Joe Root: రూట్ను ఎలా ఔట్ చేయాలో టీమ్ఇండియాకు చెబుతున్న ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు
ఇంగ్లాండ్ సారథి జోరూట్ను ఎలా ఔట్ చేయాలో ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మాంటీ పనేసర్ వివరిస్తున్నాడు. అతడు క్రీజులోకి రాగానే జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్తో బౌలింగ్ చేయాలని సూచిస్తున్నాడు...
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్ సారథి జోరూట్ను ఎలా ఔట్ చేయాలో ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మాంటీ పనేసర్ వెల్లడించాడు. అతడు క్రీజులోకి రాగానే జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్తో బౌలింగ్ చేయించాలని సూచించాడు. ఆఫ్స్టంప్కు ఆవల, నాలుగు లేదా ఐదో స్టంప్ లైన్లో బంతులు వేయాలని అంటున్నాడు.
ఆతిథ్య జట్టులో టీమ్ఇండియాకు అడ్డొస్తున్నది రూట్ ఒక్కడే. ఈ సిరీసులో జరిగిన రెండు మ్యాచుల్లో అతడు ఏకంగా రెండు శతకాలు, ఒక అర్ధశతకం చేశాడు. 128.66 సగటుతో 386 పరుగులు సాధించాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్సులో అతడు అజేయంగా నిలిచిన సంగతి తెలిసిందే.
‘జో రూట్ను ఔట్ చేయాలంటే ఆఫ్స్టంప్ ఆవల, ఐదో స్టంప్ లైన్లో బంతులు వేయాలి. రెండో ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ ఇదే ప్రణాళిక వేశాడు. జస్ప్రీత్ బుమ్రా దానిని చక్కగా అమలు చేశాడు. తర్వాత మ్యాచుల్లోనూ విరాట్ ఇదే ప్రణాళిక అమలు చేయాలి. ఎందుకంటే రూట్ పుల్ షాట్ అద్భుతంగా ఆడగలడు. అందుకే షార్ట్ పిచ్ బంతులు వేయొద్దు’ అని పనేసర్ తెలిపాడు.
జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్కు బ్యాట్స్మెన్ను ఒత్తిడి చేయగల నైపుణ్యాలు ఉన్నాయని మాంటీ ప్రశంసించాడు. వీరిద్దరూ రూట్ను అడ్డుకోగలరని తెలిపాడు. ‘రూట్ క్రీజులోకి రాగానే విరాట్ మరో ఆలోచన లేకుండా బుమ్రాను ప్రయోగించాలి. సిరాజ్ సైతం అతడిపై ఒత్తిడి తేగలడు. రెండో ఇన్నింగ్స్లో కోహ్లీ ఇలాగే చేశాడు. దాంతో రూట్ వికెట్ ఇచ్చేశాడు. రూట్ తన పొజిషన్ మార్చుకొనేలా చికాకు పెట్టాలి. అతడి జోరును అడ్డుకోవాలి. అలా చేస్తే అతడు పొజిషన్ మార్చుకొంటాడు. త్వరగా వికెట్ ఇచ్చేస్తాడు’ అని పనేసర్ వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ కోటలో తొలి మ్యాచ్.. హైదరాబాద్ దూకుడు కొనసాగేనా?
అభిమానుల ఊహకు అందనిరీతిలో.. సంచలన ఆటతో ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ జట్టు అదరగొట్టేస్తోంది. ఇవాళ మరో మ్యాచ్లో తలపడేందుకు సిద్ధమవుతోంది. -
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్
ప్రస్తుత సీజన్లో దూకుడుగా ఆడుతున్న క్రికెటర్లలో ధోనీ ముందువరుసలో ఉంటాడు. ఆడేది పది బంతుల్లోపే అయినా ప్రత్యర్థి బౌలర్లకు వణుకు పుట్టిస్తున్నాడు. -
ఆ ముగ్గురిని చూస్తే ముచ్చటేసింది.. రోహిత్ ఈజ్ బ్యాక్: హర్భజన్
పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ముంబయి జట్టుకు కాసేపు యాక్టివ్ కెప్టెన్గా రోహిత్ శర్మ వ్యవహరించాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
లఖ్నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్, చెన్నై సారథి రుతురాజ్ గైక్వాడ్కు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ జరిమానా విధించింది. -
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
సొంత మైదానంలో లఖ్నవూ విజయం సాధించింది. ఆ జట్టు గెలుపు కంటే మరొక అంశం అభిమానులను ఆకట్టుకుంది. అదే ఎంఎస్ ధోనీ (MS Dhoni) బ్యాటింగ్ వీరవిహారం. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
చిలుకూరు ఆలయంలో ‘వివాహ ప్రాప్తి’ రద్దు: ప్రధాన అర్చకులు రంగరాజన్
-
ఈ పోలింగ్ ఏజెంట్ ఇంటర్నెట్ సెన్సేషన్.. ఎవరీ ఈశా అరోడా..?
-
ఆ సినిమా నుంచి గుణపాఠం నేర్చుకున్నా: సోనాలి బింద్రే
-
దిల్లీ కోటలో తొలి మ్యాచ్.. హైదరాబాద్ దూకుడు కొనసాగేనా?
-
కేంద్ర ఎన్నికల సంఘానికి కనకమేడల మరో లేఖ
-
సైబర్ టవర్స్ వద్ద చంద్రబాబు జన్మదిన వేడుకలు