పగలు కలెక్టర్.. రాత్రి బ్యాడ్మింటన్ ప్లేయర్!
ప్రపంచ శ్రేణి క్రీడల్లో పాల్గొనే ఏ అథ్లెట్ అయినా పతకాలు సాధించాలని బలంగా కోరుకుంటారని, అందుకు తానూ మినహాయింపేమీ కాదన్నారు యూపీలోని నోయిడా జిల్లా మెజిస్ట్రేట్ సుహాస్ యతిరాజ్ అన్నారు..........
పారాలింపిక్స్లో పతకమే లక్ష్యం..
ఇంటర్నెట్డెస్క్: ప్రపంచ శ్రేణి క్రీడల్లో పాల్గొనే ఏ అథ్లెట్ అయినా పతకాలు సాధించాలని బలంగా కోరుకుంటారని, అందుకు తానూ మినహాయింపేమీ కాదన్నారు యూపీలోని నోయిడా జిల్లా మెజిస్ట్రేట్ సుహాస్ యతిరాజ్ అన్నారు. ఆగస్టు 24నుంచి ప్రారంభమయ్యే పారాలింపిక్స్ క్రీడల్లో ఐఏఎస్ అధికారి బ్యాడ్మింటన్ విభాగంలో పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే శనివారం మీడియాతో ముచ్చటించిన ఆయన తన అభిప్రాయాలు పంచుకున్నారు. సుహాస్ పారా-బ్యాడ్మింటన్ విభాగంలో ప్రపంచంలో మూడో ర్యాంకులో కొనసాగుతున్నారు.
‘విజయాలకు, వైఫల్యాలకు తేడా చాలా చిన్నది. ఏళ్లుగా మనందరం ఇది చూస్తూనే ఉన్నాం. నేను కూడా సెంటిమీటర్ల తేడాతో విజయాలు, మిల్లీమీటర్ల తేడాతో ఓటమిలు చవిచూసినవాడినే. రాబోయే పారాలింపిక్స్ క్రీడల్లో ఇతర అథ్లెట్లలాగే నేనూ పతకం సాధించాలనుకుంటున్నా. అలాగే నేను భగవద్గీతను కూడా బలంగా నమ్ముతా. అందులో చెప్పినట్లు మన పని మనం చేస్తే.. ఫలితం దానంతట అదే వస్తుంది. అందుకోసం మనం కృషి చేయాలి. మరోవైపు, ప్రస్తుత పరిస్థితుల్లోనూ నేను ఒత్తిడికి గురికావట్లేదు. ఇప్పుడు పారా-బ్యాడ్మింటన్ విభాగంలో ప్రపంచ మూడో ర్యాంకులో ఉన్నందున కచ్చితంగా పతకం సాధించాలని అనుకుంటున్నా’ అని సుహాస్ పేర్కొన్నారు.
ఇక కరోనా విపత్కర పరిస్థితుల్లో అటు ఉద్యోగం, ఇటు బ్యాడ్మింటన్ను ఎలా సమన్వయం చేసుకున్నారని అడిగిన ప్రశ్నకు.. రెండింటిపై తనకున్న అంకితభావం, ప్రేమే సమన్వయం చేసుకొనేలా చేశాయని చెప్పారు. ఏడాదిన్నరగా పగలు వృత్తి పరమైన విధులు నిర్వర్తించేవాడినని, రాత్రి వేళ బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ చేసేవాడినని నోయిడా మెజిస్ట్రేట్ వివరించారు. అలాగే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను తల్లిదండ్రులు పూర్తిగా ప్రోత్సహించాలని, దాంతో వారు ఏదైనా సాధించగలరని ఆయన సూచించారు. ఈ క్రమంలోనే తాను ఇప్పటివరకు ఏది సాధించినా అది తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనన్నారు. తనకు నచ్చిందల్లా చెయ్యమని ప్రోత్సహించారని, అందువల్లే తానీ స్థితిలో ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ ప్రయాణం అంత తేలిక కాకపోయినా పట్టుదలతో కృషి చేయాలని సుహాస్ సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.