AB devilliers: ఆర్సీబీకి బిగ్ షాక్.. క్రికెట్కు పూర్తిగా వీడ్కోలు పలికిన డివిలియర్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు ఏబీ డివిలియర్స్ దక్షిణాఫ్రికా జట్టుకు గతంలోనే రిటైర్మెంట్ ప్రకటించగా తాజాగా మొత్తం ఆటకే వీడ్కోలు పలికాడు...
ఇంటర్నెట్డెస్క్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు ఏబీ డివిలియర్స్ దక్షిణాఫ్రికా జట్టుకు గతంలోనే రిటైర్మెంట్ ప్రకటించగా తాజాగా మొత్తం ఆటకే వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా ట్విటర్లో వెల్లడించాడు. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా తనకు అవకాశం కల్పించిన అన్ని జట్లకూ కృతజ్ఞతలు తెలియజేశాడు. ఇన్నేళ్లు క్రికెటర్గా కొనసాగడం అద్భుతమైన ప్రయాణమని, కానీ.. ఇప్పుడు ఆటకు మొత్తానికే వీడ్కోలు పలకాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపాడు. దీంతో వచ్చే మెగా ఐపీఎల్ సీజన్లో డివిలియర్స్ ఆర్సీబీలోనే కాకుండా ఏ జట్టులోనూ ఆడడనే విషయం అర్థమైంది.
‘నేను చిన్నప్పుడు మా సోదరులతో కలిసి క్రికెట్ ఆడుతున్నప్పటి నుంచి ఇప్పటివరకూ ఆటను ఎంతగానో ఆస్వాదించాను. ఇప్పుడు 37 ఏళ్ల వయసులో అలాంటి కసిలేదు. ఈ ఆట నాకెంతో ఇచ్చింది. టైటాన్స్, దక్షిణాఫ్రికా, ఆర్సీబీ ఇలా ఏ జట్టు తరఫున ఆడినా నాకు చాలా మంచి అవకాశాలు కల్పించింది. దీనికి ఎల్లవేళలా రుణపడి ఉంటాను. ఈ సందర్భంగా నాతో కలిసి పనిచేసిన, ఆడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా. నేను ఎక్కడ ఆడినా మంచి ఆదరణ లభించింది. ముఖ్యంగా దక్షిణాఫ్రికా, భారత్లో విశేష గుర్తింపు దక్కింది. చివరగా నా కుటుంబ సభ్యులు, సన్నిహితుల సహకారం లేకపోతే ఇంతటి విజయం సాధ్యం కాదు. ఇకపై నా జీవితంలో మరో అధ్యాయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటా’ అని డివిలియర్స్ ట్వీట్లు చేశాడు.
ఒక శకం ముగిసింది: ఆర్సీబీ
మరోవైపు డివిలియర్స్ నిర్ణయంపై ఆర్సీబీ ఫ్రాంఛైజీ విచారం వ్యక్తం చేసింది. ఎన్నో ఏళ్లు ఆ జట్టుతో కలిసి ఆడిన అతడు బెంగళూరు ఫ్రాంఛైజీలో కోహ్లీ తర్వాత అతికీలకమైన ఆటగాడిగా నిలిచాడు. ఈ నేపథ్యంలోనే ఆర్సీబీ ఈ విధంగా స్పందించింది. ‘ఒక శకం ముగిసింది. నీలాంటి క్రికెటర్ మరొకరు లేరు. ఏబీ.. ఆర్సీబీలో లేకపోతే మేం కచ్చితంగా నిన్ను మిస్ అవుతాం. మా జట్టును, అభిమానులను, క్రికెట్ ప్రేమికులను నువ్వు ఎంతగా అలరించావో అందరికీ తెలుసు. అందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. హ్యాపీ రిటైర్మెంట్ లెజెండ్’ అని భావోద్వేగ భరితంగా స్పందించింది.
నేనిప్పుడు హాఫ్ ఇండియన్: ఏబీడీ
ఇక ఆర్సీబీ పోస్టు చేసిన మరో వీడియోలో డివిలియర్స్ మాట్లాడుతూ.. నేను ఎప్పటికీ ఆర్సీబీ అభిమానిగానే ఉంటా. ఈ జట్టులోని ప్రతి ఒక్కరూ నా కుటుంబ సభ్యులే. ఆటగాళ్లు వస్తారు. వెళతారు. కానీ, ఇక్కడుండే ప్రేమానురాగాలు ఎప్పటికీ నిలిచిపోతాయి. ఇప్పుడు నేను హాఫ్ఇండియన్ అయిపోయాను. అందుకు గర్వంగా ఉంది’ అని డివిలియర్స్ చెప్పుకొచ్చాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు