IPL 2021: డీజే బ్రావో నుంచి నేర్చుకోవడం బాగుంది: హేజిల్వుడ్
చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్ డీజే బ్రావో నుంచి పలు విషయాలు నేర్చుకోవడం బాగుందని ఆ జట్టు పేసర్ జోష్ హేజిల్వుడ్ అన్నాడు...
ఇంటర్నెట్డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్ డీజే బ్రావో నుంచి పలు విషయాలు నేర్చుకోవడం బాగుందని ఆ జట్టు పేసర్ జోష్ హేజిల్వుడ్ అన్నాడు. గురువారం రాత్రి సన్రైజర్స్తో తలపడిన సందర్భంగా అతడు మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్ అనంతరం తన ప్రదర్శనపై మాట్లాడిన చెన్నై పేసర్.. తన సహచరుడు బ్రావోకు ఆ క్రెడిట్ దక్కుతుందని చెప్పాడు.
‘ప్రతి మ్యాచ్ కోసం నేనెంతో కష్టపడి అనేక విషయాలు నేర్చుకుంటా. ఇక ఈ మ్యాచ్లో ఆదిలోనే జేసన్ రాయ్ను ఔట్ చేయడం సంతోషాన్ని కలిగించింది. అది చాలా పెద్ద వికెట్. దీంతో ఆరంభం నుంచే సన్రైజర్స్పై ఒత్తిడి తీసుకువచ్చాం. ఈ షార్జా వికెట్ కాస్త నెమ్మదిగా ఉన్నా బౌలింగ్కు సహకరించింది. అలాగే మేం ప్రాక్టీస్లో ఏదైతే సాధన చేస్తున్నామో అదే మ్యాచ్లో అమలు చేస్తున్నాం. ఇక ఈ సీజన్లో నేను కొద్ది రోజులుగా బ్రావోతో కలిసి పనిచేస్తున్నాను. అతడి వద్ద నుంచి పలు విషయాలు నేర్చుకోవడం ఆనందంగా ఉంది. నేను మరిన్ని నేర్చుకోవడానికి ఈ ఐపీఎల్ ఎంతో ఉపయోగపడుతోంది’ అని హేజిల్వుడ్ వివరించాడు.
కాగా, ఈ మ్యాచ్లో తొలుత సన్రైజర్స్ బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్లలో 134/7 స్కోర్ సాధించింది. హేజిల్వుడ్.. ప్రధాన వికెట్ రాయ్(2)తో పాటు అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్లను పెవిలియన్ పంపాడు. మరో ఎండ్లో బ్రావో సైతం రెండు వికెట్లతో చెలరేగాడు. దీంతో వీరిద్దరూ సన్రైజర్స్ బ్యాట్స్మెన్ను కట్టడి చేసి ఆ జట్టు భారీ స్కోర్ చేయకుండా నిలువరించారు. అనంతరం చెన్నై 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ ధోనీ (14*) చివర్లో సిక్సర్ బాది జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఈ క్రమంలోనే చెన్నై ఓ అరుదైన రికార్డు నెలకొల్పింది. ఐపీఎల్లో సన్రైజర్స్పై అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్టుగా ధోనీసేన నిలిచింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డేవిడ్, పొలార్డ్కు భారీ జరిమానా.. ‘డీఆర్ఎస్ సిగ్నల్’ వివాదమేనా కారణం?
ముంబయి ఆటగాడు, కోచ్పై ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ కొరడా ఝళిపించింది. వారు చేసిన చర్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర నిర్ణయం తీసుకుంది. -
Ravindra Jadeja: గాల్లోకి ఎగిరి.. ఒంటిచేత్తో జడేజా క్యాచ్!
లఖ్నవూతో శుక్రవారం జరిగిన మ్యాచ్లో చెన్నై ఆటగాడు రవీంద్ర జడేజా.. గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో క్యాచ్ ఒడిసిపట్టాడు.
-
దిల్లీ కోటలో తొలి మ్యాచ్.. హైదరాబాద్ దూకుడు కొనసాగేనా?
అభిమానుల ఊహకు అందనిరీతిలో.. సంచలన ఆటతో ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ జట్టు అదరగొట్టేస్తోంది. ఇవాళ మరో మ్యాచ్లో తలపడేందుకు సిద్ధమవుతోంది. -
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్
ప్రస్తుత సీజన్లో దూకుడుగా ఆడుతున్న క్రికెటర్లలో ధోనీ ముందువరుసలో ఉంటాడు. ఆడేది పది బంతుల్లోపే అయినా ప్రత్యర్థి బౌలర్లకు వణుకు పుట్టిస్తున్నాడు. -
ఆ ముగ్గురిని చూస్తే ముచ్చటేసింది.. రోహిత్ ఈజ్ బ్యాక్: హర్భజన్
పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ముంబయి జట్టుకు కాసేపు యాక్టివ్ కెప్టెన్గా రోహిత్ శర్మ వ్యవహరించాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
లఖ్నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్, చెన్నై సారథి రుతురాజ్ గైక్వాడ్కు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ జరిమానా విధించింది. -
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
సొంత మైదానంలో లఖ్నవూ విజయం సాధించింది. ఆ జట్టు గెలుపు కంటే మరొక అంశం అభిమానులను ఆకట్టుకుంది. అదే ఎంఎస్ ధోనీ (MS Dhoni) బ్యాటింగ్ వీరవిహారం. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
డేవిడ్, పొలార్డ్కు భారీ జరిమానా.. ‘డీఆర్ఎస్ సిగ్నల్’ వివాదమేనా కారణం?
-
పాకిస్థాన్కు ‘క్షిపణి’ సాయం.. చైనా సంస్థలపై అగ్రరాజ్యం ఆంక్షల కొరడా!
-
పవన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.. పిఠాపురంలో నేతల సంకల్పం
-
భారత విద్యార్థి మృతి.. మరోసారి చర్చలోకి బ్లూవేల్ ఛాలెంజ్..!
-
చిలుకూరు ఆలయంలో ‘వివాహ ప్రాప్తి’ రద్దు: ప్రధాన అర్చకులు రంగరాజన్
-
ఈ పోలింగ్ ‘బ్యూటీ’ ఇంటర్నెట్ సెన్సేషన్.. ఎవరీ ఈశా అరోడా..?