INDvsSL: గర్జించిన గబ్బర్ సేన
శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. ఆతిథ్య జట్టు నిర్దేశించిన 263 పరుగుల లక్ష్యాన్ని గబ్బర్సేన మూడు వికెట్లు కోల్పోయి 36.4 ఓవర్లలో ఛేదించింది. కెప్టెన్ శిఖర్ ధావన్ (86 నాటౌట్; 95 బంతుల్లో 6x4, 1X6), అరంగేట్రం బ్యాట్స్మన్ ఇషాన్ కిషన్ (59; 42 బంతుల్లో
మూడు వన్డేల సిరీస్లో భారత్ శుభారంభం
తొలి వన్డేలో టీమ్ఇండియా ఘన విజయం..
కొలంబో: శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. ఆతిథ్య జట్టు నిర్దేశించిన 263 పరుగుల లక్ష్యాన్ని గబ్బర్సేన మూడు వికెట్లు కోల్పోయి 36.4 ఓవర్లలో ఛేదించింది. కెప్టెన్ శిఖర్ ధావన్ (86 నాటౌట్; 95 బంతుల్లో 6x4, 1X6), అరంగేట్రం బ్యాట్స్మన్ ఇషాన్ కిషన్ (59; 42 బంతుల్లో 8x4, 2x6) అర్ధ శతకాలతో ఆకట్టుకోగా.. ఇతర బ్యాట్స్మెన్లో పృథ్వీ షా (43; 24 బంతుల్లో 9x4), మనీశ్ పాండే (26; 40 బంతుల్లో 1x4, 1x6), సూర్యకుమార్ యాదవ్ (31 నాటౌట్; 20 బంతుల్లో 5x4) తమవంతు పరుగులు చేశారు.
చెలరేగిన పృథ్వీ, ఇషాన్..
తొలుత ఓపెనర్లు పృథ్వీ, ధావన్ శుభారంభం చేశారు. ముఖ్యంగా పృథ్వీ పవర్ప్లేలో రెచ్చిపోయాడు. అతడు ఉన్నది కొద్దిసేపే అయినా స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ధావన్తో కలిసి తొలి వికెట్కు 58 పరుగులు చేశాడు. అందులో పృథ్వీ చేసినవే 43 పరుగులు కావడం గమనార్హం. అయితే, అర్ధశతకానికి చేరువైన సమయంలో అతడు ధనంజయ బౌలింగ్లో భారీ షాట్కు యత్నించి ఔటయ్యాడు. లాంగాన్లో అవిష్క ఫెర్నాండో చేతికి చిక్కాడు. తర్వాత వన్డౌన్ బ్యాట్స్మన్గా వచ్చిన ఇషాన్ కిషన్ సైతం వచ్చీ రావడంతోనే బౌండరీలతో చెలరేగాడు. అతడు ఎదుర్కొన్న తొలి రెండు బంతులను సిక్సర్, ఫోర్గా మలిచాడు. మరోవైపు ధావన్ నెమ్మదిగా ఆడుతూ అతడికి సహకరించాడు. అలా స్కోరు బోర్డు మరోసారి పరుగులు పెట్టింది. ఈ క్రమంలోనే వీరిద్దరూ రెండో వికెట్కు 85 పరుగులు జోడించారు.
అయితే, అర్ధశతకం తర్వాత మరింత వేగంగా పరుగులు తీసే క్రమంలో ఇషాన్ ఔటయ్యాడు. సందకన్ బౌలింగ్లో భానుక చేతికి చిక్కాడు. అప్పటికి జట్టు స్కోర్ 143/2గా నమోదైంది. తర్వాత క్రీజులోకి వచ్చిన మనీశ్ పాండే తొలుత నెమ్మదిగా ఆడాడు. అనంతరం ధావన్తో కలిసి లంక బౌలర్లను కాచుకున్నాడు. మూడో వికెట్కు వీరిద్దరూ 72 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, జట్టు స్కోర్ 215 పరుగుల వద్ద మనీశ్ ఔటయ్యాడు. అప్పటికే భారత్ విజయం ఖాయం కాగా, సూర్యకుమార్ వచ్చి మిగతా పనిపూర్తి చేశాడు. లంక బౌలర్లలో ధనంజయ రెండు వికెట్లు తీయగా సందకన్ ఒక వికెట్ పడగొట్టాడు.
మరోవైపు టాస్గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. చివర్లో కరుణరత్నె(43 నాటౌట్; 35 బంతుల్లో 1x4, 2x6) ధాటిగా ఆడి టాప్ స్కోరర్గా నిలిచాడు. అంతకుముందు ఓపెనర్లు అవిష్క ఫెర్నాండో (32; 35 బంతుల్లో 2x4, 1x6), మినోద్ భానుక (27; 44 బంతుల్లో 3x4) శుభారంభం చేశారు. వీరిద్దరూ తొలి వికెట్కు 49 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే ఫెర్నాండో.. చాహల్ బౌలింగ్లో మనీశ్ పాండే చేతికిచిక్కి తొలి వికెట్గా వెనుదిరిగాడు. ఆపై కుల్దీప్ యాదవ్ వన్డౌన్ బ్యాట్స్మన్ భానుక రాజపక్స (24; 22 బంతుల్లో 2x4, 2x6), మరో ఓపెనర్ మినోద్ భానుకను ఒకే ఓవర్లో పెవిలియన్ పంపాడు. దీంతో శ్రీలంక ఒత్తిడిలో కూరుకుపోయింది.
తర్వాత ధనుంజయ డి సిల్వ(14) స్వల్ప స్కోరుకే కృనాల్ పాండ్య బౌలింగ్లో ఔటయ్యాడు. అప్పటికి లంక స్కోర్ 25 ఓవర్లలో 117/4గా నమోదైంది. తర్వాత జోడీ కట్టిన అసలంక (38; 65 బంతుల్లో 1x4), షనక (39; 50 బంతుల్లో 2x4, 1x6) నిలకడగా ఆడారు. వీరిద్దరూ ఐదో వికెట్కు 49 పరుగులు జోడించారు. అనంతరం పరుగుల వేగం పెంచే క్రమంలో స్వల్ప వ్యవధిలో ఇద్దరూ ఔటయ్యారు. చివర్లో చమీరా (13; 7 బంతుల్లో 1x4, 1x6)తో కలిసి ధాటిగా ఆడిన కరుణరత్నె లంకకు పోరాడే స్కోర్ అందించాడు. భారత బౌలర్లలో చాహల్, చాహర్, కుల్దీప్ తలో రెండు వికెట్లు పడగొట్టగా కృనాల్, హార్దిక్ పాండ్య చెరో వికెట్ తీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు