IND vs ENG: ఈ ఓటమి చికాకు తెప్పించింది: జోరూట్
టీమ్ఇండియాతో ఆడిన నాలుగో టెస్టులో ఓటమిపాలవ్వడం చికాకు తెప్పించిందని ఇంగ్లాండ్ కెప్టెన్ జోరూట్ అన్నాడు. ఈ వైఫల్యం నుంచి తమ జట్టంతా ఎంతో కొంత నేర్చుకోవాల్సింది ఉందన్నాడు...
లండన్: టీమ్ఇండియాతో ఆడిన నాలుగో టెస్టులో ఓటమిపాలవ్వడం చికాకు తెప్పించిందని ఇంగ్లాండ్ కెప్టెన్ జోరూట్ అన్నాడు. ఈ వైఫల్యం నుంచి తమ జట్టంతా ఎంతో కొంత నేర్చుకోవాల్సింది ఉందన్నాడు. ఈ మ్యాచ్లో గెలిచే అవకాశమున్నా ఓటమిపాలయ్యామని తెలిపాడు. రెండో ఇన్నింగ్స్లో ఓపెనర్లు శుభారంభం చేసినా టీమ్ఇండియా బౌలర్లు అద్భుతంగా రాణించారని అన్నాడు. వాళ్లు రివర్స్స్వింగ్తో తమ ఆట కట్టించారని ఇంగ్లాండ్ సారథి అభిప్రాయపడ్డాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ రూట్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
‘టీమ్ఇండియా పేసర్ జస్ప్రిత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు, రెండో సెషన్లో అతడు వరుస ఓవర్లలో పోప్, బెయిర్స్టోలను పెవిలియన్ పంపి మ్యాచ్ను మలుపు తిప్పాడు. అతడు ప్రపంచ శ్రేణి బౌలర్. ఈ విషయాన్ని ఎవరైనా అంగీకరించాల్సిందే. అలాగే ఈ మ్యాచ్లో మేం ఎలాంటి తప్పులు చేశామో తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. తొలి ఇన్నింగ్స్లో లభించిన ఆధిక్యంతో పాటు ఇతర అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాల్సింది’ అని రూట్ పేర్కొన్నాడు. ఇక వచ్చేవారం జరిగే ఐదో టెస్టులో మరింత మెరుగ్గా ఆడాల్సిన అవసరం ఉందన్నాడు. మరోవైపు స్లిప్లో పలు క్యాచ్లు జారవిడ్చడంపై స్పందిస్తూ.. ఈ విషయంపై మరింత దృష్టిసారించాలని చెప్పాడు. చివరగా తమ బౌలర్లు గాయాలబారిన పడటం ఇబ్బందిగా మారిందని రూట్ వివరించాడు. అయినా తాము రాణిస్తామని, వచ్చేవారం జరిగే చివరి టెస్టులో మరింత బాగా ఆడతామని చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434