IPL 2021: అంతదూరం వెళ్తుందని అస్సలు ఊహించలేదు: రాహుల్ త్రిపాఠి
దిల్లీ క్యాపిటల్స్తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్ చివరి బంతి వరకు వెళ్తుందని అస్సలు ఊహించలేదని కోల్కతా నైట్ రైడర్స్ బ్యాట్స్మన్ రాహుల్ త్రిపాఠి అన్నాడు. ఆఖరి రెండు బంతుల్లో ఆరు పరుగులు...
(Photo: Rahul Tripathi Twitter)
ఇంటర్నెట్డెస్క్: దిల్లీ క్యాపిటల్స్తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్ చివరి బంతి వరకు వెళ్తుందని అస్సలు ఊహించలేదని కోల్కతా నైట్ రైడర్స్ బ్యాట్స్మన్ రాహుల్ త్రిపాఠి అన్నాడు. ఆఖరి రెండు బంతుల్లో ఆరు పరుగులు చేయాల్సిన స్థితిలో అతడు (12; 11 బంతుల్లో 1x6) సిక్సర్తో కోల్కతాను గెలిపించాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ఉత్కంఠభరిత పరిస్థితుల్లో జట్టును గెలిపించడం గొప్పగా ఉందన్నాడు. అయితే, సునాయాసంగా గెలుస్తామనుకున్న మ్యాచ్ అంత దూరం వెళ్తుందని ఊహించలేకపోయానన్నాడు.
‘చివర్లో రెండు మూడు ఓవర్లు మాకు కష్టంగా అనిపించింది. మ్యాచ్ అంత దూరం వెళ్తుందని అనుకోలేదు. చివరికి విజయం సాధించడం సంతోషంగా ఉంది. రబాడ 18వ ఓవర్ అత్యద్భుతంగా వేశాడు. ఆ సమయంలో పలు వికెట్లు కోల్పోవడంతో వీలైతే రెండు పరుగులు తీస్తూ బ్యాటింగ్ చేయాలనుకున్నా. సింగిల్ తీస్తే కొత్తగా వచ్చిన బ్యాట్స్మన్కు ఆడటం కష్టమవుతుందని భావించా. బంతి బ్యాట్ మీదకు రాకపోవడంతో షాట్లు ఆడటం కష్టమైంది. అలాంటప్పుడు కొత్త బ్యాట్స్మన్ పరుగులు తీయడం, బౌండరీలు బాదడం అంత తేలిక కాదు. అయితే, ఒక్క షాట్ దూరంలోనే విజయం మా ముంగిట ఉందని తెలుసు. దాంతో నాకు నేను ఆత్మవిశ్వాసం తెచ్చుకొని ఆడాను. తొలి దశ తర్వాత మా జట్టు బలంగా మారింది. సారథి మోర్గాన్, కోచ్ మెక్కలమ్ మమ్మల్ని సానుకూల ధోరణిలో ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించారు’ అని త్రిపాఠి వివరించాడు.
ఈ మ్యాచ్లో దిల్లీ నిర్దేశించిన 136 పరుగుల లక్ష్యాన్ని కోల్కతా మొదట తేలిగ్గా ఛేదిస్తుందని అంతా అనుకున్నారు. ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్ (55; 41 బంతుల్లో 4x4, 3x6), శుభ్మన్ గిల్ (46; 46 బంతుల్లో 1x4, 1x6) శుభారంభం చేసి జట్టు విజయానికి బలమైన పునాది వేశారు. తొలి వికెట్కు 96 పరుగులు జోడించారు. రబాడ వేసిన 13వ ఓవర్లో అయ్యార్ ఔటయ్యాక నితీశ్ రాణా (13; 12 బంతుల్లో 1x6) క్రీజులోకి వచ్చి కొద్దిసేపటికే వెనుదిరిగాడు. అప్పటికి ఆ జట్టు స్కోర్ 16 ఓవర్లకు 123/2. మిగిలిన నాలుగు ఓవర్లలో కోల్కతా విజయానికి 13 పరుగులే అవసరమయ్యాయి. కానీ, అప్పుడే దిల్లీ బౌలర్లు చెలరేగిపోయారు. వరుస ఓవర్లలో శుభ్మన్ గిల్, దినేశ్ కార్తీక్ (0), ఇయాన్ మోర్గాన్ (0)లను ఔట్ చేశారు. దీంతో చివరి ఓవర్లో ఆ జట్టు విజయానికి 7 పరుగులు అవసరమయ్యాయి. ఆ సమయంలో అశ్విన్ బంతి అందుకొని తొలి రెండు బంతుల్లో సింగిల్ ఇచ్చాడు. మూడు, నాలుగు బంతులను షకిబ్ అసల్ హసన్ (0), సునీల్ నరైన్(0)ను పెవిలియన్ చేర్చాడు. దీంతో మ్యాచ్ దిల్లీవైపు మొగ్గింది. చివరి రెండు బంతుల్లో కోల్కతా ఆరు పరుగులు చేయాల్సిన స్థితిలో త్రిపాఠి తర్వాతి బంతిని స్టాండ్స్లోకి తరలించాడు. దీంతో ఆ జట్టు ఉత్కంఠభరిత పరిస్థితుల్లో అద్భుత విజయం సాధించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.