IND vs NZ: స్పిన్నర్లే న్యూజిలాండ్‌ను కట్టడి చేశారు: సంజయ్‌ బంగర్‌

న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో రోహిత్‌సేన క్లీన్‌స్వీప్‌ చేయడంలో స్పిన్నర్లు కీలక పాత్రపోషించారని టీమ్‌ఇండియా మాజీ బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ అభిప్రాయపడ్డాడు...

Updated : 22 Nov 2021 15:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో రోహిత్‌సేన క్లీన్‌స్వీప్‌ చేయడంలో స్పిన్నర్లు కీలక పాత్రపోషించారని టీమ్‌ఇండియా మాజీ బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ అభిప్రాయపడ్డాడు. మధ్య ఓవర్లలో వారు చక్కగా బౌలింగ్‌ చేశారని చెప్పాడు. తొలుత కివీస్‌ ఓపెనర్లు భారత బౌలర్లపై కాస్త ఆధిపత్యం చెలాయించారని, అయితే.. మధ్య ఓవర్లలో స్పిన్నర్లు బాగా కట్టడి చేశారని గుర్తుచేశాడు.

రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌ కివీస్‌ బ్యాట్స్‌మెన్‌పై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించారని బంగర్‌ చెప్పుకొచ్చాడు. దీంతో టీమ్‌ఇండియాకు బాగా కలిసివచ్చిందన్నాడు. అలాగే హర్షల్‌ పటేల్‌ సైతం ఈ సిరీస్‌లో రాణించాడని మెచ్చుకున్నాడు. అతడు అరంగేట్రం మ్యాచ్‌లోనే అదిరిపోయే ప్రదర్శన చేశాడని, తన స్లో బౌలింగ్‌ వైవిధ్యంతో మరింత ఆకట్టుకున్నాడని తెలిపాడు. మంచు ప్రభావం ఉన్నా అద్భుతంగా బౌలింగ్‌ చేశాడని, స్లో పిచ్‌ బంతులు, బౌన్సర్లతో అనేక వేరియేషన్స్‌ చూపించాడని తెలిపాడు. ఇది టీమ్‌ఇండియాకు ఎంతో మంచిదని బంగర్‌ విశ్లేషించాడు.

Read latest Sports News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని