T20: కివీస్పై ఘన విజయం.. సిరీస్ను కైవసం చేసుకున్న భారత్
న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం చేసుకున్న టీమ్ఇండియా
రాంచీ: కొత్త కోచ్.. నూతన సారథ్యం.. అసలే టీ20 ప్రపంచకప్లో సెమీస్కు చేరలేదనే అపవాదు. ఆ టోర్నీలోనే కివీస్పై ఓటమి.. విరాట్ కోహ్లీ, బుమ్రా, షమీ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు విశ్రాంతి.. ఈ నేపథ్యంలో భారత కుర్రాళ్లు అదరగొట్టేశారు. మూడు టీ20ల సిరీస్ను 2-0తేడాతో కైవసం చేసుకున్నారు. తొలి టీ20 మ్యాచ్లో ఆఖరి వరకు టెన్షన్ పెట్టినా... రెండో మ్యాచ్లో మాత్రం పట్టువిడవనీయకుండా విజయాన్ని ఒడిసి పట్టారు. మరోవైపు కివీస్ కూడా కీలక ఆటగాళ్లు లేకపోయినా ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచుల్లోనూ సాధ్యమైనంత వరకు గట్టిపోటీనే ఇచ్చింది. ఇక ఆఖరి మ్యాచ్ నవంబర్ 21న ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనుంది. ప్రధాన కోచ్గా రాహుల్ ద్రవిడ్, నూతన టీ20 జట్టు కెప్టెన్గా రోహిత్ శర్మలకిది తొలి సిరీస్ విజయం కావడం విశేషం.
టాస్ నెగ్గిన రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకుని కివీస్కు బ్యాటింగ్ అప్పగించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. అనంతరం భారత్ కేవలం మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి 17.2 ఓవర్లలో 155 పరుగులు చేసి లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (65 పరుగులు: 6X4, 2X6), రోహిత్ శర్మ (55 పరుగులు: 1X4, 5X6)) రాణించారు. సూర్యకుమార్ యాదవ్ (1) విఫలం కాగా.. వెంకటేశ్ అయ్యర్ 12, రిషభ్ పంత్ 12* పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో టిమ్ సౌథీ మూడు వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 450 సిక్సర్లు బాదిన ఆటగాడిగా రోహిత్ శర్మ అరుదైన రికార్డు సృష్టించాడు.
మెరిసిన అరంగేట్ర బౌలర్
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కివీస్కు ఆరంభంలో భారత బౌలర్లు ఇబ్బందిపెట్టలేకపోయారు. ఓపెనర్లు మార్టిన్ గప్తిల్ (31), డారిల్ మిచెల్ (31) ఇద్దరూ దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అయితే వారితోపాటు చాప్మన్ (21) ఔట్ కావడంతో వేగం మందగించింది. మిడిలార్డర్లో గ్లెన్ ఫిలిప్స్ (34) ధాటిగా ఆడటంతో న్యూజిలాండ్ 150 పరుగులనైనా దాటగలిగింది. సీఫర్ట్ 13, నీషమ్ 3, సాట్నర్ 8*, మిల్నే 5* పరుగులు చేశారు. కివీస్ బ్యాటర్లలో కీలకంగా మారిన డారిల్ మిచెల్, ఫిలిప్స్ వికెట్లను భారత అరంగేట్ర బౌలర్ హర్షల్ పటేల్ (2/25) తీసి తన సత్తా చాటాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు. మిగతా బౌలర్లలో అక్షర్ (1/26), అశ్విన్(1/19) రాణించగా.. భువనేశ్వర్ (1/39), దీపక్ చాహర్ (1/42) భారీగా పరుగులు సమర్పించారు.
నమోదైన రికార్డులు
* 50 స్కోరు కంటే ఎక్కువ నమోదైన సందర్భాలు: కోహ్లీ (29), రోహిత్ శర్మ (29: ఇందులో నాలుగు శతకాలు), బాబర్ అజామ్ (25), డేవిడ్ వార్నర్ (22)
* ఇతర బ్యాటర్తో కలిసి శతక భాగస్వామ్యాలు జోడించడంలో రోహిత్ శర్మ (13 సార్లు), బాబర్ అజామ్ (12), మార్టిన్ గప్తిల్ (12), డేవిడ్ వార్నర్ (11)
* అత్యధిక శతక భాగస్వామ్యాలు: బాబర్-రిజ్వాన్ (22 ఇన్నింగ్స్ల్లో 5 సార్లు), రోహిత్-కేఎల్ రాహుల్ (27 ఇన్నింగ్స్ల్లో 5 సార్లు)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరుకు రెండో విజయం దక్కింది. మరోవైపు సొంత మైదానంలో హైదరాబాద్కు ఓటమి ఎదురైంది. -
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?