AP NEWS: విజయవాడలో పీవీ సింధుకు ఘన స్వాగతం

విజయవాడ చేరుకున్న ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత పీవీ సింధుకు ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర మంత్రులు ధర్మాన కృష్ణదాస్‌, అవంతి శ్రీనివాస్‌, జిల్లా కలెక్టర్‌ నివాస్‌ తదితరులు...

Published : 06 Aug 2021 01:52 IST

విజయవాడ: విజయవాడ చేరుకున్న ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత పీవీ సింధుకు ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర మంత్రులు ధర్మాన కృష్ణదాస్‌, అవంతి శ్రీనివాస్‌, జిల్లా కలెక్టర్‌ నివాస్‌ తదితరులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పీవీ సింధు మాట్లాడుతూ.. ఒలింపిక్స్‌లో పతకం తేవడం సంతోషంగా ఉందన్నారు. ఒలింపిక్స్‌కు వెళ్లే ముందు అండగా ఉంటామని సీఎం జగన్‌ భరోసా ఇచ్చారని గుర్తు చేశారు. తనపై అభిమానం చూపిన వారికి పతకం అంకితమిస్తున్నానని సింధు చెప్పారు. తెలుగమ్మాయి ఒలింపిక్స్‌లో పతకం సాధించడం సంతోషంగా ఉందని మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. యువత సింధును ఆదర్శంగా  తీసుకోవాలన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని