T20 World Cup: న్యూజిలాండ్ గన్ తీసుకుంది కానీ.. బుల్లెట్లు పేల్చలేదు: మెక్కలమ్
ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్ ఓటమిపాలవ్వడంపై ఆ జట్టు మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్కలమ్ స్పందించాడు. కివీస్ గన్ తీసుకుంది కానీ, బుల్లెట్లు పేల్చలేదని వ్యాఖ్యానించాడు...
ఇంటర్నెట్డెస్క్: ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్ ఓటమిపాలవ్వడంపై ఆ జట్టు మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్కలమ్ స్పందించాడు. కివీస్ గన్ తీసుకుంది కానీ.. బుల్లెట్లు పేల్చలేదని వ్యాఖ్యానించాడు. ఆ జట్టులో నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నా సరైన ప్రదర్శన చేయలేకపోయారని పేర్కొన్నాడు. విలియమ్సన్ టీమ్ మంచి అవకాశాన్ని చేజార్చుకుందని చెప్పాడు. తుదిపోరులో కాస్త తడబడ్డారన్నాడు.
‘నేను మార్టిన్ గప్తిల్ నుంచి మరింత మంచి ఇన్నింగ్స్ ఆశించాను. అతడు 35 బంతుల్లో 28 పరుగులే చేశాడు. ఆ పద్ధతి అస్సలు బాగోలేదు. అయితే, అంతకుముందు 15 బంతుల్లో 16 పరుగులు చేశాడు. తర్వాతి 20 బంతుల్లో 12 పరుగులే చేశాడు. ఒక విధంగా చెప్పాలంటే అలాంటి పరిస్థితుల్లోనే దూకుడుగా ఆడాలి. అయితే, అక్కడే న్యూజిలాండ్ వెనుకబడిపోయింది. కీలక సమయంలో పరుగులు చేయలేకపోయింది’ అని మెక్కలమ్ తన అభిప్రాయం వెల్లడించాడు.
కాగా, ఈ మ్యాచ్లో మిగతా బ్యాట్స్మెన్ పెద్దగా స్కోర్లు సాధించకపోయినా కెప్టెన్ కేన్ విలియమ్సన్ (85; 48 బంతుల్లో 10x4, 3x6) రెచ్చిపోయాడు. చివర్లో మరింత ధాటిగా ఆడే క్రమంలో హేజిల్వుడ్ బౌలింగ్లో ఔటయ్యాడు. ఈ క్రమంలోనే న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. అనంతరం ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ డేవిడ్ వార్నర్ (53; 38 బంతుల్లో 4x4, 3x6), మిచెల్ మార్ష్ (77 నాటౌట్; 50 బంతుల్లో 6x4, 4x6) దంచికొట్టడంతో ఆ జట్టు 18.5 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేసింది. దీంతో తొలిసారి పొట్టి ప్రపంచకప్ను ముద్దాడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)