INDvsENG: రూట్ శతకమోత.. సంపూర్ణ ఆధిక్యంలో ఇంగ్లాండ్
భారత్తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ సంపూర్ణ ఆధిక్యంలో నిలిచింది. రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి ఆ జట్టు 423/8 స్కోర్తో మ్యాచ్పై పూర్తి పట్టుసాధించింది...
రెండో రోజు ఆటపూర్తయ్యేసరికి ఇంగ్లాండ్ 423/8
ఇంటర్నెట్డెస్క్: భారత్తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ సంపూర్ణ ఆధిక్యంలో నిలిచింది. రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి ఆ జట్టు 423/8 స్కోర్తో నిలిచి మ్యాచ్పై పూర్తి పట్టుసాధించింది. రెండో రోజు చివరి సెషన్ మినహా భారత బౌలర్లు పెద్దగా రాణించలేకపోయారు. ఈ క్రమంలోనే తొలి ఇన్నింగ్స్లో ఆ జట్టు ఇప్పటికే 345 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక మూడో రోజు ఉదయం వేళ టీమ్ఇండియా ఆ చివరి రెండు వికెట్లను ఎంత వీలైతే అంత త్వరగా తీయాలి. ఆపై రెండో ఇన్నింగ్స్లో భారత బ్యాట్స్మెన్ ఏ మేరకు పోరాడతారో చూడాలి. ఇక గురువారం ఆట నిలిచిపోయేసరికి ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ క్రేగ్ ఓవర్టన్(24; 31 బంతుల్లో 4x4), రాబిన్సన్(0) క్రీజులో ఉన్నారు. అంతకుముందు కెప్టెన్ జోరూట్ (121; 165 బంతుల్లో 14x4), వన్డౌన్ బ్యాట్స్మన్ డేవిడ్ మలన్ (70; 128 బంతుల్లో 11x4) భారీ స్కోర్లు సాధించారు. వీరిద్దరూ మూడో వికెట్కు 139 పరుగులు జోడించి ఇంగ్లాండ్ను తిరుగులేని స్థితిలో నిలిపారు.
ఇక 120/0 ఓవర్నైట్ స్కోర్తో రెండోరోజు ఆట ప్రారంభించిన ఓపెనర్లు రోరీబర్న్స్(61; 153 బంతుల్లో 6x4, 1x6), హసీబ్ హమీద్(68; 195 బంతుల్లో 12x4) అర్ధశతకాలతో రాణించారు. వీరిద్దరూ తొలిసెషన్లోనే స్వల్ప వ్యవధిలో ఔటైనా రూట్, మలన్ మరో వికెట్ పడకుండా తొలి సెషన్ను ముగించారు. అప్పటికీ జట్టు స్కోర్ 182/2గా నమోదైంది. అనంతరం రెండో సెషన్లో మరింత వేగంగా ఆడిన ఇద్దరూ అర్ధశతకాలు సాధించడంతో పాటు శతకాల వైపు దూసుకెళ్లారు. అయితే, సిరాజ్ వేసిన 94వ ఓవర్ చివరి బంతికి మలన్ కీపర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దాంతో ఇంగ్లాండ్ 298 పరుగుల వద్ద మూడో వికట్ కోల్పోయింది. అప్పటికే ఇంగ్లాండ్ పటిష్ఠస్థితిలో నిలిచింది. టీ బ్రేక్ అనంతరం రూట్ శతకం పూర్తి చేసుకోగా తర్వాత ఇంగ్లాండ్ వరుసగా నాలుగు వికెట్లు కోల్పోయింది. బెయిర్స్టో(29), బట్లర్(7)ను షమి ఔట్ చేశాడు. ఆపై రూట్ను బుమ్రా, మొయిన్ అలీ(8)ని జడేజా పెవిలియన్ పంపారు. మ్యాచ్ ముగిసేముందు సామ్కరన్(15) సిరాజ్ బౌలింగ్లో ఔటయ్యాడు. దాంతో ఇంగ్లాండ్ ఎనిమిది వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలోనే ఓవర్టన్, రాబిన్సన్ నాటౌట్గా నిలిచారు. భారత బౌలర్లలో షమి మూడు.. సిరాజ్, జడేజా చెరో రెండు.. బుమ్రా ఒక వికెట్ తీశారు.
రూట్ శతకాల రికార్డు..
మరోవైపు ఇంగ్లాండ్ కెప్టెన్ జోరూట్.. ఈ సిరీస్లో వరుసగా మూడు టెస్టుల్లోనూ సెంచరీలు బాదాడు. దాంతో భారత్పై అత్యధిక శతకాలు బాదిన ఐదో క్రికెటర్గా అతడు కొత్త రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు గ్యారీసోబర్స్, వీవ్రిచర్డ్స్, రికీపాంటింగ్, స్టీవ్స్మిత్ తలా ఎనిమిది శతకాలు సాధించారు. ఇప్పుడు వారి సరసన రూట్ కూడా చోటు దక్కించుకోవడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. -
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!