IND vs NZ: ఈడెన్లోనూ విజయమే.. టీమ్ఇండియా క్లీన్స్వీప్
మూడు టీ20ల సిరీస్ను భారత్ క్లీన్స్వీప్ చేసింది. ఈడెన్ గార్డెన్స్ మైదానం వేదికగా ఆఖరి టీ20 మ్యాచ్లో అన్ని రంగాల్లో..
కోల్కతా: భారత క్రికెట్ జట్టు నూతన ప్రధాన కోచ్గా రాహుల్ ద్రవిడ్కు శుభారంభం.. ఇన్నాళ్లూ విరాట్ లేనప్పుడే అప్పుడప్పుడు జట్టు పగ్గాలు చేపట్టే రోహిత్ శర్మకు టీ20 జట్టు పూర్తిస్థాయి సారథిగా తొలి సిరీస్ విజయం.. అదీనూ న్యూజిలాండ్పై మూడు టీ20ల సిరీస్ను టీమ్ఇండియా క్లీన్స్వీప్ (3-0) చేయడం విశేషం.
జట్టులో విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, బుమ్రా, షమీ వంటి మ్యాచ్ విన్నర్లు లేరు. ఉన్నదంతా ద్రవిడ్ మార్గదర్శకత్వం.. రోహిత్ శర్మ నాయకత్వం.. ఈ సిరీస్లో యువ క్రికెటర్లు తమ సత్తాను చాటారు. హర్షల్ పటేల్, వెంకటేశ్ అయ్యర్, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్ తమకొచ్చిన అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. మరోవైపు కేన్ విలియమ్సన్, కాన్వే వంటి అగ్రశ్రేణి బ్యాటర్లు లేకపోయినా.. కివీస్ను తక్కువ అంచనా వేయలేదు. గప్తిల్, డారిల్ మిచెల్, ఫిలిప్స్, నీషమ్, సీఫర్ట్ వంటి ఆటగాళ్లను మన బౌలర్లు అడ్డుకోగలిగారు. అంతేకాకుండా ప్రమాదకరమైన బౌల్ట్, సౌథీ, సోధి, సాంట్నర్, ఫెర్గూసన్తో కూడిన బౌలింగ్ దళాన్ని ఎదుర్కొని పరుగులు రాబట్టడం సాధారణ విషయం కాదు. అలా అన్ని రంగాల్లో రాణించిన టీమ్ఇండియా సిరీస్ను క్లీన్స్వీప్ చేసి టైటిల్ను అందుకుంది.
మూడు టీ20ల సిరీస్ను భారత్ క్లీన్స్వీప్ చేసింది. ఈడెన్ గార్డెన్స్ మైదానం వేదికగా ఆఖరి టీ20 మ్యాచ్లో అన్ని రంగాల్లో రాణించిన టీమ్ఇండియా హ్యాట్రిక్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 184 పరుగులు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనలో కివీస్ 17.2 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకూలింది. దీంతో 73 పరుగుల భారీ తేడాతో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. ఓపెనర్ మార్టిన్ గప్తిల్ (51) అర్ధ శతకం సాధించినా.. జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. మిగతా కివీస్ బ్యాటర్లలో సీఫర్ట్ (17), ఫెర్గూసన్ (14) మినహా ఎవరూ రెండంకెల స్కోరును సాధించలేకపోయారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ (3/9) అదరగొట్టేశాడు. హర్షల్ పటేల్ (2/24), చాహల్ (1/26), వెంకటేశ్ అయ్యర్ (1/12), దీపక్ చాహర్ (1/26) రాణించారు. దీంతో మూడు టీ20ల సిరీస్ను 3-0 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా అక్షర్ పటేల్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా రోహిత్ శర్మ ఎంపికయ్యారు. కివీస్పై టీమ్ఇండియా వరుసగా ఎనిమిదో ద్వైపాక్షిక సిరీస్ను సొంతం చేసుకోవడం విశేషం.
కెప్టెన్ రోహిత్ అర్ధ శతకం.. ఆఖర్లో దంచిన బౌలర్లు
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్కు శుభారంభం దక్కింది. ఓపెనర్లు రోహిత్ (56), ఇషాన్ కిషన్ (29) అర్ధశతకం భాగస్వామ్యం నిర్మించారు. అయితే స్వల్ప వ్యవధిలో నాలుగు వికెట్లు పడటంతో స్కోరు బోర్డు కాస్త నెమ్మదించింది. అయితే మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్ (25), వెంకటేశ్ అయ్యర్ (20) ఇన్నింగ్స్ను నిలబెట్టారు. అలానే ఆఖర్లో హర్షల్ పటేల్ (18), దీపక్ చాహర్ (21*) దంచికొట్టారు. దీంతో టీమ్ఇండియా స్కోరు 184 పరుగులు అయింది. కివీస్ బౌలర్లలో సాంట్నర్ 3.. బౌల్ట్, మిల్నే, ఫెర్గూసన్, సోధి తలో వికెట్ తీశారు.
ఫొటో గ్యాలరీ కోసం క్లిక్ చేయండి
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
బెంగళూరు - కోల్కతా జట్ల మధ్య ఆసక్తికర పోరు నేడు. ఇరు జట్లలోనూ కీలక ఆటగాళ్లు ఉన్నారు. -
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
బెంగళూరు, కోల్కతా జట్ల మధ్య మ్యాచ్ నేపథ్యంలో అందరి దృష్టి ఇద్దరి క్రికెటర్లపైనే ఉంది. -
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
ధోనీతో తనకున్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో రవీంద్ర జడేజా గుర్తు చేసుకున్నాడు. -
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. -
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా