తొలి అడుగుతోనే అదరగొట్టారు..!
ఏ మాత్రం విశ్వాసమున్నా... అక్షర్ పటేల్, ఇషాన్ కిషాన్, సూర్యకుమార్ యాదవ్, కృనాల్ పాండ్య, ప్రసిద్ధ్ కృష్ణ.. ఇంగ్లాండ్ జట్టు ఫొటోను తమ ఇళ్లలో పెట్టుకుని రోజూ పూజించాలి...
అరంగేట్రంలో సత్తాచాటిన భారత ఆటగాళ్లు
‘‘ఏ మాత్రం విశ్వాసమున్నా... అక్షర్ పటేల్, ఇషాన్ కిషాన్, సూర్యకుమార్ యాదవ్, కృనాల్ పాండ్య, ప్రసిద్ధ్ కృష్ణ.. ఇంగ్లాండ్ జట్టు ఫొటోను తమ ఇళ్లలో పెట్టుకుని రోజూ పూజించాలి’’.. ఇదీ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోన్న ఓ మీమ్. ఏదో సరదా కోసం ఇది రూపొందించినప్పటికీ.. ఈ భారత ఆటగాళ్లకు ఇంగ్లాండ్తో సిరీస్ ఎంతో కలిసొచ్చిందనేది మాత్రం నిజం. ఎందుకంటే ఈ సిరీస్లోనే వివిధ ఫార్మాట్లలో అరంగేట్రం చేసిన ఈ ఆటగాళ్లు తమ తొలి ఇన్నింగ్స్ల్లోనే సత్తాచాటారు. తొలి సారి క్రీజులో అడుగుపెట్టామని భయం లేకుండా బ్యాట్స్మెన్.. మొదటి సారి బౌలింగ్ చేస్తున్నామనే బెరుకు లేకుండా బౌలర్లు అదరగొట్టారు. అద్భుత ప్రదర్శనతో మొదటి అడుగు ఘనంగా వేశారు. - ఈనాడు క్రీడా విభాగం
టెస్టుల్లో సరికొత్తగా..
పరిమిత ఓవర్ల జట్లలో ఐదారేళ్ల కిత్రమే అడుగుపెట్టినప్పటికీ అక్షర్ పటేల్ పేరు పెద్దగా వినిపించింది లేదు. కానీ ఇంగ్లాండ్పై టీమ్ఇండియా టెస్టు సిరీస్ విజయం తలుచుకుంటే ముందుగా అతని పేరే గుర్తుకు వస్తుంది. తన అరంగేట్ర టెస్టు సిరీస్లో అతను చూపించిన ప్రభావం అలాంటిది. రూట్సేనతో టెస్టు సిరీస్ కోసం భారత టెస్టు జట్టులోకి ఎంపికైన అక్షర్.. గాయం కారణంగా తొలి మ్యాచ్కు దూరమయ్యాడు. మరోవైపు ఆ మ్యాచ్లో టీమ్ఇండియా ఓడింది. విజయంతో సిరీస్లో తిరిగి పుంజుకోవాలనే లక్ష్యంతో చెన్నైలోనే జరిగిన రెండో టెస్టులో భారత్ అడుగుపెట్టింది. ఆ మ్యాచ్తోనే అక్షర్ టెస్టు అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో అయిదు వికెట్లతో సహా మొత్తం ఏడు వికెట్లతో సత్తాచాటాడు. తన తొలి టెస్టు వికెట్గా ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్మెన్లో ఒకడైన రూట్ను బలి తీసుకున్న అతను.. ఆ మ్యాచ్లో అశ్విన్తో కలిసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక రెండు రోజుల్లోనే ముగిసిన డేనైట్ టెస్టులో అక్షర్ ప్రదర్శన గురించి ఎంత చెప్పినా తక్కువే. గులాబి బంతితో వికెట్లకు నేరుగా బౌలింగ్ చేసిన అతను ఆ మ్యాచ్లో 11 వికెట్లు పడగొట్టి జట్టుకు సంచలన విజయాన్ని కట్టబెట్టాడు. చివరి టెస్టులోనూ 9 వికెట్లతో మెరిశాడు. తన బంతులను ఆడలేక ప్రత్యర్థి బ్యాట్స్మెన్ పెవిలియన్కు వరుస కట్టారు. మొత్తం 3 మ్యాచ్ల్లో 27 వికెట్లతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు భారత్ అర్హత సాధించడంలో అక్షర్ ప్రధాన పాత్ర పోషించాడు.
ధనాధన్.. ఫటాఫట్
టెస్టు సిరీస్ విజయంతో ఉత్సాహంతో ఉన్న టీమ్ఇండియాను తొలి టీ20లోనే ఇంగ్లాండ్ కంగు తినిపించింది. పొట్టి ఫార్మాట్లో ప్రపంచ నంబర్వన్ జట్టు అయిన తమతో పోరు అంత సులభం కాదని మోర్గాన్ సేన చాటింది. అయితే బలంగా పుంజుకుని ఆ సిరీస్ను 3-2తో భారత్ సొంతం చేసుకోవడంలో ఇద్దరు అరంగేట్ర ఆటగాళ్లది కీలక పాత్ర. వాళ్లే ఇషాన్ కిషాన్, సూర్య కుమార్ యాదవ్. రెండో టీ20తో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఈ ఇద్దరూ తమ ప్రతిభను చాటారు. ఆ మ్యాచ్లో 165 పరుగుల ఛేదనలో ఓపెనర్గా వచ్చిన ఇషాన్ అనూహ్యంగా చెలరేగాడు. 32 బంతుల్లోనే 56 పరుగులు చేసి జట్టును విజయం దిశగా నడిపాడు. తొలి అంతర్జాతీయ మ్యాచ్లో.. అది కూడా ఆర్చర్ లాంటి అగ్రశ్రేణి బౌలర్లను ఎదుర్కొంటూ అలవోకగా భారీ షాట్లు ఆడిన అతని బ్యాటింగ్ అభిమానులను ఆకట్టుకుంది. తొలి ఓవర్లోనే వికెట్ పడ్డప్పటికీ.. కెప్టెన్ కోహ్లితో కలిసి ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగిన అతని తెగువ ప్రశంసనీయం. ఇక ఆ మ్యాచ్లో బ్యాటింగ్ చేసే అవకాశం దక్కని సూర్యకుమార్.. నాలుగో టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సిరీస్ కోల్పోకూడదు అంటే కచ్చితంగా నెగ్గాల్సిన ఆ మ్యాచ్లో తొలిసారి అంతర్జాతీయ క్రికెట్లో బ్యాటింగ్కు వచ్చిన సూర్య భగ్గుమన్నాడు. ఆ మ్యాచ్లో మూడో స్థానంలో బ్యాటింగ్కు దిగిన అతను.. తాను ఎదుర్కొన్న తొలి బంతినే (ఆర్చర్ బౌలింగ్) సిక్సర్గా మలచిన విధానం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అర్ధశతకంతో చెలరేగిన తను మొదట బ్యాటింగ్ చేసిన భారత్ మెరుగైన స్కోరు చేయడంలో సాయపడ్డాడు. నిర్ణయాత్మక అయిదో టీ20లోనూ 17 బంతుల్లోనే 32 పరుగులు చేసి జట్టు విజయంలో దోహదపడ్డాడు.
వన్డే హీరోలు..
ఇంగ్లాండ్తో తొలి మ్యాచ్తో.. వన్డేల్లో అరంగేట్రం చేసిన ఆల్రౌండర్ కృనాల్ పాండ్య, తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ అంచనాలకు మించి రాణించారు. బ్యాట్తో కృనాల్, బంతితో ప్రసిద్ధ్ సత్తాచాటి జట్టుకు విజయాన్ని కట్టబెట్టారు. ఇప్పటికే టీమ్ఇండియా తరపున 18 టీ20లాడిన కృనాల్.. పూర్తి ఉద్వేగభరిత వాతావరణంలో తన తొలి వన్డేలో బ్యాట్తో విధ్వంసం సృష్టించాడు. తమ్ముడు హార్దిక్ చేతుల మీదుగా టోపీ అందుకున్న తర్వాత ఈ ఏడాది జనవరిలో చనిపోయిన తండ్రిని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్న కృనాల్ మ్యాచ్ సాంతం అదే భావోద్వేగంతో కనిపించాడు. మనసులో నాన్న తిరుగుతుండగా.. మైదానంలో అతను మాత్రం బౌండరీలతో చెలరేగాడు. 260 కూడా చేయడం కష్టమనుకున్న జట్టును రాహుల్తో కలిసి ఏకంగా 300 దాటించాడు. దొరికిన బంతిని దొరికినట్లు బాదేసిన అతను కేవలం 26 బంతుల్లోనే అర్ధశతకం అందుకుని అరంగేట్ర వన్డే మ్యాచ్లో అత్యంత వేగంగా ఆ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇక తొలి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో పేసర్ ప్రసిద్ధ్ అద్భుత ప్రదర్శన చేశాడు. కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టి మ్యాచ్ను భారత్ వైపు తిప్పింది అతనే. ఓపెనర్ల దూకుడుతో ఓ దశలో 14.1 ఓవర్లలోనే 135/0తో లక్ష్యం దిశగా దూసుకెళ్తోన్న ప్రత్యర్థికి అడ్డుపడింది అతనే. తన వరుస ఓవర్లలో రాయ్తో పాటు స్టోక్స్నూ వెనక్కి పంపి భారత్ను తిరిగి పోటీలోకి తెచ్చాడు. అతని స్ఫూర్తితో తిరిగి లయ అందుకున్న బౌలర్లు ప్రత్యర్థిని కట్టడి చేశారు. ఆ తర్వాత మరో రెండు వికెట్లు పడగొట్టిన ప్రసిద్ధ్.. అరంగేట్ర వన్డేలో అత్యధిక వికెట్లు (4/54) తీసిన భారత బౌలర్గా రికార్డు నమోదు చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సాక్షి వదిన తర్వాత.. ధోనీ భయ్యా ఎత్తుకుంది నన్నే: రవీంద్ర జడేజా
ధోనీతో తనకున్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో రవీంద్ర జడేజా గుర్తు చేసుకున్నాడు. -
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. -
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సాక్షి వదిన తర్వాత.. ధోనీ భయ్యా ఎత్తుకుంది నన్నే: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ