IND vs NZ: కోహ్లీని అధిగమించిన గప్తిల్.. ఇంకొన్ని ఆసక్తికర రికార్డులు..!
టీమ్ఇండియా టీ20 మాజీ సారథి విరాట్ కోహ్లీని న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ అధిగమించాడు.
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా టీ20 మాజీ సారథి విరాట్ కోహ్లీని న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ అధిగమించాడు. పొట్టి ఫార్మాట్లో ఇన్ని రోజులు టాప్ స్కోరర్గా కొనసాగుతున్న విరాట్ను అతడు వెనక్కినెట్టాడు. తాజాగా ఇరు జట్ల మధ్య రాంచీలో జరిగిన రెండో టీ20లో ఈ విశేషం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్కు ఓపెనర్లు శుభారంభం చేశారు. మార్టిన్ గప్తిల్ (31; 15 బంతుల్లో 3x4, 2x6), డారిల్ మిచెల్ (31; 28 బంతుల్లో 3x4) తొలి వికెట్కు 48 పరుగులు జోడించారు. దీపక్ చాహర్ వేసిన ఐదో ఓవర్లో రెండో బంతికి గప్తిల్ ఔటయ్యాడు. ఈ క్రమంలోనే టీ20ల్లో విరాట్ కోహ్లీ 3,227 అత్యధిక పరుగుల రికార్డును గప్తిల్(3,248 పరుగులు) అధిగమించాడు. మరోవైపు ప్రస్తుత సారథి రోహిత్ శర్మ 3,141 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు.
సిక్సర్లలో గ్లెన్ ఫిలిప్స్ టాప్..
ఈ మ్యాచ్ ద్వారా న్యూజిలాండ్ బ్యాట్స్మన్ గ్లెన్ ఫిలిప్స్ కూడా ఒక రికార్డు నెలకొల్పాడు. ఒక క్యాలెండర్ ఇయర్లో అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక సిక్సర్లు (97) సాధించిన ఆటగాళ్ల టాప్ 9 జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో ఫిలిప్స్ మినహా మిగతా అందరూ వెస్టిండీస్ ఆటగాళ్లే ఉండటం గమనార్హం. చాప్మన్ (21) ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన ఫిలిప్స్ (34; 21 బంతుల్లో 1x4, 3x6) ఉన్న కాసేపు ధాటిగా ఆడి మూడు సిక్సులు బాదాడు. దీంతో అత్యధిక సిక్సర్ల జాబితాలో చేరాడు.
రోహిత్-రాహుల్ డబుల్ ధమాకా..
ఇక టీమ్ఇండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ టీ20ల్లో ఈనెలలోనే రెండోసారి శతక భాగస్వామ్యం జోడించారు. టీ20 ప్రపంచకప్లో అఫ్గానిస్థాన్తో ఆడిన మ్యాచ్లో చెలరేగిన వీరిద్దరూ తొలి వికెట్కు 140 పరుగులు జోడించిన విషయం తెలిసిందే. అలాగే గతరాత్రి కివీస్తో జరిగిన మ్యాచ్లోనూ 117 పరుగులతో మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. మరోవైపు వీరిద్దరూ టీ20ల్లో వరుసగా ఐదు అర్ధశతక భాగస్వామ్యాలు కూడా జోడించారు. ఇంకో విశేషం ఏమిటంటే.. పొట్టి క్రికెట్లో ఒక క్యాలెండర్ సంవత్సరంలో రోహిత్-ధావన్, రోహిత్-విరాట్, రోహిత్-రాహుల్ మాత్రమే రెండేసిసార్లు శతక భాగస్వామ్యాలు నెలకొల్పారు.
రోహిత్తో సౌథీ.. తగ్గేదేలే..
న్యూజిలాండ్ పేసర్ టిమ్సౌథీ ఈ మ్యాచ్లోనూ టీమ్ఇండియా బ్యాట్స్మెన్పై ఎప్పటిలాగే రెచ్చిపోయాడు. మరీ ముఖ్యంగా రోహిత్ను 11వ సారి ఔట్ చేసి అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సార్లు హిట్మ్యాన్ను పెవిలియన్ చేర్చిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. మొత్తంగా టీ20ల్లో నాలుగు సార్లు, వన్డేల్లో ఐదుసార్లు, టెస్టుల్లో రెండు సార్లు సౌథీ.. రోహిత్ వికెట్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్లో అతడు నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి 16 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
బెంగళూరు - కోల్కతా జట్ల మధ్య ఆసక్తికర పోరు నేడు. ఇరు జట్లలోనూ కీలక ఆటగాళ్లు ఉన్నారు. -
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
బెంగళూరు, కోల్కతా జట్ల మధ్య మ్యాచ్ నేపథ్యంలో అందరి దృష్టి ఇద్దరి క్రికెటర్లపైనే ఉంది. -
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
ధోనీతో తనకున్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో రవీంద్ర జడేజా గుర్తు చేసుకున్నాడు. -
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. -
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్