INDvsENG: రెండో టెస్టుకు సిద్ధంగా ఉండమన్నారు.. అంతలోనే అలా జరిగింది: అశ్విన్
లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన రెండో టెస్టులో టీమ్ఇండియా 151 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. పేస్కు అనుకూలించే పిచ్పై భారత బౌలర్లు చెలరేగి ఐదో రోజు ఆతిథ్య జట్టును 120...
లండన్: లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన రెండో టెస్టులో టీమ్ఇండియా 151 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. పేస్కు అనుకూలించే పిచ్పై భారత బౌలర్లు చెలరేగి ఐదో రోజు ఆతిథ్య జట్టును 120 పరుగులకే రెండో ఇన్నింగ్స్లో కుప్పకూల్చారు. దీంతో భారత్ అనూహ్య విజయం సాధించింది. అయితే, ఆ మ్యాచ్కు ముందు అక్కడి వాతావరణం వేడిగా ఉందని, తనని సిద్ధంగా ఉండమని చెప్పారని సీనియర్ ఆఫ్స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తాజాగా వెల్లడించాడు. టీమ్ఇండియా ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్తో తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యుల చేశాడు. మ్యాచ్కు ముందు లార్డ్స్లో వాతావరణం వేడిగా ఉందని, దీంతో తుది జట్టులో ఆడేందుకు సిద్ధంగా ఉండాలని అంతకుముందే జట్టు యాజమాన్యం తనతో చెప్పిందని అశ్విన్ వివరించాడు. కానీ, ఒక్కసారిగా మ్యాచ్ ప్రారంభమయ్యే రోజు ఉదయం అనుకోకుండా వర్షం కురవడంతో తుది జట్టు నుంచి తప్పించారని తెలిపారు. అలా రెండో టెస్టులో తాను ఆడకపోవడానికి వాతావరణమే కీలక పాత్ర పోషించిందని చెప్పాడు.
అనంతరం ఇదే విషయంపై స్పందించిన శ్రీధర్.. టీమ్ఇండియాకు మేటి బౌలింగ్ యూనిట్ ఉందని పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే ప్రపంచపు అత్యుత్తమ స్పిన్నర్ను తుది జట్టులోకి తీసుకోకపోవడం అంత తేలిక కాదన్నాడు. ఇక ఈ మ్యాచ్లో ఓపెనర్ల గురించి మాట్లాడుతూ.. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేశారన్నారు. రాహుల్ శతకంతో మెరవగా, రోహిత్ తనదైన డిఫెన్స్తో ఆకట్టుకున్నాడని మెచ్చుకున్నారు. చివరగా రెండో ఇన్నింగ్స్లో 89 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పిన టెయిలెండర్లు బుమ్రా, షమి మేటి ప్రదర్శన చేశారని ప్రశంసించారు.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా 364 పరుగులు చేయగా ఇంగ్లాండ్ 391 పరుగులు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్లో భారత్ 194 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడిన సందర్భంలో షమి(56), బుమ్రా(34) నాటౌట్గా నిలిచి ఎనిమిదో వికెట్కు 89 పరుగుల అత్యంత కీలక భాగస్వామ్యం జోడించారు. ఈ క్రమంలోనే టీమ్ఇండియా రెండో ఇన్నింగ్స్ను 298/8 స్కోర్ వద్ద డిక్లేర్ చేయగా ఆపై ఇంగ్లాండ్ 120 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్లో భారత్ నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్తో బరిలోకి దిగింది. అందులో పేసర్లే 19 వికెట్లు తీయడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అర్ధశతకాలతో చెలరేగిన రాహుల్, డికాక్.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
ఐపీఎల్ 2024లో భాగంగా చెన్నైతో జరిగిన మ్యాచ్లో లఖ్నవూ 8 వికెట్ల తేడాతో గెలిచింది. 177 పరుగుల లక్ష్యాన్ని లక్నవూ 19 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. -
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
పంజాబ్పై 9 పరుగుల తేడాతో ముంబయి గెలిచింది. కానీ, ఆ జట్టుకు అంపైర్లు మద్దతుగా నిలిచారనే ఆరోపణలు వస్తున్నాయి. -
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
క్రికెటర్లు తాము కొట్టే షాట్.. లేదా తీసే వికెట్ జీవితాంతం మరిచిపోకుండా ఉంటారు. అలాంటి అనుభవం పంజాబ్ బ్యాటర్ అశుతోష్ శర్మకూ ఎదురైంది. -
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
ఐపీఎల్ 17వ సీజన్లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. తన సొంత మైదానంలో లఖ్నవూ జట్టు చెన్నైను ఢీకొట్టనుంది. -
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
అప్పన్న కల్యాణం.. జగమంతా పరవశం
-
అర్ధశతకాలతో చెలరేగిన రాహుల్, డికాక్.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!