Cricket Drona: ముంబయి ‘క్రికెట్ ద్రోణా’ వాసు పరాంజే కన్నుమూత
ముంబయి క్రికెట్కు మారుపేరుగా నిలిచిన మాజీ క్రికెటర్, కోచ్ వాసు పరాంజే సోమవారం సాయంత్రం కన్నుమూశారు. 6 దశాబ్దాలుగా భారత క్రికెట్కు, ముంబయి క్రికెట్కు ఎనలేని సేవలు అందించిన ఆయన మరెన్నో కీలక బాధ్యతలు చేపట్టారు...
(Photo: RaviShastri Twitter)
ఇంటర్నెట్డెస్క్: ముంబయి క్రికెట్కు మారుపేరుగా నిలిచిన మాజీ క్రికెటర్, కోచ్ వాసు పరాంజే సోమవారం సాయంత్రం కన్నుమూశారు. ఆరు దశాబ్దాలుగా భారత క్రికెట్కు, ముంబయి క్రికెట్కు ఎనలేని సేవలు అందించారు. ముంబయి క్రికెట్లోని పలువురు దిగ్గజాలకు కోచ్గా వ్యవహరించారు. ఆయన మృతి పట్ల ముంబయి క్రికెట్ అసోసియేషన్తో పాటు టీమ్ఇండియా దిగ్గజాలు సునీల్ గావస్కర్, రవిశాస్త్రి, దిలీప్ వెంగ్సర్కార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహారాష్ట్ర నవ్నిర్మాణ్ సేన నాయకుడు రాజ్ ఠాక్రే సంతాపం తెలిపారు.
82 ఏళ్ల వాసు.. 29 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడి 2 శతకాలతో 785 పరుగులు చేశారు. ఇవి క్రికెట్లో అంత మెరుగైన గణంకాలు కాకపోయినా ఆటపై ఆయనకున్న పరిజ్ఞానం ఎనలేనిది. అలాగే యువ క్రికెటర్ల మనస్తత్వాన్ని అర్థం చేసుకొని అందుకు తగ్గట్లు శిక్షణ ఇవ్వడం వాసు పరాంజే ప్రత్యేకత. 60, 70ల్లో దాదర్ యూనియన్ జట్టుకు నాయకత్వం వహించిన వాసు జట్టులో.. గావస్కర్, వెంగ్సర్కార్ లాంటి ఆటగాళ్లు ఆడారు. తనదైన వ్యక్తిత్వంతో అందరిలో మంచిపేరు సంపాదించారు. ఇక 1987లో బీసీసీఐ తొలిసారి ఇండోర్లో అండర్-15 నేషనల్ క్యాంప్ ఏర్పాటు చేయగా వాసు కోచ్గా ఉన్నారు. అప్పుడు సచిన్, గంగూలీ, వినోద్ కాంబ్లీ, ధ్రువ్ పాండోవ్(ఇప్పుడు లేరు) లాంటి యువ క్రికెటర్లు ఆయన వద్దే శిక్షణపొందారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
సొంత మైదానంలో లఖ్నవూ విజయం సాధించింది. ఆ జట్టు గెలుపు కంటే మరొక అంశం అభిమానులను ఆకట్టుకుంది. అదే ఎంఎస్ ధోనీ (MS Dhoni) బ్యాటింగ్ వీరవిహారం. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్లో మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా
-
యాక్టర్ జగన్.. ఎన్నికల లబ్ధికి ఉత్తుత్తి శిబిరాలు