IPL 2022: అక్టోబర్‌ 17న ఐపీఎల్‌ 2022 కొత్త జట్ల ఎంపిక!

ఐపీఎల్‌ 2022లో రెండు కొత్త జట్లు రాబోతున్నాయనే సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎనిమిది ఫ్రాంఛైజీలతో దిగ్విజయంగా సాగుతున్న మెగా టీ20 లీగ్‌.. వచ్చే ఏడాది నుంచి మరింత పెద్దదికానుంది...

Published : 15 Sep 2021 01:53 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌ 2022లో రెండు కొత్త జట్లు రాబోతున్నాయనే సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎనిమిది ఫ్రాంఛైజీలతో దిగ్విజయంగా సాగుతున్న మెగా టీ20 లీగ్‌.. వచ్చే ఏడాది నుంచి మరింత పెద్దదికానుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చకాచకా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే బీసీసీఐ ఇటీవల రాబోయే రెండు కొత్త ఫ్రాంచైజీలు, ఆయా జట్ల నిర్వహణ కోసం టెండర్లు విడుదల చేసింది. అక్టోబర్‌ 5న ఆ గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ కొత్త జట్ల ఆటగాళ్ల వేలం పాటను అక్టోబర్‌ 17న నిర్వహిస్తున్నారని సమాచారం. అహ్మదాబాద్‌, లఖ్‌నవూ, పుణె.. వాటికి సొంత వేదికలుగా ఖరారయ్యే వీలుంది. దీంతో వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్‌లో మొత్తం పది జట్లు సందడి చేయనున్నాయి. మరోవైపు ఐపీఎల్‌ 2021లో మిగిలిన సీజన్‌ వచ్చే ఆదివారం నుంచి తిరిగి మొదలవుతుండగా అక్టోబర్‌ 15న ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. అది అయిపోయిన రెండు రోజులకే ఐపీఎల్‌ 2022కు సంబంధించిన కొత్త జట్ల వివరాలు వెలువడే అవకాశం ఉంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని