T20 World Cup: ‘టీ20 ప్రపంచకప్లో ఫైనల్ చేరేది ఆ రెండు జట్లే’
టీ20 ప్రపంచకప్ సూపర్ 12 దశలో సగం మ్యాచ్లు కూడా పూర్తి్కాకముందే ఫైనల్స్కు చేరే జట్లపై పలువురు మాజీ క్రికెటర్లు, క్రికెట్ విశ్లేషకులు తమ అంచనాలను బయటపెడుతున్నారు. ఇంగ్లాండ్ స్టార్ ఆల్రౌండర్
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్ సూపర్-12 దశలో సగం మ్యాచ్లు కూడా పూర్తి కాకముందే ఫైనల్స్కు చేరే జట్లపై పలువురు మాజీ క్రికెటర్లు, క్రికెట్ విశ్లేషకులు తమ అంచనాలను బయటపెడుతున్నారు. ఇంగ్లాండ్ స్టార్ ఆల్రౌండర్ బెన్స్టోక్స్ కూడా ఫైనల్స్కు చేరే జట్లపై తన అంచనాను బయటపెట్టాడు. గ్రూపు-1లో టాప్లో ఉన్న పాకిస్థాన్, గ్రూపు-2లో అగ్రస్థానంలో ఉన్న ఇంగ్లాండ్ ఈ సారి ఫైనల్స్కు చేరుతాయని జోస్యం చెప్పాడు. ఈ మేరకు ‘ఇంగ్లాండ్, పాకిస్థాన్ జట్లను ఫైనల్లో చూస్తామా?’ అని స్టోక్స్ ట్వీట్ చేశాడు.
ఇక అఫ్గానిస్థాన్తో జరిగిన మ్యాచ్లో నాలుగు సిక్స్లు బాదిన పాకిస్థాన్ ఆటగాడు అసిఫ్ అలీని స్టోక్స్ మెచ్చుకున్నాడు. ‘అసిఫ్ అలీ పేరును గుర్తుంచుకోండి’ అంటూ మరో ట్వీట్ చేశాడు. మానసిక ఆరోగ్యం, గాయం నుంచి కోలుకోవడం కోసం స్టోక్స్ జులై నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు. ఈ కారణంగానే భారత్తో టెస్టు సిరీస్, టీ20 ప్రపంచకప్కు కూడా దూరమైన సంగతి తెలిసిందే.
బెన్స్టోక్స్ ఫైనల్స్కు చేరుతాయని అంచనా వేసిన పాక్, ఇంగ్లాండ్ జట్లు ఇప్పటికే ఈ టీ20 ప్రపంచకప్లో అదరగొడుతున్నాయి. ముఖ్యంగా పాకిస్థాన్ జట్టు ఎన్నడూ లేనంత ఆత్మవిశ్వాసంతో ఆడుతూ వరుస విజయాలతో దూసుకుపోతోంది. బ్యాటింగ్లో, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో రాణిస్తూ ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపిస్తోంది. టీమిండియాపై 10 వికెట్ల తేడాతో నెగ్గిన ఆ జట్టు.. న్యూజిలాండ్పై 5 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. శుక్రవారం అఫ్గానిస్థాన్తో జరిగిన మ్యాచ్లోనూ ఐదు వికెట్ల తేడాతో గెలుపొంది సెమీస్ బెర్త్ని దాదాపు ఖాయం చేసుకుంది. మరోవైపు, గ్రూపు-1లోని ఇంగ్లాండ్ ఆడిన రెండు మ్యాచ్ల్లో గెలిచి ఊపు మీదుంది. తమ తొలి మ్యాచ్లో వెస్టిండీస్ను చిత్తు చేసిన ఆ మోర్గాన్ సేన.. బంగ్లాదేశ్తో జరిగిన మరో మ్యాచ్లో ఎనిమిది వికెట్ల తేడాతో నెగ్గి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా కూడా రెండు విజయాలు సాధించి రెండో స్థానంలో ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
ఎప్పుడూ కూల్గా కనిపించే ఎంఎస్ ధోనీ (MS Dhoni) గురించి ఎవరికీ తెలియని ఓ విషయాన్ని సురేశ్ రైనా ఇటీవల బయటపెట్టాడు. -
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టే ఆలోచన లేదని వెస్టిండీస్ మాజీ ఆటగాడు సునీల్ నరైన్ (Sunil Narine) అన్నాడు. -
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
ముంబయి ఇండియన్స్ గురించి భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టులోని కొంతమంది ఆటగాళ్లు ఇప్పటికీ రోహిత్ శర్మ (Rohit Sharma)నే కెప్టెన్గా భావిస్తున్నారని వ్యాఖ్యానించాడు. -
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్లో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఎవరైతే బాగుంటారు. -
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ముంబయి తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. -
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM