T20 World Cup: నన్ను ప్రశాంతంగా ఉంచే ఏకైక వ్యక్తి ధోని భాయ్ : హార్దిక్ పాండ్య
ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా తనను ప్రశాంతంగా ఉంచే ఏకైక వ్యక్తి ధోని అని ఆల్-రౌండర్ హార్దిక్ పాండ్య తెలిపాడు. తన కెరీర్లో ఎన్నో సందర్బాల్లో ధోని భాయ్ అండగా నిలిచాడని పాండ్య పేర్కొన్నాడు. టీమిండియా మాజీ సారథి..
ఇంటర్నెట్ డెస్క్: ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా తనను ప్రశాంతంగా ఉంచే ఏకైక వ్యక్తి ధోని అని ఆల్-రౌండర్ హార్దిక్ పాండ్య తెలిపాడు. తన కెరీర్లో ఎన్నో సందర్బాల్లో ధోని భాయ్ అండగా నిలిచాడని పాండ్య పేర్కొన్నాడు. టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తర్వాత జరుగుతున్న తొలి టీ20 ప్రపంచకప్లో.. ఫినిషర్గా తనపై మరింత బాధ్యతలు పెరిగాయని అన్నాడు. ఇంతకు ముందు ధోని నిర్వహించిన బాధ్యతలను ప్రస్తుతం తన భుజాలపై పెట్టారన్నాడు.
‘ధోని లేకుండా జరుగుతున్న తొలి మెగా టోర్నీ ఇది. ఇంతకు ముందు ధోని భాయ్ నిర్వహించిన ఫినిషర్ బాధ్యతలను నా భుజాలపై పెట్టారు. ఇది నాకు సవాల్ లాంటిది. నన్ను మొదటి నుంచి బాగా అర్థం చేసుకున్న వ్యక్తి ధోని భాయ్. నా గురించి అతడికి అంతా తెలుసు. 2019లో న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా ఓ టెలివిజన్ కార్యక్రమంలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కారణంగా నేను విమర్శల పాలైనప్పుడు ధోని భాయ్ నాకు ధైర్యం చెప్పాడు. అదొక్కటే కాదు నా కెరీర్లో ఎన్నో సార్లు అతడు నాకు మద్దతుగా నిలిచాడు. వ్యక్తిగతంగా నేను ఎలాంటి వ్యక్తినో ధోనికి బాగా తెలుసు. కాబట్టి, ఆ విషయం గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా నన్ను ప్రశాంతంగా ఉంచే ఏకైక వ్యక్తి ధోని. అతడు నాకు అన్నలాంటి వాడు’ అని హర్దిక్ పాండ్య తెలిపాడు.
2020లో ధోని అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు పలికిన తర్వాత జరుగుతున్న తొలి ప్రపంచకప్ ఇదే. అక్టోబరు 24న టీమిండియా దాయాది పాకిస్థాన్తో తలపడనుంది. ఈ మెగా టోర్నీలో టీమిండియాకి మాజీ సారథి ధోని మెంటార్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
రాజీనామా చేయకుంటే ఊరుకోం.. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిడి
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
-
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
-
పనసపండు గుర్తు ఎక్కడ?.. గందరగోళానికి గురైన ఓటర్లు
-
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!
-
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు