IND vs NZ: భారత్లో సవాళ్లకు సిద్ధం: ఆజాజ్ పటేల్
భారత్లో సవాళ్లు ఎదుర్కొంనేందుకు సిద్ధంగా ఉన్నానని న్యూజిలాండ్ స్పిన్నర్ ఆజాజ్ పటేల్ అన్నాడు. ముంబయిలో పుట్టిన అతడు 8 ఏళ్ల వయసులో కుటుంబంతో కివీస్కు వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు...
ముంబయిలో పుట్టి న్యూజిలాండ్ స్పిన్నర్గా ఎదిగి..
ఇంటర్నెట్డెస్క్: భారత్లో సవాళ్లు ఎదుర్కొంనేందుకు సిద్ధంగా ఉన్నానని న్యూజిలాండ్ స్పిన్నర్ ఆజాజ్ పటేల్ అన్నాడు. ముంబయిలో పుట్టిన అతడు 8 ఏళ్ల వయసులో కుటుంబంతో కివీస్కు వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. ఈ క్రమంలోనే న్యూజిలాండ్ జట్టులో స్పిన్నర్గా ఎదిగాడు. మరో రెండు రోజుల్లో టీమ్ఇండియాతో టెస్టు సిరీస్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆజాజ్ స్వదేశంలో ప్రత్యర్థి జట్టు ఆటగాడిగా ఆడటం ఆసక్తిగా ఉందన్నాడు.
‘భారత్లో స్పిన్నర్గా రాణించడం సవాళ్లతో కూడుకున్నది. అయినా, ఇక్కడ ఆడేందుకు నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఇక్కడ వినియోగించే ఎస్జీ బంతి కచ్చితంగా వైవిధ్యమైందని చెప్పగలను. అది అటుఇటుగా డ్యూక్ బంతిలాగే ఉంటుంది. ఈ బంతి కొంచెం గట్టిగా ఉండటంతో బౌలింగ్ చేసేందుకు గ్రిప్ సాధించాను. మా సన్నద్ధం కూడా బాగా సాగుతోంది. మైదానంలో దిగేందుకు ఇంకా సమయం ఉన్నందున ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడటం ముఖ్యమైన విషయం’ అని అజాజ్ చెప్పుకొచ్చాడు.
ఇక తన సహచర స్పిన్నర్ సోమర్విల్లే గురించి వివరిస్తూ.. తాము ఒకరికి ఒకరు సహకరించుకుంటామని, విలువైన సూచనలు చేసుకుంటామని అజాజ్ పేర్కొన్నాడు. సోమర్విల్లే తగిన ఎత్తులో బౌన్స్తో కూడిన బంతులు వేస్తే తాను లోపిచ్ బంతులు వేస్తానన్నాడు. తమ ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉందన్నాడు. ఇదివరకు పలు మ్యాచ్లు కలిసి ఆడామని, ఇప్పుడు భారత్లో మరోసారి ఆ అవకాశం దక్కిందని తెలిపాడు. కాగా, గురువారం నుంచి ప్రారంభమయ్యే రెండు టెస్టుల సిరీస్లో న్యూజిలాండ్ ఈ ఇద్దరి స్పిన్నర్లనే బరిలోకి దింపనుందని తెలిసింది. కాగా, ఇప్పటివరకూ కివీస్ తరఫున 9 టెస్టులు ఆడిన ఆజాజ్ 26 వికెట్లు తీశాడు. భారత్లో ఎలా రాణిస్తాడో వేచిచూడాలి.
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.