INDvsENG: ఇంగ్లాండ్ ఆటగాళ్ల నోటి దురుసు.. టీమ్ఇండియా విజయ పరంపర
టీమ్ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఏ క్రికెట్ మ్యాచ్ అయినా రసవత్తరంగా ఉంటుంది. ఇరు జట్లలోనూ నాణ్యమైన ఆటగాళ్లుంటారు. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించాలని చూస్తారు...
టీమ్ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఏ క్రికెట్ మ్యాచ్ అయినా రసవత్తరంగా ఉంటుంది. ఇరు జట్లలోనూ నాణ్యమైన ఆటగాళ్లుంటారు. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించాలని చూస్తారు. ఈ క్రమంలోనే పలుమార్లు క్రికెటర్లమనే సంగతి మరిచిపోయి నోటికి పనిచెప్తారు. ముఖ్యంగా ఇంగ్లిష్ ప్లేయర్లు ఇష్టమొచ్చినట్లు దూషిస్తారు. అవి ఒక పరిమితి వరకైతే ఫర్వాలేదు కానీ.. శ్రుతి మించితే టీమ్ఇండియా నుంచి దీటైన సమాధానం ఉంటుంది. తాజాగా జరిగిన రెండో టెస్టులోనూ ఇలాంటి సంఘటనలే చోటుచేసుకున్నాయి. దాంతో గతంలో ఇరు జట్ల మధ్య జరిగిన కొన్ని వివాదాస్పద సంగతులు గుర్తుచేసుకుందాం.
ఫ్లింటాఫ్ రెచ్చగొట్టి.. యువీ మెరుపులు
2007 టీ20 ప్రపంచకప్ దాదాపు అందరికీ గుర్తుండి ఉంటుంది. సెమీస్కు ముందు ఇంగ్లాండ్తో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీమ్ఇండియా ఆల్రౌండర్ యువరాజ్సింగ్ రెచ్చిపోయాడు. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో ఆరు సిక్సర్లు సంధించి భారత క్రికెట్లో అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్కు పీడకల మిగిల్చాడు. అయితే, యువీ అలా రెచ్చిపోవడానికి కూడా ఓ కారణం ఉందనే సంగతి కొందరికి తెలిసే ఉంటుంది. మాజీ ప్లేయర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ అంతకుముందు ఓవర్లో యువరాజ్ను పీక కోస్తా అనే మాటలు అన్నాడు. దాంతో రెచ్చిపోయిన భారత బ్యాట్స్మన్ తర్వాతి ఓవర్లో బ్రాడ్ను చితకబాదాడు. అప్పుడు ఫ్లింటాఫ్ నోరు అదుపులో పెట్టుకొని ఉంటే ఆ రికార్డు నమోదయ్యేది కాదేమో!
ఆండర్సన్ బూతులు.. జడేజాకు కోతలు
ఇక 2014 ఇంగ్లాండ్ పర్యటనలో ఇంగ్లాండ్ స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్.. టీమ్ఇండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను బూతులు తిట్టాడు. తొలి టెస్టు రెండో రోజు భోజన విరామ సమయంలో ఇరు జట్ల ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లేటప్పుడు జడ్డూను వెనక్కిలాగిన ఇంగ్లిష్ పేసర్.. పరుష పదాలు ఉపయోగించి డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లిపో అంటూ బెదిరించాడు. భోజన విరామం అనంతరం కూడా అండర్సన్ తనని దూషించాడని టీమ్ఇండియా ఆల్రౌండర్ పేర్కొన్నాడు. ఈ సంఘటనపై ఇరు జట్లు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నాయి. చివరికి ఐసీసీ కలగజేసుకొని విచారణ జరిపి సరైన సాక్ష్యాలు లేవని జడ్డూకే మ్యాచ్ ఫీజ్లో 50 శాతం కోత విధించింది. కాగా, ఈ మ్యాచ్లో అంపైర్ ఆక్సెన్ఫర్డ్ సైతం పలుమార్లు అండర్సన్ బూతు మాటలు పలకడం విన్నానని చెప్పాడు. ఇక ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది.
స్టోక్స్ మాటలు.. కోహ్లీ తూటాలు
ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లాండ్ జట్టు భారత పర్యటనకు వచ్చినప్పుడు కూడా బెన్స్టోక్స్ టీమ్ఇండియా ఆటగాళ్లపై నోరుపారేసుకున్నాడు. నాలుగో టెస్టు తొలి రోజు స్టోక్స్ బ్యాటింగ్ చేస్తుండగా మహ్మద్ సిరాజ్ వేసిన ఓ బంతి బౌన్సర్గా వెళ్లింది. దాంతో కోపోద్రిక్తుడైన అతడు సిరాజ్ను ఏవో మాటలన్నాడు. అయినా, సిరాజ్ తిరిగి స్పందించకుండా బౌలింగ్ చేశాడు. అదే సమయంలో కెప్టెన్ కోహ్లీ కలగజేసుకొని స్టోక్స్తో మాట్లాడటానికి ప్రయత్నించాడు. దాంతో మరింత రెచ్చిపోయిన ఇంగ్లిష్ ఆల్రౌండర్ మరిన్ని మాటలన్నాడు. కోహ్లీ సైతం అంతే దీటుగా మాటలతూటాలు పేల్చాడు. అయితే, అంపైర్లు కలగజేసుకొని ఇద్దరినీ సముదాయించడంతో వివాదం అక్కడితో సద్దుమణిగింది. ఈ మ్యాచ్లో టీమ్ఇండియా ఘన విజయం సాధించడమే కాకుండా 3-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది.
బట్లర్ నోరుజారి.. కోహ్లీకి కోపమొచ్చి
అదే పర్యటనలో ఇరు జట్ల మధ్య జరిగిన ఐదో టీ20లోనూ మరో ఇంగ్లాండ్ బ్యాట్సమన్ జోస్ బట్లర్.. టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో మాటల యుద్ధానికి దిగాడు. తొలుత అతడు ఏవో మాటలన్నా కోహ్లీ పెద్దగా పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ విజయం వైపు పరుగెడుతున్న సమయంలో భువి వేసిన 13వ ఓవర్లో బట్లర్(52) ఔటయ్యాడు. దాంతో మ్యాచ్ భారత్వైపు మళ్లింది. అదే సమయంలో బట్లర్ ఏదో అనుకుంటూ డ్రెస్సింగ్ రూమ్ బాటపట్టాడు. దాంతో కోహ్లీ సైతం కోపంలో దీటుగా స్పందించాడు. ఈ క్రమంలోనే బట్లర్ తిరిగి పిచ్వైపు రావడానికి చూడగా కోహ్లీ మరింత ఆగ్రహానికి గురయ్యాడు. కాగా, ఈ మ్యాచ్లో టీమ్ఇండియా విజయం సాధించి పొట్టి కప్పును కూడా ఎగరేసుకుపోయింది.
అండర్సన్తో మొదలై.. భారత్ గెలిచేదాకా
ఇక తాజాగా లార్డ్స్లో జరిగిన రెండో టెస్టులోనూ ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో అండర్సన్ బ్యాటింగ్ చేసేటప్పుడు బుమ్రా పలుమార్లు షార్ట్పిచ్ బంతులు వేశాడు. దాంతో ఇబ్బంది పడిన అతడు ఇలా బంతులెందుకు వేస్తున్నావని అడిగాడు. అనంతరం ఇన్నింగ్స్ పూర్తయ్యాక బుమ్రా వెళ్లి అతడికి క్షమాపణలు చెప్పాలని చూసినా బూతులు తిడుతూ అవమానించాడని తెలిసింది. అంతకుముందు రోజు కూడా టీమ్ఇండియా రెండో ఇన్నింగ్స్లో అండర్సన్, కోహ్లీల మధ్య మాటలు పేలాయి. ఇంగ్లిష్ పేసర్ పిచ్ మధ్యలో పరుగెత్తడం గమనించిన కోహ్లీ అంపైర్కు ఫిర్యాదు చేశాడు. దాంతో అండర్సన్ ఏవో మాటలన్నాడు. కోహ్లీ సైతం అదే స్థాయిలో జవాబిచ్చాడు. ఇక చివరి రోజు కూడా బుమ్రా బ్యాటింగ్ చేసేటప్పుడు మార్క్వుడ్ దూషించాడు. ఆ విషయంపై బుమ్రా అంపైర్కు ఫిర్యాదు చేశాడు. అదే సమయంలో బట్లర్ కలగజేసుకొని బుమ్రాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. చివరికి ఈ మ్యాచ్లోనూ భారత్ ఘన విజయం సాధించింది.
- ఇంటర్నెట్డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్లో న్యూజిలాండ్ క్రికెట్ ప్రసార హక్కులు ఎస్పీఎన్ఐ సొంతం
న్యూజిలాండ్ పురుషుల (బ్లాక్ క్యాప్స్), మహిళల (వైట్ ఫెర్న్స్) క్రికెట్ జట్ల మ్యాచ్లను వచ్చే ఏడేళ్ల పాటు భారత్, అనుబంధ ప్రాంతాల్లో ప్రసారం చేసేందుకు సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా (ఎస్పీఎన్ఐ) టెలివిజన్, డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు. -
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
దాదాపు రెండు నెలలపాటు క్రికెట్ అభిమానులను అలరించే ఐపీఎల్.. రికార్డులను ఖాతాలో వేసుకుంటోంది. -
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యను ముంబయి మేనేజ్మెంట్ కెప్టెన్గా నియమించుకుంది. దీంతో సోషల్ మీడియాలో ఆ ఫ్రాంచైజీపై ట్రోలింగ్ వచ్చింది. ఇప్పుడు ముంబయి వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోవడంతో పాండ్య సారథ్యంపై విమర్శల దాడి ఎక్కువైంది. -
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
తన అభిమాన క్రికెటర్తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం ఎప్పటికీ మరిచిపోలేనని చెన్నై ఆటగాడు సమీర్ రిజ్వీ వ్యాఖ్యానించాడు. -
గత సీజన్లో విదేశీ క్రికెటర్లకు ఆ కోచ్ తీరు నచ్చలేదు: కోల్కతా మాజీ ఆటగాడు
కోల్కతా ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిత్ వల్ల చాలామంది విదేశీ క్రికెటర్లు ఇబ్బందిపడ్డారని నమీబియా క్రికెటర్ వ్యాఖ్యానించడం సంచలనమైంది. -
మా బౌలర్ల తప్పేమీ లేదు.. హైదరాబాద్ బ్యాటర్లకు హ్యాట్సాఫ్: హార్దిక్ పాండ్య
ముంబయి బౌలర్లు భారీగా పరుగులు ఇవ్వడంతో హైదరాబాద్ రికార్డు స్కోరును నమోదు చేసి చరిత్ర సృష్టించింది. దీంతో ఐపీఎల్ 17వ సీజన్లో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. -
‘అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఆమె’.. నెట్టింట వైరల్గా మారిన కావ్యా మారన్
కావ్యా మారన్.. సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ యజమాని. ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ భారీ స్కోరు సాధించడంతో ఆమె ఒక్కసారిగా నెట్టింట వైరల్గా మారారు. -
ముంబయి లక్ష్య ఛేదన దిశగా వస్తుందని భావించారా? ప్యాట్ కమిన్స్ సమాధానమిదే!
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ బోణీ కొట్టింది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబయిని చిత్తు చేసింది. -
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
ఉప్పల్ వేదికగా ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో పలు రికార్డులు నమోదు అయ్యాయి. -
ఉప్పల్ ఊగిపోయింది
ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్లో సన్రైజర్స్ అద్వితీయమైన బ్యాటింగ్తో అదరగొట్టింది. బ్యాటర్లు మెషీన్ గన్నుల్లా పేలడంతో ఐపీఎల్లో రికార్డు స్కోరుతో సత్తాచాటింది. తొలి మ్యాచ్లో త్రుటిలో ఓడినా.. రెండో పోరులో చిరస్మరణీయ విజయం అందుకుంది. -
ఇది సన్రైజర్సేనా?
సన్రైజర్స్ అంటే.. నత్తనడక బ్యాటింగ్కు మారు పేరు! సన్రైజర్స్ బ్యాటర్లది.. స్ట్రైక్రేట్లో ఎప్పుడూ వెనుకంజే! సన్రైజర్స్ మెరుపులన్నీ బౌలింగ్ వరకే! కానీ ఇదంతా పాత కథ! -
సింధు శుభారంభం
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. -
సెమీస్లో బోపన్న జోడీ
44 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్న భారత టెన్నిస్ వెటరన్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న మరో టైటిల్ దిశగా సాగుతున్నాడు. -
ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీలో శ్రీజేష్
అంతర్జాతీయ హాకీ సమాఖ్య నూతన ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీ సహ అధ్యక్షుడిగా భారత హాకీ వెటరన్ గోల్కీపర్ శ్రీజేష్ నియమితుడయ్యాడు. -
‘ఇంపాక్ట్ ప్లేయర్’ వల్లే ధోని అలా..
కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు. ఆటగాడిగా కూడా ఇదే చివరి సీజన్ అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేంద్ర ధోని బ్యాటు పట్టి కొన్ని మెరుపులు మెరిపిస్తే చూడాలన్నది అభిమానుల ఆశ. -
కోచ్కు జకోవిచ్ టాటా
కోచ్ గోరాన్ ఇవానిసెవిచ్తో ఆరేళ్ల బంధానికి జకోవిచ్ వీడ్కోలు పలికాడు. 2018లో ఇవానిసెవిచ్తో కలిసి జకోవిచ్ ప్రయాణం ప్రారంభించాడు. -
సచిన్ గోల్ఫాట
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ గోల్ఫ్ స్టిక్ చేతబట్టాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బౌల్డర్హిల్స్ క్లబ్లో బుధవారం గోల్ఫ్ ఆడాడు. -
భారత్-పాక్ సిరీస్.. ఆసీస్ ఆసక్తి
భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్కు ఆతిథ్యమివ్వడానికి ఆస్ట్రేలియా మరోసారి ఆసక్తి వ్యక్తం చేసింది. -
ముంబయిలో హార్దిక్కు మరింతగా..
రోహిత్ శర్మ స్థానంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా ఎంపికైన హార్దిక్ పాండ్యకు సామాజిక మాధ్యమాల్లోనే కాదు మైదానాల్లోనూ తీవ్ర వ్యతిరేకత తప్పడం లేదు. -
మళ్లీ బాబర్కే పగ్గాలు!
పాకిస్థాన్ క్రికెట్ జట్టు పగ్గాలు మళ్లీ బాబర్ అజామ్ చేతికి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అతణ్ని మరోసారి జట్టు కెప్టెన్గా నియమించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
వరంగల్ జకోటియా షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు