IND vs ENG: ఇంగ్లాండ్ ఓపెనర్ల శుభారంభం.. ఆసక్తిగా ఐదోరోజు ఆట
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు ఆసక్తికరంగా మారింది. నాలుగో రోజు ఆట పూర్తయేసరికి అతిథ్య జట్టు 77 పరుగులు చేసి దీటుగా బదులిచ్చింది....
లండన్: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు ఆసక్తికరంగా మారింది. నాలుగో రోజు ఆట పూర్తయేసరికి అతిథ్య జట్టు 77 పరుగులు చేసి దీటుగా బదిలిస్తోంది. ఓపెనర్లు రోరీ బర్న్స్(31; 109 బంతుల్లో 2x4), హమీద్(43; 85 బంతుల్లో 6x4) నాటౌట్గా నిలిచి శుభారంభం చేశారు. దీంతో చివరి రోజు ఆ జట్టు విజయానికి 291 పరుగులు అవసరమయ్యాయి. మరోవైపు చేతిలో పది వికెట్లు ఉండగా భారత్ విజయం సాధించాలంటే వారిని ఆలౌట్ చేయాల్సి ఉంది. అంతకుముందు రెండో ఇన్నింగ్స్లో కోహ్లీసేన 466 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. రిషభ్ పంత్ (50; 106 బంతుల్లో 4x4), శార్దూల్ ఠాకూర్ (60; 72 బంతుల్లో 7x4, 1x6) అర్ధశతకాలతో రాణించారు. వీరిద్దరూ శతక భాగస్వామ్యం జోడించడంతో పాటు టెయిలెండర్లు ఉమేశ్ యాదవ్(25; 23 బంతుల్లో 1x4, 2x6), జస్ప్రిత్ బుమ్రా (24; 38 బంతుల్లో 4x4) వీలైనన్ని పరుగులు చేసి జట్టు భారీ స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించారు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 99 పరుగులు కలిసివచ్చి ఆ జట్టు లక్ష్యాన్ని 368 పరుగులకు తగ్గింది.
ఆదివారం 270/3 ఓవర్నైట్ స్కోర్తో నాలుగో రోజు ఆట కొనసాగించిన భారత్ మరో 196 పరుగులు జోడించి మిగిలిన ఏడు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ కోహ్లీ (44; 69 బంతుల్లో 7x4), జడేజా (17; 59 బంతుల్లో 3x4) నాలుగో వికెట్కు అర్ధశతక భాగస్వామ్యం నిర్మించారు. అయితే, క్రిస్వోక్స్ స్వల్ప వ్యవధిలో జడేజా, రహానె (0)ను వికెట్లముందు దొరకబుచ్చుకొని భారత్కు గట్టి షాకిచ్చాడు. మరోవైపు నిలకడగా ఆడిన కోహ్లీ అర్ధశతకానికి ముందు మొయిన్ అలీ బౌలింగ్లో స్లిప్లో ఓవర్టన్ చేతికి చిక్కాడు. దాంతో భారత్ 312 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఇక రెండో సెషన్లో ధాటిగా ఆడిన పంత్, శార్దూల్ ఇంగ్లాండ్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించారు. వేగంగా పరుగులు తీస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలోనే ఇద్దరూ అర్ధశతకాలు సాధించారు. అయితే, వేగంగా ఆడుతున్న వీరు వరుస ఓవర్లలో ఔటయ్యారు. తొలుత రూట్ బౌలింగ్లో శార్దూల్ స్లిప్లో ఓవర్టన్కు దొరికిపోగా, తర్వాతి ఓవర్లోనే మొయిన్ అలీ బౌలింగ్లో పంత్ రిటర్న్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఉమేశ్ యాదవ్, బుమ్రా మరో వికెట్ పడకుండా రెండో సెషన్ పూర్తి చేశారు. అప్పటికి జట్టు స్కోర్ 445/8గా ఉంది. ఇక మూడో సెషన్ ప్రారంభమైన కాసేపటికే ఇద్దరూ ఔటవ్వడంతో టీమ్ఇండియా రెండో ఇన్నింగ్స్కు తెరపడింది. ఇంగ్లాండ్ బౌలర్లలో వోక్స్ మూడు, మొయిన్ అలీ, రాబిన్సన్ రెండు వికెట్లు తీయగా అండర్సన్, ఓవర్టన్, రూట్ తలో వికెట్ తీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్