IPL 2021: వాళ్లు మెరిసే మెరుపులు: మోర్గాన్.. అనుకున్నది చేయలేకపోయాం: సంజూ
కోల్కతా నైట్ రైడర్స్ అనధికారికంగా ప్లేఆఫ్స్ చేరడంపై ఆ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సంతోషం వ్యక్తం చేశాడు. గురువారం రాత్రి రాజస్థాన్ను ఓడించిన ఆ జట్టు మెరుగైన రన్రేట్తో కొనసాగుతోంది...
ఇంటర్నెట్డెస్క్: కోల్కతా నైట్ రైడర్స్ దాదాపు ప్లేఆఫ్స్ చేరింది. దీనిపై ఆ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సంతోషం వ్యక్తం చేశాడు. గురువారం రాత్రి రాజస్థాన్ను ఓడించిన ఆ జట్టు మెరుగైన రన్రేట్తో కొనసాగుతోంది. ఇక కోల్కతా అవకాశాలను గల్లంతు చేయాలంటే ఈరోజు మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ 171 పరుగుల భారీ తేడాతో సన్రైజర్స్ను ఓడించాలి. అయితే అది అసాధ్యమనే చెప్పాలి. ఈ నేపథ్యంలో గతరాత్రి మోర్గాన్ మాట్లాడాడు.
‘టాస్ ఓడి బ్యాటింగ్కు దిగి ఒక లక్ష్యాన్ని నిర్దేశించడం అంత తేలిక కాదు. అయినా, మా ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్, శుభ్మన్గిల్ అద్భుతంగా ఆడారు. రెండో దశలో వీరిద్దరూ మా జట్టుకు షైనింగ్ స్టార్స్లా మారారు. అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. రాజస్థాన్ బౌలింగ్ను మంచి టైమింగ్తో ఎదుర్కొన్నారు. ఇక రసెల్ స్థానంలో షకిబ్ జట్టులోకి వచ్చి రాణించడం గొప్పగా ఉంది. అయితే, మేం రసెల్ సేవలను కొద్దిగా మిస్సవుతున్నాం. ఎందుకంటే అతడు సరైన ఆల్రౌండర్. గాయం బారిన పడిన అతడు త్వరగా కోలుకుంటాడని ఆశిస్తున్నాం. ఇక ఈ విజయంతో ప్లేఆఫ్స్కు చేరువైనందుకు సంతోషంగా ఉంది’ అని మోర్గాన్ వివరించాడు.
ఇక్కడ 171 పరుగులు ఛేదించొచ్చు: సంజూ
అనంతరం రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ మాట్లాడుతూ ఈ పిచ్పై 171 పరుగుల లక్ష్యాన్ని ఛేదించొచ్చని చెప్పాడు. ‘ఈ వికెట్పై అంత స్కోర్ సాధించొచ్చు. అందుకోసం శుభారంభం చేయాలని అనుకున్నాం. పవర్ప్లేలో భారీ పరుగులు సాధించాలనుకున్నాం. దానికి తగ్గట్టు ప్రణాళికలు రూపొందించుకున్నా.. వాటిని అమలుచేయలేకపోయాం. అయితే, ఈ సీజన్లో మేం చాలా సవాళ్లను ఎదుర్కొన్నాం. మా ఆటగాళ్ల పట్టుదల చూసి నేను గర్వపడుతున్నా. ఒక సారథిగా నేను ఎక్కువ పరుగులు చేయడం కన్నా మరిన్ని విజయాలు సాధించి ఉంటే ఇంకా సంతోషించేవాడిని. ఈరోజు కోల్కతా బాగా ఆడింది. గిల్, రాణా, త్రిపాఠి ప్రతిఒక్కరూ రాణించడంతో మేం మ్యాచ్ను కోల్పోయాం. 171 పరుగుల లక్ష్యాన్ని 11 ఓవర్లలో మేం సాధించాలని పంజాబ్ కింగ్స్ ఆశపడింది. కానీ, అది సాధ్యం కాలేదు. 9 ఓవర్లకే మా స్కోర్ 35/7 చూసి ముంబయి కూడా నిరాశ చెంది ఉంటుంది. రాహుల్ తెవాతియా(44) పోరాడినా.. శివమ్ మావి, లాకీ ఫెర్గూసన్ తమ బౌలింగ్తో విజృంభించారు. కేకేఆర్ మెరుగైన రన్రేట్తో ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరినా అధికారికంగా తేలేవరకూ వేచి చూడాలి’ అని సంజూ అభిప్రాయపడ్డాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఆమె’.. నెట్టింట వైరల్గా మారిన కావ్యా మారన్
కావ్యా మారన్.. సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ యజమాని. ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ భారీ స్కోరు సాధించడంతో ఆమె ఒక్కసారిగా నెట్టింట వైరల్గా మారారు. -
ముంబయి లక్ష్య ఛేదన దిశగా వస్తుందని భావించారా? ప్యాట్ కమిన్స్ సమాధానమిదే!
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ బోణీ కొట్టింది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబయిని చిత్తు చేసింది. -
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
ఉప్పల్ వేదికగా ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో పలు రికార్డులు నమోదు అయ్యాయి. -
ఉప్పల్ ఊగిపోయింది
ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్లో సన్రైజర్స్ అద్వితీయమైన బ్యాటింగ్తో అదరగొట్టింది. బ్యాటర్లు మెషీన్ గన్నుల్లా పేలడంతో ఐపీఎల్లో రికార్డు స్కోరుతో సత్తాచాటింది. తొలి మ్యాచ్లో త్రుటిలో ఓడినా.. రెండో పోరులో చిరస్మరణీయ విజయం అందుకుంది. -
ఇది సన్రైజర్సేనా?
సన్రైజర్స్ అంటే.. నత్తనడక బ్యాటింగ్కు మారు పేరు! సన్రైజర్స్ బ్యాటర్లది.. స్ట్రైక్రేట్లో ఎప్పుడూ వెనుకంజే! సన్రైజర్స్ మెరుపులన్నీ బౌలింగ్ వరకే! కానీ ఇదంతా పాత కథ! -
సింధు శుభారంభం
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. -
సెమీస్లో బోపన్న జోడీ
44 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్న భారత టెన్నిస్ వెటరన్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న మరో టైటిల్ దిశగా సాగుతున్నాడు. -
ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీలో శ్రీజేష్
అంతర్జాతీయ హాకీ సమాఖ్య నూతన ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీ సహ అధ్యక్షుడిగా భారత హాకీ వెటరన్ గోల్కీపర్ శ్రీజేష్ నియమితుడయ్యాడు. -
‘ఇంపాక్ట్ ప్లేయర్’ వల్లే ధోని అలా..
కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు. ఆటగాడిగా కూడా ఇదే చివరి సీజన్ అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేంద్ర ధోని బ్యాటు పట్టి కొన్ని మెరుపులు మెరిపిస్తే చూడాలన్నది అభిమానుల ఆశ. -
కోచ్కు జకోవిచ్ టాటా
కోచ్ గోరాన్ ఇవానిసెవిచ్తో ఆరేళ్ల బంధానికి జకోవిచ్ వీడ్కోలు పలికాడు. 2018లో ఇవానిసెవిచ్తో కలిసి జకోవిచ్ ప్రయాణం ప్రారంభించాడు. -
సచిన్ గోల్ఫాట
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ గోల్ఫ్ స్టిక్ చేతబట్టాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బౌల్డర్హిల్స్ క్లబ్లో బుధవారం గోల్ఫ్ ఆడాడు. -
భారత్-పాక్ సిరీస్.. ఆసీస్ ఆసక్తి
భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్కు ఆతిథ్యమివ్వడానికి ఆస్ట్రేలియా మరోసారి ఆసక్తి వ్యక్తం చేసింది. -
ముంబయిలో హార్దిక్కు మరింతగా..
రోహిత్ శర్మ స్థానంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా ఎంపికైన హార్దిక్ పాండ్యకు సామాజిక మాధ్యమాల్లోనే కాదు మైదానాల్లోనూ తీవ్ర వ్యతిరేకత తప్పడం లేదు. -
మళ్లీ బాబర్కే పగ్గాలు!
పాకిస్థాన్ క్రికెట్ జట్టు పగ్గాలు మళ్లీ బాబర్ అజామ్ చేతికి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అతణ్ని మరోసారి జట్టు కెప్టెన్గా నియమించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. -
స్టిమాక్ను తప్పించాల్సిందే
ఫుట్బాల్ ప్రపంచకప్ క్వాలిఫయర్స్లో చిన్న జట్టు అఫ్గానిస్థాన్ చేతిలో భారత్ అనూహ్య ఓటమితో కోచ్ స్టిమాక్ను తప్పించాలని మాజీ ఆటగాళ్లు డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్రాజు
-
కొనసాగుతున్న మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక
-
‘అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఆమె’.. నెట్టింట వైరల్గా మారిన కావ్యా మారన్
-
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
-
కంగనపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సుప్రియా శ్రీనేత్కు కాంగ్రెస్ షాక్!
-
ఉపాధి కూలీల కనీస వేతనం రూ.300