IPL 2021: ఆర్‌సీబీ.. ప్లేఆఫ్స్‌లో అడుగేస్తుందా?

ఐపీఎల్‌-12లో దిల్లీ, చెన్నై ఇప్పటికే ప్లేఆఫ్స్‌లో అడుగు పెట్టేశాయి. ఇప్పుడిక బెంగళూరు వంతొచ్చింది. 11 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలతో ప్లేఆఫ్స్‌కు అత్యంత చేరువగా ఉన్న ఆర్‌సీబీ...

Published : 03 Oct 2021 07:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌-12లో దిల్లీ, చెన్నై ఇప్పటికే ప్లేఆఫ్స్‌లో అడుగు పెట్టేశాయి. ఇప్పుడిక బెంగళూరు వంతొచ్చింది. 11 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలతో ప్లేఆఫ్స్‌కు అత్యంత చేరువగా ఉన్న ఆర్‌సీబీ.. ఆదివారం పంజాబ్‌ను ఢీకొనబోతోంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే బెంగళూరుకు బెర్తు ఖరారవుతుంది. ప్లేఆఫ్స్‌ రేసులో ఉన్న మిగతా నాలుగు జట్లలో ఏదీ ఎనిమిది విజయాలు సాధించే అవకాశం లేదు కాబట్టి బెంగళూరు వేరే సమీకరణాలతో సంబంధం లేకుండా ముందంజ వేస్తుంది. ఆర్‌సీబీ చేతిలో ఓడితే పంజాబ్‌ పనైపోయినట్లే! ఆ జట్టుతో పాటు ముంబయి, రాజస్థాన్‌, కోల్‌కతా 12 మ్యాచుల్లో అయిదేసి విజయాలతో సమాన స్థితిలో ఉన్నాయి. ఆర్‌సీబీ ముందంజ వేస్తే.. చివరి  ప్లేఆఫ్‌ బెర్తు ఏ జట్టు సొంతమవుతుందన్నది ఆసక్తికరం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని