T20 World Cup: దంచికొట్టిన రోహిత్, రాహుల్.. అఫ్గాన్ ముందు భారీ లక్ష్యం
టీ20 ప్రపంచ కప్లో అబుదాబి వేదికగా అఫ్గానిస్థాన్తో జరుగుతున్న టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ (74; 47 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లు), కేఎల్ రాహుల్ (69; 48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధశతకాలతో రాణించగా..
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్లో అబుదాబి వేదికగా అఫ్గానిస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ (74; 47 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లు), కేఎల్ రాహుల్ (69; 48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధశతకాలతో రాణించారు. రిషభ్ పంత్ (27; 13 బంతుల్లో 1 ఫోర్, మూడు సిక్స్లు), హార్దిక్ పాండ్య ( 35; 13 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లు) సైతం చివర్లో దూకుడుగా ఆడారు. దీంతో భారత్ నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి 210 పరుగుల భారీ స్కోరు సాధించింది. అఫ్గాన్ బౌలర్లలో గుల్బాదీన్, కరీం జనత్ తలో వికెట్ పడగొట్టారు.
ఇద్దరూ పోటాపోటీ..
ఓపెనర్లుగా బరిలోకి దిగిన రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే పోటాపోటీగా బౌండరీలు బాదారు. షరాఫుద్దీన్ వేసిన రెండో ఓవర్లో కేఎల్ రాహుల్ ఫోర్, సిక్స్ బాదగా.. నవీన్ ఉల్ హక్ వేసిన నాలుగో ఓవర్లో రోహిత్ రెండు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టాడు. దీంతో ఈ ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. తర్వాతి మూడు ఓవర్లో స్కోరు కాస్త నెమ్మదించింది. తర్వాత వీరిద్దరూ మళ్లీ ధాటిగా ఆడారు. దీంతో 10 ఓవర్లకు భారత్ స్కోరు 85/0 వద్ద నిలిచింది. రషీద్ఖాన్ వేసిన 14వ ఓవర్లో రెండు సిక్స్లు బాదిన రోహిత్ శర్మ తర్వాతి ఓవర్లోనే నబీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కొద్దిసేపటికే కేఎల్ రాహుల్ కూడా పెవిలియన్ చేరాడు. దీంతో క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్, హార్దిక్ పాండ్య దూకుడుగా ఆడారు. గుల్బాదీన్ వేసిన 17వ ఓవర్లో పంత్ రెండు సిక్సర్లు కొట్టాడు. 18వ ఓవర్లో మూడు ఫోర్లు బాదిన హార్ది్క్.. 19వ ఓవర్లో రెండు సిక్స్లు బాదాడు. 20వ ఓవర్లో పంత్ రెండు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. దీంతో ఈ ఓవర్లో మొత్తం 20 పరుగులు వచ్చాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?