లతో ఆడాలి: క్రిష్
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరు విజయాలబాట పట్టాలంటే.. జట్టు, ప్రణాళికల్లో మార్పులు అవసరమని భారత మాజీ క్రికెటర్ కీలక సూచనలు చేశాడు. -
క్రీజ్లో బట్లర్.. చివరి ఓవర్ను వరుణ్కి ఇవ్వడానికి కారణమదే: శ్రేయస్
ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్థాన్ను ఓడించాలని భావించిన కోల్కతాకు చుక్కెదురైంది. జోస్ బట్లర్ పోరాడి వారి ఆశలకు గండికొట్టాడు. -
ఆ విషయంలో.. ధోనీ, కోహ్లీని అనుసరించా: జోస్ బట్లర్
ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో కోల్కతాను రాజస్థాన్ చివరి బంతికి ఓడించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన పోరులో జోస్ బట్లర్ సెంచరీ చేసి జట్టును గెలిపించాడు. -
బాప్రే బట్లర్.. ఒత్తిడిలో అద్భుత బ్యాటింగ్
ఆరు ఓవర్లలో 96 పరుగులు... ఎలాంటి పిచ్పైనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఛేదన చాలా చాలా కష్టం. పైగా ఆరు వికెట్లు పోయాయి. కోల్కతాతో మ్యాచ్లో భారీ లక్ష్య ఛేదనలో పోరాడుతున్న రాజస్థాన్ ఓపెనర్ బట్లర్కు సహకరించే వారూ లేరు. -
జ్యోతి వెలిగింది.. పారిస్ మురిసింది
ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా పండుగ ఒలింపిక్స్కు సమయం దగ్గర పడుతోంది. సరిగ్గా ఇంకో వంద రోజుల్లోనే పారిస్లో ఈ మెగా ఈవెంట్ జరగబోతోంది. -
టీ20 ప్రపంచకప్లో.. హార్దిక్ బౌలింగ్ చేస్తేనే..
రాబోయే టీ20 ప్రపంచకప్లో హార్దిక్ పాండ్య ఆడతాడా? ఐపీఎల్లో ఇప్పటిదాకా ఈ ఆల్రౌండర్ ప్రదర్శన చూసిన అభిమానుల్లో తలెత్తుతున్న ప్రశ్న ఇదే. కొన్ని నెలల ముందు వరకు అతడి సారథ్యంలోనే టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ ఆడుతుందని అంతా అనుకున్నారు. -
ఐపీఎల్కు మ్యాక్స్వెల్ నిరవధిక విరామం
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పేలవమైన ఫామ్లో ఉన్న మ్యాక్స్వెల్ ఐపీఎల్ నుంచి నిరవధిక విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. -
నాదల్ విజయంతో..
స్పెయిన్ దిగ్గజం రఫెల్ నాదల్ పునరాగమనాన్ని విజయంతో మొదలుపెట్టాడు. బార్సిలోనా ఓపెన్ తొలి రౌండ్లో అతడు 6-2, 6-3తో ఫ్లావియో కొబాలి (ఇటలీ)పై విజయం సాధించాడు. -
అగ్రస్థానంలో గుకేశ్
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్మాస్టర్ గుకేశ్.. అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. నెపోమ్నియాషి (రష్యా)తో జరిగిన పదో రౌండ్ గేమ్ను అతడు డ్రాగా ముగించాడు. -
రోహిత్ ఓటమి
ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో రోహిత్ దహియా పోరాటం ముగిసింది. మంగళవారం 82 కేజీల విభాగం కాంస్య పోరులో ఈ భారత కుర్రాడు 1-3తో రసులోవ్ (ఉజ్బెకిస్థాన్) చేతిలో ఓడాడు. -
నరైన్ శతకం వృథా.. సెంచరీ చేసి రాజస్థాన్ను గెలిపించిన బట్లర్
కోల్కతాపై రాజస్థాన్ 2 వికెట్ల తేడాతో నెగ్గింది. 224 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ చివరి బంతికి విజయం సాధించింది. ఆ జట్టు ఆటగాడు జోస్ బట్లర్ శతకం(107*)తో చెలరేగాడు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల్లో భాజపా తుడిచిపెట్టుకుపోతుంది: అఖిలేష్ యాదవ్
-
వలసలు, పస్తులు లేని వికసిత ఏపీ మనందరి బాధ్యత: పవన్
-
6,000mAh బ్యాటరీతో వివోలో బడ్జెట్ 5G ఫోన్.. ధర, ఫీచర్లివే..
-
యంగ్ ఇండియాది విరాట్ కోహ్లీ మనస్తత్వం: రఘురామ్ రాజన్
-
మాటిస్తున్నా..: ‘జై హనుమాన్’పై ప్రశాంత్ వర్మ పోస్ట్
-
రాజధాని అమరావతి నమూనా గ్యాలరీని ధ్వంసం చేసిన దుండగులు