IPL 2021: మోర్గాన్ కన్నా ధోనీనే బాగా ఆడుతున్నాడు: గంభీర్
ఐపీఎల్ 14వ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్కు చేరుకున్నాయి. అందరి కన్నా ముందు ధోనీసేన ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకోగా ఆఖరి నిమిషంలో మోర్గాన్ టీమ్ నాలుగో స్థానంతో పోటీలోకి వచ్చింది...
ఇంటర్నెట్డెస్క్: ఐపీఎల్ 14వ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్కు చేరుకున్నాయి. అందరి కన్నా ముందు ధోనీసేన ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకోగా ఆఖరి నిమిషంలో మోర్గాన్ టీమ్ నాలుగో స్థానంతో పోటీలోకి వచ్చింది. ఇక్కడ ఆ జట్టు బెంగళూరు, దిల్లీ జట్లను ఓడించి తుదిపోరులో చెన్నైని ఢీకొట్టేందుకు సిద్ధమైంది. అయితే, కోల్కతా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కన్నా చెన్నై సారథి మహేంద్రసింగ్ ధోనీనే ఇప్పుడు బాగా ఆడుతున్నాడని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. తాజాగా ఓ క్రీడా ఛానెల్తో మాట్లాడుతూ అతడీ వ్యాఖ్యలు చేశాడు.
రెండు జట్ల సారథులను పోల్చి చూడటం సరికాదని, ఎందుకంటే ధోనీ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడని గంభీర్ గుర్తుచేశాడు. మరోవైపు మోర్గాన్ ఇంగ్లాండ్ జట్టుకు ఇంకా నాయకత్వం వహిస్తున్నాడని చెప్పాడు. దీంతో ఇద్దరినీ పోల్చి చూడటమంటే యాపిల్తో ఆరెంజ్ను పోల్చడమేనని అభిప్రాయపడ్డాడు. ధోనీ చాలా రోజులుగా సరైన క్రికెట్ ఆడటంలేని కారణంగా ఇప్పుడు పరుగులు చేయకపోయినా అర్థం చేసుకోవచ్చని చెప్పాడు. అలాగే మోర్గాన్ అంతర్జాతీయ మ్యాచ్లు ఆడుతున్న నేపథ్యంలో రాణించాల్సిన అవసరం ఉందన్నాడు. అయినా, ఈ సీజన్లో ధోనీనే బాగా ఆడుతున్నాడని కోల్కతా మాజీ సారథి చెప్పుకొచ్చాడు. మరోవైపు చెన్నై సారథి బ్యాటింగ్, కెప్టెన్సీతో పాటు కీపింగ్ కూడా అదనంగా చేస్తున్నాడని గంభీర్ వివరించాడు. ఈ నేపథ్యంలోనే ఇద్దరినీ పోల్చిచూడటం సరికాదని వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శాంసన్ మెరిసినా.. మురిసింది దిల్లీనే
27 బంతుల్లో 60 పరుగులు చేయాలి. తక్కువేమీ కాదు. కానీ కెప్టెన్ సంజు శాంసన్ నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతుండడంతో రాజస్థాన్ రాయల్స్ రేసులోనే ఉంది. 222 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. అప్పుడు ఒత్తిడంతా దిల్లీపైనే. -
ఐపీఎల్.. మళ్లీ భారమేనా?
ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్లో తీరిక లేకుండా మ్యాచ్లు ఆడడం.. ఆ వెంటనే టీ20 ప్రపంచకప్ వేటకు వెళ్లడం.. అలసటకు గురైన ఆటగాళ్లు అక్కడ అంతంతమాత్రంగా ఆడడం.. టీమ్ఇండియా పోరాటం మధ్యలోనే ముగిసిపోవడం.. గత కొన్ని పర్యాయాల నుంచి ఇదే వరస! -
నేడు ఫ్రాన్స్ చేరనున్న ఒలింపిక్ జ్యోతి
ఒలింపిక్ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే జ్యోతి రిలే.. ఆతిథ్య దేశం ఫ్రాన్స్లో అడుగుపెట్టనుంది. బుధవారం మార్సె దక్షిణ సముద్ర తీర ప్రాంతానికి చేరుకోనుంది. ఏప్రిల్ 16న గ్రీస్లోని ప్రాచీన ఒలింపియాలో మొదలైన ఈ రిలే.. సముద్ర మార్గం గుండా ఏథెన్స్ను దాటి మార్సెకి చేరువైంది. -
వారిద్దరి విషయంలో ద్రవిడ్కు ప్రణాళికలు ఉండాలి
భారత కెప్టెన్ రోహిత్శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి విషయంలో టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్కు స్పష్టమైన ప్రణాళికలు ఉండాలని దిగ్గజ క్రికెటర్ బ్రయాన్ లారా అభిప్రాయపడ్డాడు. -
భారత్కు ఏడు స్వర్ణాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు మరో ఏడు పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. పోటీల చివరిరోజు ప్రీతి (54 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ఆకాశ్ గోర్కా (60 కేజీలు), పూనమ్ (57 కేజీలు), ప్రాచి (63 కేజీలు), ముస్కాన్ (75 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు) ఫైనల్లో విజయాలు అందుకున్నారు. -
బంగ్లాదే సిరీస్
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్ను బంగ్లాదేశ్ మరో రెండు మ్యాచ్లు ఉండగానే సొంతం చేసుకుంది. మంగళవారం మూడో టీ20లో 9 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. -
కేకేఆర్ ఆటగాళ్ల ఇక్కట్లు
ప్రతికూల వాతావరణం కారణంగా కోల్కతా నైట్రైడర్స్ ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. లఖ్నవూ నుంచి కోల్కతా వెళ్లాల్సిన క్రికెటర్ల ప్రత్యేక విమానాన్ని పదే పదే మళ్లించడంతో వారు ఒక రాత్రి వారణాసిలో గడపాల్సి వచ్చింది. -
ఒత్తిడిలోనూ రోహిత్ మంచి నిర్ణయాలు
ఒత్తిడి సమయాల్లోనూ కెప్టెన్ రోహిత్ శర్మ మంచి నిర్ణయాలు తీసుకుంటాడని భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. టీ20 ప్రపంచకప్లో భారత్కు రోహిత్ కీలకమవుతాడని తెలిపాడు. -
సమవుజ్జీల సమరం
11 మ్యాచ్లు.. 6 విజయాలు.. 5 ఓటములు.. 12 పాయింట్లు. ఇప్పటి వరకు ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ జట్ల ప్రదర్శన ఇది. స్వల్ప నెట్ రన్రేటు తేడాతో పాయింట్ల పట్టికలో నాలుగు, అయిదు స్థానాల్లో ఉన్న సమవుజ్జీలు మరో పోరుకు సిద్ధమయ్యాయి.