Virat Kohli: కోహ్లీ దూకుడు ఇష్టమే..కానీ: ఫరూక్
క్రికెట్ మైదానంలో ప్రత్యర్థులతో వాగ్వాదానికి దిగినప్పుడు కెప్టెన్ విరాట్ కోహ్లీ దూకుడు ఇష్టమే అయినా అతడు అదుపులో ఉండాలని మాజీ కీపర్, బ్యాట్స్మన్ ఫరూక్ ఇంజినీర్ అన్నాడు...
ఇంటర్నెట్డెస్క్: క్రికెట్ మైదానంలో ప్రత్యర్థులతో వాగ్వాదానికి దిగినప్పుడు కెప్టెన్ విరాట్ కోహ్లీ దూకుడు ఇష్టమే అయినా అతడు అదుపులో ఉండాలని మాజీ కీపర్, బ్యాట్స్మన్ ఫరూక్ ఇంజినీర్ సూచించాడు. అనవసర విషయాలకు వెళ్లి పరిస్థితులు చేయిదాటిపోయేలా చేసుకోవద్దన్నాడు. ఇటీవల ఇంగ్లాండ్తో జరిగిన రెండో వన్డేలో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య భీకర పోరు జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పలు సందర్భాల్లో ఇంగ్లాండ్ ఆటగాళ్లు తమ నోటికి పనిచెప్పారు. దాంతో కెప్టెన్ విరాట్ సైతం అంతే దీటుగా వారికి జవాబిచ్చాడు. ఈ విషయంపైనే ఫరూక్ ఇంజినీర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.
‘ప్రత్యర్థులతో దూకుడుగా ఉండే విషయంలో నేను కోహ్లీని ఎంతో ఇష్టపడతాను. అతడో స్ఫూర్తిదాయక సారథి. ఎల్లప్పుడూ మైదానంలో చురుగ్గా ఉంటాడు. ఎవరైనా అలాగే ఉండాలి. అయితే, అది పరిమితులకు మించి ఉండకూడదు. లేకపోతే అంపైర్లు లేదా మ్యాచ్ రిఫరీలు కలుగజేసుకుంటే వివాదం పెద్దది అవుతుంది. అలాగే విరాట్ కొన్నిసార్లు తన కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. కానీ, నాకు అతడి తీరు ఎంతో ముచ్చటేస్తుంది. అతడో మేటి సారథి. అందులో ఎలాంటి అనుమానం లేదు. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్మన్ అతడు’ అంటూ ఫరూక్ పొగడ్తల వర్షం కురిపించాడు. ఇక రెండో టెస్టులో ఇంగ్లాండ్ ఆటగాళ్లు కవ్వింపులకు దిగారని, దాంతో భారత బ్యాట్స్మెన్ను మానసికంగా దెబ్బతీయాలని చూశారని మాజీ క్రికెటర్ పేర్కొన్నాడు. బుమ్రా, షమి అద్భుతంగా ఆడి దీటుగా జవాబిచ్చారన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.