Team India: టీమ్ఇండియాలో అంత టాలెంట్ ఉంది కాబట్టే.. ఇలాంటి వ్యాఖ్యలు: పాంటింగ్
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ లాంటి సీనియర్ ఆటగాళ్లను పక్కనపెట్టడం కష్టమని, భారత జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లు చాలా మంది ఉన్నందునే ఇలాంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయని...
ఇంటర్నెట్డెస్క్: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ వంటి సీనియర్ ఆటగాళ్లను పక్కనపెట్టడం కష్టమని, భారత జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లు చాలా మంది ఉన్నందునే ఇలాంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయని ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్ అన్నాడు. ఇటీవల టీ20 ప్రపంచకప్ ఫేవరెట్ జట్లలో ఒకటిగా అడుగుపెట్టిన భారత జట్టు కనీసం సెమీఫైనల్స్కు కూడా చేరకుండా ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. దీంతో సీనియర్ ఆటగాళ్లను పక్కనపెట్టి నైపుణ్యం కలిగిన రుతురాజ్, పడిక్కల్, ఇషాన్ కిషన్ వంటి యువకులకు అవకాశాలివ్వాలని పలువురు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయంపై ‘ది గ్రేడ్ క్రికెటర్’ అనే కార్యక్రమంలో మాట్లాడిన పాంటింగ్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
‘టీమ్ఇండియా జట్టులో ఇప్పటికే ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ వంటి ఆటగాళ్లు ఉన్నారు. మరికొంత మందిని కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. శ్రేయస్ అయ్యర్ కూడా ముఖ్యమైన ఆటగాడే. అయినా, రోహిత్, రాహుల్, కోహ్లీలను పక్కనపెట్టలేరు. మరోవైపు హార్దిక్ పాండ్య కూడా జట్టులో ఉన్నాడు. ఒకవేళ అతడు బౌలింగ్ చేయకపోతే ఆ స్థానంలో యువ ఆటగాళ్లను ఉపయోగించుకోవచ్చు. టీమ్ఇండియాలో నైపుణ్యమున్న ఆటగాళ్లు చాలా మంది ఉన్నారని గుర్తుంచుకోవాలి. జట్టులో సీనియర్ ఆటగాళ్లు ఆడలేనప్పుడు వారిని తప్పించాలని అనుకుంటారు. వారికి చాలా మంది ప్రతిభావంతమైన ఆటగాళ్లు ఉన్నందునే ఇలాంటి మాటలు వినిపిస్తాయి’ అని పాంటింగ్ వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30 ఏళ్ల క్రితం సచిన్ ఆట మొదలైంది ఈ రోజే..!
సరిగ్గా ఇదే రోజు.. 30 ఏళ్ల క్రితం (మార్చి 27, 1994) మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ కెరీర్ మలుపు తిరిగింది. -
భారత్ - పాక్ ద్వైపాక్షిక సిరీస్ల నిర్వహణకు ఆసీస్ ఆసక్తి!
భారత్, పాక్ల మధ్య 2012-13 నుంచి ఇప్పటివరకూ ఎటువంటి ద్వైపాక్షిక సిరీస్లు జరగలేదు. ఈ తరుణంలో క్రికెట్ ఆస్ట్రేలియా మరోసారి తన ఆసక్తిని బయటపెట్టింది. -
కెప్టెన్సీ ఇచ్చారు సరే.. టైమూ ఇవ్వాలి కదా.. అల్లుడిని వెనకేసుకొచ్చిన షాహిద్ అఫ్రిది
పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది మరోసారి ఫైర్ అయ్యాడు. తన అల్లుడు షహీన్ను కెప్టెన్సీ నుంచి తప్పించనున్నారనే కథనాల నేపథ్యంలో స్పందించాడు. -
కెప్టెన్గా తొలిసారి గిల్కు రూ. 12 లక్షల జరిమానా.. పునరావృతమైతే ఒక మ్యాచ్ వేటు!
గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ (Shubman Gill) జరిమానా ఎదుర్కొన్నాడు. స్లో ఓవర్ రేట్ కారణంగా ఐపీఎల్ నిర్వాహకులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు., -
రెండు మ్యాచుల్లో ఒక్క బంతినీ ఎదుర్కోని ధోనీ.. కారణమేంటో చెప్పిన మైక్ హస్సీ!
ఈ ఐపీఎల్ సీజన్లో ధోనీ (MS Dhoni) బ్యాటింగ్ను చూసే అవకాశం ఇప్పటి వరకూ రాలేదు. తొలి రెండు మ్యాచుల్లోనూ మహీ వికెట్ కీపింగ్కే పరిమితమయ్యాడు. -
హైదరాబాద్ జట్టుకు తప్పని నిరీక్షణ.. కీలక స్పిన్నర్ మరో వారం దూరం!
ఓటమితో టోర్నీని ప్రారంభించిన రెండు జట్లు నేడు ఉప్పల్ వేదికగా తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్కు షాకింగ్ న్యూస్. టాప్ స్పిన్నర్ ఇంకా అందుబాటులోకి రాలేదు. -
ఇతరుల కెప్టెన్సీలో ఆడినా.. ధోనీ - రోహిత్ స్థాయి ఎప్పటికీ తగ్గదు: సిద్ధూ
హార్దిక్ పాండ్య నాయకత్వంలో ముంబయి తొలి మ్యాచ్లో ఓడిపోయింది. దీంతో అతడి సారథ్యంపైనా విమర్శలు వస్తున్నాయి. -
నేడు హైదరాబాద్తో ముంబయి మ్యాచ్.. చరిత్ర సృష్టించనున్న రోహిత్ శర్మ
హార్దిక్ పాండ్య సారథ్యంలోని ముంబయి బుధవారం హైదరాబాద్తో తలపడనుంది. ఈమ్యాచ్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మకు చాలా ప్రత్యేకం కానుంది. -
కొత్త రూల్స్ మాకు ఉపయోగం.. బ్యాటర్లు చిత్తే: దీపక్ చాహర్
గుజరాత్ను ఓడించడంలో చెన్నై బౌలర్ దీపక్ చాహర్, శివమ్ దూబె కీలక పాత్ర పోషించారు. -
వారిని చూస్తుంటే.. మా జట్టులో అదనంగా ఇద్దరు కుర్రాళ్లు ఉన్నట్టుంది: రుతురాజ్ గైక్వాడ్
వరుసగా రెండో విజయంతో చెన్నై జట్టు ఐపీఎల్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. -
చెన్నైదే చిందు
యువ కెప్టెన్ల పోరులో రుతురాజ్ గైక్వాడ్దే పైచేయి. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై ఖాతాలో వరుసగా రెండో విజయం. తొలి మ్యాచ్ను మించిన ప్రదర్శన చేస్తూ అన్ని రంగాల్లోనూ ఆధిపత్యం చలాయిస్తూ సూపర్కింగ్స్.. గుజరాత్ టైటాన్స్ను చిత్తుగా ఓడించింది. -
బోణీ కొట్టేదెవరో
కొత్త సారథులు.. సరికొత్త ఉత్సాహంతో బరిలో దిగిన సన్రైజర్స్ హైదరాబాద్, ముంబయి ఇండియన్స్ జట్లకు ఆరంభ మ్యాచ్ల్లో పరాజయాలు తప్పలేదు. -
టికెట్లో రామచంద్ర!
ఐపీఎల్-17 ఆతిథ్యానికి హైదరాబాద్ సిద్ధమైంది. రసవత్తర మ్యాచ్లకు వేదికగా నిలిచేందుకు ఉప్పల్ స్టేడియం ముస్తాబైంది. అటు సన్రైజర్స్ యాజమాన్యం.. ఇటు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) మ్యాచ్ల నిర్వహణ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాయి. -
రెండు నెలలు ఎందుకంటే..
విరాట్ కోహ్లి ఇటీవల రెండు నెలల క్రికెట్కు దూరంగా ఉన్నాడు. భార్య అనుష్క తమ రెండో బిడ్డకు జన్మనిచ్చిన నేపథ్యంలో కుటుంబంతో అతడు విలువైన సమయం గడిపాడు. -
భారత్కు అఫ్గాన్ షాక్
69 నిమిషాల వరకు మ్యాచ్లో ఆధిక్యం.. బంతిపై చక్కని నియంత్రణ! ప్రత్యర్థి గోల్పోస్టుపై వరుస దాడులు! ఇవన్నీ చూస్తే విజయం భారత్దే అనిపించింది. -
భారత క్రికెటర్లను మార్చింది కోహ్లినే
ఫిట్నెస్ను ఎంతో ప్రేమించే విరాట్ కోహ్లి భారత క్రికెటర్లందరిని తన బాటలో నడిపిస్తున్నాడని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ కొనియాడాడు. ఐపీఎల్ వ్యాఖ్యతగా ఉన్న కేపీ ఇలా వ్యాఖ్యానించాడు. -
గాయత్రి జోడీ ఓటమి
స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పుల్లెల గాయత్రి-ట్రీసా జాలీ జంటకు చుక్కెదురైంది. ఈ అయిదో సీడ్ జోడీ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. -
నవంబరు 22న పెర్త్లో..
ఆతిథ్య ఆస్ట్రేలియా, టీమ్ఇండియా మధ్య అయిదు టెస్టుల బోర్డర్-గావస్కర్ సిరీస్ నవంబరు 22న పెర్త్లో ఆరంభం కానుంది. రెండో టెస్టు డిసెంబరు 6 నుంచి జరుగుతుంది. -
శ్రీజకు కెరీర్ ఉత్తమ ర్యాంకు
భారత యువ టేబుల్ టెన్నిస్ స్టార్ ఆకుల శ్రీజ కెరీర్లో ఉత్తమ ర్యాంకు సాధించింది. తాజా ప్రపంచ టీటీ ర్యాంకింగ్స్ మహిళల సింగిల్స్లో ఈ తెలుగమ్మాయి 40వ ర్యాంకులో నిలిచింది. -
Rahane: రహానె కళ్లు చెదిరే క్యాచ్.. ముందుకు డైవ్ చేసి.. బంతిని ఒడిసి పట్టి
చెన్నై: ఐపీఎల్ 17వ సీజన్లో తన రెండో మ్యాచ్లో గుజరాత్ను చెన్నై చిత్తుగా ఓడించింది. 207 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన గుజరాత్ 143 పరుగులకే పరిమితమైంది. ఆ జట్టు 96 పరుగుల వద్ద తుషార్ దేశ్పాండే బౌలింగ్లో డేవిడ్ మిల్లర్ (21) ఔటయ్యాడు. మిల్లర్ కొట్టిన భారీ షాట్ను అజింక్య రహానె ముందుకు డైవ్ చేసి అద్భుతంగా క్యాచ్ను ఒడిసిపట్టాడు. ఇంకేందుకు ఆలస్యం వీడియో చూసేయండి..
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా అభ్యర్థుల్ని ప్రకటించాల్సిన స్థానాలివే!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
పెద్దిరెడ్డికి ఇసుకే అల్పాహారం.. మైన్స్ మధ్యాహ్న భోజనం: చంద్రబాబు
-
జాన్వీతో రామ్ చరణ్ సినిమా.. ఏడేళ్ల క్రితమే కోరిక బయటపెట్టిన చిరంజీవి
-
దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది ‘రాజకీయ ప్రతీకారమే’ - ఆప్
-
మథుర కాకపోతే పోటీ చేసేదాన్ని కాదు : హేమమాలిని