IPL 2021: మేం ఏం చేయాలనేదానిపై దృష్టి సారించాలి: ధోనీ
చెన్నై సూపర్ కింగ్స్ లీగ్ దశను పూర్తి చేసుకుంది. గురువారం పంజాబ్ చేతిలోనూ ఓటమిపాలై రెండో స్థానంలో ప్లేఆఫ్స్కు చేరింది. అయితే, ఇప్పుడు వరుసగా మూడు మ్యాచ్లు ఓటమిపాలవ్వడమే...
ఇంటర్నెట్డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్ లీగ్ దశను పూర్తి చేసుకుంది. గురువారం పంజాబ్ చేతిలోనూ ఓటమిపాలై రెండో స్థానంలో ప్లేఆఫ్స్కు చేరింది. అయితే, ఇప్పుడు వరుసగా మూడు మ్యాచ్లు ఓటమిపాలవ్వడమే ఆ జట్టును కాస్త కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ధోనీ మాట్లాడుతూ వాస్తవాలను అర్థం చేసుకొని మెలగాలని చెప్పాడు.
‘ఈ ఓటములను స్వీకరించి ముందుకు సాగాలి. అది మానసికంగా అయినా లేదా నైపుణ్యాల పరంగానైనా అర్థం చేసుకొని వెళ్లాలి. మేం ప్లేఆఫ్స్ చేరడానికి బాగా కష్టపడ్డాం. అయితే, ఈ రెండు మూడు మ్యాచ్ల్లో విఫలమయ్యాం. అందులో ఒకటి గెలుస్తామనుకున్నా కుదరలేదు. ఇలాంటి లీగుల్లో ఇవన్నీ సహజమే. ఏదైమైనా మనం విజయం సాధించాలంటే అత్యుత్తమ ప్రదర్శన చేయాలి. అయితే, మా ఓటములకు పట్టుదల లేకపోవడం అనేది కారణం కాదు. మా ఆటగాళ్లంతా పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. మేం ఏం చేయాలనేదానిపై కాస్త దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. మరోవైపు కొన్నిసార్లు టాస్ కూడా మాకు కలిసిరాలేదు. ఇది కాస్త కఠినమైన పిచ్. కానీ మొత్తంగా చూస్తే ఫర్వాలేదని చెప్పొచ్చు’ అని ధోనీ వివరించాడు.
ఇలాగే పెరిగాను.. ఇలాగే ఆడతా: రాహుల్
ఇక మ్యాచ్ గెలిచాక పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మాట్లాడుతూ తాము 14 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేయాలనుకున్నట్లు చెప్పాడు. అందువల్లే తాను ఆది నుంచే భారీ షాట్లు ఆడాలనుకున్నట్లు తెలిపాడు. ‘ఈరోజు మా ప్రణాళిక చాలా సింపుల్. ఈ మ్యాచ్ను 14 ఓవర్లలోనే పూర్తి చేస్తే మంచి అవకాశాలున్నాయని చెప్పారు. దీంతో నేను తొలి బంతి నుంచే ధాటిగా ఆడాలని నిర్ణయించుకున్నా. ఇక నా బ్యాటింగ్లో ఫేవరెట్ షాట్ అంటే హేజిల్వుడ్ బౌలింగ్లో స్క్వేర్లెగ్ మీదుగా కొట్టిన సిక్సర్. అలాంటి పుల్షాట్ ఆడాలంటే నాకెంతో ఇష్టం. ఇక నా బ్యాటింగ్ గురించి మాట్లాడితే జట్టుకు అవసరమైన రీతిలోనే ఆడాలనుకుంటా. గత మూడు నాలుగేళ్లుగా నా బ్యాటింగ్పై అనేక మాటలు వినిపిస్తున్నాయి. అయితే, నేనెలా ఆడుతున్నాననేది నాకు, మా ఫ్రాంఛైజీకి తెలుసు. జట్టుకు అవసరమైన రీతిలోనే నేను బ్యాటింగ్ చేస్తా. నాకెప్పుడూ జట్టే మొదటి ప్రాధాన్యం. నేను ఇలాగే పెరిగాను. ఇలాగే ఆడతాను. ఈరోజు జట్టుకు అవసరమైన రీతిలో ఆడినందుకు సంతోషంగా ఉంది’ అని రాహుల్ వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు