Virat Kohli vs Joe Root: లాంగ్రూమ్లో తిట్టేసుకున్న కోహ్లీ, రూట్..
భారత్, ఇంగ్లాండ్ మూడో టెస్టుకు ముందు ఓ సంచలన విషయం తెలిసింది. దూకుడుగా ఉండే విరాట్ కోహ్లీ, ప్రశాంతంగా కనిపించే జో రూట్ తీవ్ర వాగ్వివాదానికి పాల్పడారని సమాచారం....
బృందాలుగా దూషించుకున్న ఆటగాళ్లు
ఇంటర్నెట్ డెస్క్: భారత్, ఇంగ్లాండ్ మూడో టెస్టుకు ముందు ఓ సంచలన విషయం తెలిసింది. దూకుడుగా ఉండే విరాట్ కోహ్లీ, ప్రశాంతంగా కనిపించే జో రూట్ తీవ్ర వాగ్వివాదానికి పాల్పడ్డారని సమాచారం. రెండో టెస్టులో విజయం సాధించిన వెంటనే ఈ ఘటన చోటు చేసుకుందని అంటున్నారు. అంతేకాదు.. రెండు జట్ల ఆటగాళ్లు గుంపులు గుంపులుగా చేరి ఒకర్నొకరు దూషించుకున్నారని తెలుస్తోంది.
ఇదంతా లార్డ్స్ టెస్టు మూడో రోజు నుంచి మొదలైంది. తొలి ఇన్నింగ్స్లో రూట్ అజేయంగా 180 పరుగులు చేశాడు. అప్పుడు ఆఖరి బ్యాట్స్మన్గా వచ్చిన అండర్సన్కు బుమ్రా షార్ట్పిచ్ బంతులు వేశాడు. గంటకు 90 మైళ్ల వేగంతో బంతులు విసరడంతో కొన్ని అతడి దేహానికి తగిలాయి. జట్టు ఆలౌట్ కాగానే అండర్సన్.. బుమ్రాను బూతులతో దూషించాడు. అక్కడి నుంచి రెండు జట్ల మధ్య మాటల యుద్ధం మొదలైంది.
నిజానికి బుమ్రా పది బంతుల ఓవర్ ముగిశాక రెండు జట్ల ఆటగాళ్లు బృందాలుగా విడిపోయి లార్డ్స్ లాంగ్రూమ్లో తిట్టుకున్నారని డైలీ టెలిగ్రాఫ్లో ఓ కథనం వచ్చింది. అదే సమయంలో రెండు జట్ల కెప్టెన్లు విరాట్కోహ్లీ, జో రూట్ నువ్వా నేనా అన్నట్టుగా మాటల యుద్ధంలో తలపడ్డారట. ఒకర్నొకరు కవ్వించుకున్నారని తెలిసింది.
లార్డ్స్ లాంగ్రూమ్ను పవిత్రంగా భావిస్తారు! ఎందుకంటే మాజీ క్రికెటర్లు ఇక్కడకు వస్తుంటారు. మ్యాచును వీక్షిస్తుంటారు. కరోనా నిబంధనల వల్ల మాజీలను లాంగ్ రూమ్లోకి అనుమతించడం లేదు. దాంతో మైదానం నుంచే పరస్పరం దూషించుకుంటూ వచ్చిన ఆటగాళ్లు.. లాంగ్రూమ్లో బహిరంగంగా తిట్టుకున్నారట. మరింత రెచ్చిపోయారట. భోజనం చేసేటప్పుడూ ఇదే వాతావరణం కనిపించిందని తెలిసింది.
చివరికి ఈ వ్యవహారాలన్నీ టీమ్ఇండియాకే కలిసొచ్చాయి. ఆఖరి రోజు బుమ్రా, షమి అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పడంతో కోహ్లీసేనకు భారీ స్కోరు లభించింది. అప్పటికే జరిగిన సంఘటనలతో కసితో ఉన్న ఆటగాళ్లు ఆంగ్లేయులకు నరకం చూపించేందుకు సిద్ధమయ్యారు. కేవలం 60 ఓవర్లలోపే ఆలౌట్ చేసేసి 151 పరుగుల భారీ తేడాతో ఘన విజయం అందుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు.
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్