IND vs NZ: గెలవడం అంత తేలిక కాదని తెలిసింది: రోహిత్
న్యూజిలాండ్తో జరిగిన తొలి టీ20లో గెలవడం అంత తేలిక కాదని చివర్లో తెలిసొచ్చిందని కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. టీ20 సారథిగా నూతన బాధ్యతలు తీసుకున్న అతడు తొలి మ్యాచ్లోనే టీమ్ఇండియాను గెలిపించాడు...
ఇంటర్నెట్డెస్క్: న్యూజిలాండ్తో జరిగిన తొలి టీ20లో గెలవడం అంత తేలిక కాదని చివర్లో తెలిసొచ్చిందని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. టీ20 సారథిగా నూతన బాధ్యతలు తీసుకున్న అతడు తొలి మ్యాచ్లోనే జట్టును గెలిపించాడు. 165 పరుగుల లక్ష్య ఛేదనలో రోహిత్ (48; 36 బంతుల్లో 5x4, 2x6), సూర్యకుమార్ (62; 40 బంతుల్లో 6x4, 3x6) చెలరేగిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ రెండో వికెట్కు 59 పరుగులు జోడించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అయితే, జట్టు స్కోర్ 109 వద్ద రోహిత్, 144 పరుగుల వద్ద సూర్యకుమార్ ఔటవ్వగా చివరి మూడు ఓవర్లలో భారత్కు 21 పరుగులు చేయాల్సి వచ్చింది.
అలాంటి కీలక సమయంలో ఫెర్గూసన్, సౌథీ కట్టుదిట్టంగా బంతులేసి తర్వాతి రెండు ఓవర్లలో 11 పరుగులే ఇచ్చారు. దీంతో చివరి ఓవర్లో టీమ్ఇండియా విజయానికి 10 పరుగులు అవసరమయ్యాయి. చేతిలో వికెట్లున్నా కివీస్ కట్టుదిట్టంగా బంతులేస్తుండటంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఇక మిచెల్ చివరి ఓవర్ వేయగా తొలి బంతి వైడ్గా వెళ్లింది. తర్వాత వెంకటేశ్ అయ్యర్(4) ఒక బౌండరీ బాది ఔటయ్యాడు. దీంతో మళ్లీ ఉత్కంఠ నెలకొంది. మూడో బంతి కూడా వైడ్ రావడంతో తర్వాత అక్షర్ పటేల్ (1) సింగిల్ తీసి పంత్కు బ్యాటింగ్ అవకాశం కల్పించాడు. నాలుగో బంతికి పంత్ (17*) బౌండరీ బాది జట్టును విజయతీరాలకు చేర్చాడు. మ్యాచ్ చివరి ఓవర్లో ఉత్కంఠ నేపథ్యంలో రోహిత్ స్పందించాడు.
‘చివర్లో విజయం సాధించడం కష్టమనే విషయాన్ని మేం గుర్తించాం. మా కుర్రాళ్లు ఇలా రాణించడం గొప్పగా ఉంది. అయితే, కొత్త కుర్రాళ్లు ఇలాంటి కీలక సమయంలో టీమ్ ఇండియా తరఫున రాణించడం ఇదే తొలిసారి. చివరి దశలో జట్టు విజయం సాధించాలంటే ఏం చేయాలనే దాన్ని అర్థం చేసుకోవడం చాలా మంచిది. ఎప్పుడూ దంచికొట్టడమే సరిపోదు. పరిస్థితులకు తగ్గట్టు ఆడుతూ ఫీల్డర్ల మధ్యలోంచి షాట్లు ఆడటం కూడా ముఖ్యమే. కివీస్ ఇన్నింగ్స్లో ఆఖరి రెండు, మూడు ఓవర్లు మా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడం మంచి పరిణామం. ఇక అశ్విన్, అక్షర్ పటేల్ దిల్లీ క్యాపిటల్స్ జట్టులో కీలక స్పిన్నర్లు. ఎప్పుడూ వికెట్లు తీయాలనే కసితో ఉంటారు. మరోవైపు సూర్యకుమార్ బాగా ఆడాడు. తన సహజసిద్ధమైన ఆట చూపించాడు. చివరగా నేను, బౌల్ట్ చాలా మ్యాచ్లు కలిసి ఆడాం. తనకు నా బలహీనత తెలుసు. నాకు అతడి బలం తెలుసు. దీంతో మా ఇద్దరి మధ్యా ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం నెలకొంది’ అని రోహిత్ అన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
-
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
-
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
-
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
-
గులకరాయికి.. రాజకీయ రంగు!
-
నేటి నుంచి రేవంత్ ప్రచారభేరి