Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ కోసం అథ్లెట్లు సన్నద్ధమవ్వడం కష్టంగా ఉంటుంది: అభినవ్ బింద్రా
2024లో జరిగే పారిస్ ఒలింపిక్స్కు సన్నద్ధమవ్వడం అథ్లెట్లకు అంత తేలికకాదని, చాలా కష్టంగా ఉంటుందని ప్రముఖ షూటర్ అభినవ్ బింద్రా అభిప్రాయపడ్డారు. వచ్చే ఒలింపిక్స్కు ఇంకా మూడేళ్ల సమయమే ఉందని గుర్తుచేశారు...
ముంబయి: 2024లో జరిగే పారిస్ ఒలింపిక్స్కు సన్నద్ధమవ్వడం అథ్లెట్లకు అంత తేలికకాదని, చాలా కష్టంగా ఉంటుందని ప్రముఖ షూటర్ అభినవ్ బింద్రా అభిప్రాయపడ్డారు. వచ్చే ఒలింపిక్స్కు ఇంకా మూడేళ్ల సమయమే ఉందని గుర్తుచేశారు. దాంతో క్రీడాకారులు ఇప్పటి నుంచే మళ్లీ సాధన ప్రారంభించాలన్నారు. కరోనా కారణంగా గతేడాది జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ ఏడాది పాటు వాయిదా పడి ఇటీవలే ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వచ్చే ఒలింపిక్స్కు ఇంకా మూడేళ్ల సమయమే మిగిలి ఉందని బింద్రా ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ టోక్యో ఒలింపిక్స్లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శన చేశారని, దాంతో మునుపెన్నడూ లేని విధంగా ఏడు పతకాలతో తిరిగొచ్చారని కొనియాడారు.
‘ఇదొక చారిత్రక ప్రదర్శన. ఎప్పుడూ లేనిది మన క్రీడాకారులు ఏడు పతకాలు సాధించారు. కొందరు అద్భుత ఆటతీరుతో మైమరపిస్తే మరికొందరు గుండెకోతతో తిరిగొచ్చారు. అయితే, ఇవన్నీ క్రీడల్లో భాగమే. ఇప్పుడు మనమెంతో మెరుగయ్యాం. మున్ముందు మరిన్ని మంచి ఫలితాలు సాధిస్తాము. కానీ, వచ్చే ఒలింపిక్స్కు సన్నద్ధమయ్యేందుకు అథ్లెట్లకు కష్టంగా ఉంటుంది. ఎందుకంటే దానికి మూడేళ్ల సమయమే మిగిలి ఉంది. సహజంగా ఒలింపిక్స్లో పాల్గొన్న అథ్లెట్లకు ఏడాది పాటు విశ్రాంతి లేదా కోలుకునే సమయం ఉంటుంది. ఇప్పుడా పరిస్థితి లేదు. ఈసారి క్రీడాకారులు చాలా త్వరగా ప్రాక్టీస్ మొదలుపెట్టాలి. అలాగే వారిని ప్రారంభదశ నుంచే సరైన విధంగా ప్రోత్సహించాలి. శిక్షణలో మెరుగైన వసతులు కల్పించాలి. ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలి’ అని బింద్రా చెప్పుకొచ్చారు. కాగా, 2008 బీజింగ్ ఒలింపిక్స్లో ఈ స్టార్ షూటర్ వ్యక్తిగత విభాగంలో భారత్కు తొలి స్వర్ణం అందించిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల టోక్యో ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా జావెలిన్ త్రో విభాగంలో ఆ ఘనత సాధించి కొత్త చరిత్ర సృష్టించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.