IND vs NZ: ఇద్దరు రవీంద్రలు.. ఇద్దరు పటేల్లు.. ఒకేలా ముగింపు
క్రికెటర్లకు సంబంధించిన కొన్ని విషయాలు యాదృశ్చికంగా ఒకరికొకరివి కలుస్తుండటం సహజం. బ్యాటింగ్, బౌలింగ్, ఆటతీరు...
భారత్, కివీస్ జట్ల మధ్య కొన్ని పోలికలు మీ కోసం..
ఇంటర్నెట్ డెస్క్: క్రికెటర్లకు సంబంధించిన కొన్ని విషయాలు యాదృచ్ఛికంగా ఒకరికొకరివి కలుస్తుండటం సహజం. బ్యాటింగ్, బౌలింగ్, ఆటతీరు, జెర్సీ నంబర్.. ఇలా ఏదైతేనేమీ పోలికలు సరిపోతుంటాయి. అయితే ఒకే మ్యాచ్లో వారు ప్రత్యర్థులుగా ఎదురుపడటం అరుదుగా జరిగే విషయమే. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో ఇలాంటి అరుదైన అంశాలు కొన్ని ఉన్నాయి. మరి అవేంటో ఓ సారి చూద్దాం...
ఒకరిదేమో అంతర్జాతీయంగా 57 టెస్టుల అనుభవం.. మరొకరు ఇప్పుడే అరంగేట్రం చేసిన యువ క్రికెటర్.. అయితే వీరిద్దరి జెర్సీ నంబర్ (8) ఒకటే కావడం విశేషం. అదేవిధంగా ఇద్దరూ ఎడమచేతివాటం బ్యాటర్లు, బౌలర్లు.. అంతేనా.. ఆల్రౌండర్లు కూడానూ.. అయితే ఇప్పుడు ఒకే టెస్టు మ్యాచ్లో ప్రత్యర్థులుగా తలపడుతున్నారు.. పేర్లలోనూ కాస్త సారూప్యత కలిగిన ఆ ఆటగాళ్లు.. రవీంద్ర జడేజా, రచిన్ రవీంద్ర. టీమ్ఇండియా టాప్ ఆల్రౌండర్లలో రవీంద్ర జడేజా ఒకడు. కివీస్తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో అర్ధశతకం సాధించాడు. బౌలింగ్లోనూ పొదుపుగా (33-10- 57-1) బౌలింగ్ చేశాడు. కివీస్ తరఫున అరంగేట్రం చేసిన రచిన్ రవీంద్ర ఇప్పటివరకైతే (తొలి ఇన్నింగ్స్ బౌలింగ్ గణాంకాలు 7-1-28-0) పెద్దగా ప్రభావం చూపలేదు. అటు బ్యాటింగ్లోనూ 13 పరుగులే చేశాడు. తొలి టెస్టు ఆడుతున్న రచిన్ రవీంద్రను ఆల్రౌండర్ రవీంద్ర జడేజానే క్లీన్ బౌల్డ్ చేయడం విశేషం.
రెండు జట్లలోనూ ఎ. పటేల్లు..
టీమ్ఇండియా, కివీస్ జట్లలో ఎ.పటేల్ పేరు కలిగిన ఆటగాళ్లు ఉన్నారని మీకు తెలుసా..? అవును నిజంగానే.. అయితే షార్ట్కట్లో ఇద్దరి పేర్లు ఒకటే కానీ.. అసలు పేర్లైతే వేరేలేండి.. భారత్ తరఫున ఆడుతున్న ఎ.పటేల్ పూర్తి పేరు అక్షర్ పటేల్. మరి కివీస్ జట్టుకు ఆడే ఎ. పటేల్ కూడా ఉన్నాడు. అయితే అతడి పేరు అజాజ్ పటేల్.. కివీస్ తరఫున పది టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించాడు. మన అక్షర్కిది ఐదో టెస్టు మాత్రమే. అంతేకాదండోయ్.. ఇద్దరి పేర్లలోనూ పోలిక ఉన్నట్లే వారి బ్యాటింగ్, బౌలింగ్ శైలి కూడానూ ఒకటే. ఇద్దరూ లెఫ్ట్ఆర్మ్ స్పిన్నర్లు. ఎడమ చేతివాటం బ్యాటర్లు. అయితే అక్షర్ అప్పుడప్పుడూ బ్యాటింగ్ కూడా చేయగలడు కానీ.. అజాజ్ బౌలర్గానే ఎంపికయ్యాడు. రచిన్ రవీంద్ర, అజాజ్ పటేల్ కుటుంబాలు భారతీయ సంతతికి చెందినవే.
రెండు రోజుల ముగింపు ఒకేలా...
తొలి రెండు రోజుల ముగింపు సందర్భంగా క్రీజ్లో ఉన్న బ్యాటర్ల స్కోరు ఒకేలా ఉండటం విశేషం. తొలుత టాస్ నెగ్గిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుని కివీస్కు బౌలింగ్ అప్పగించింది. అయితే జేమీసన్ దెబ్బకు టీమ్ఇండియా 145 పరుగులకే నాలుగు వికెట్ల కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే అరంగేట్ర బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (75*), ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (50*) ఇన్నింగ్స్ను నిలబెట్టడంతో తొలి రోజు భారత్ 258/4 స్కోరుతో ఆటను ముగించింది. రెండో రోజు టిమ్ సౌథీ విజృంభణతో భారత్ 345 పరుగులకే కుప్పకూలింది. అయితే శ్రేయస్ అయ్యర్ (105) కెరీర్లో తొలి శతకం నమోదు చేసుకున్నాడు. అనంతరం తమ తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన న్యూజిలాండ్ రెండో రోజు ఆట ముగిసేసమయానికి వికెట్ నష్టపోకుండా 129 పరుగులు చేసింది. కివీస్ ఓపెనర్లు టామ్ లేథమ్ (50*), విల్ యంగ్ (75*) స్కోరుతో రోజును ముగించడం విశేషం. అయితే మూడో రోజు భారత బౌలర్ల దెబ్బకు కివీస్ 296 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమ్ఇండియాకు 49 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. అనంతరం మూడో రోజు ఆట ముగిసేసమయానికి భారత్ 14/1తో ఉంది. శుభ్మన్ గిల్ (1) త్వరగా ఔటవ్వగా.. క్రీజ్లో మయాంక్ అగర్వాల్ (4*), పుజారా (9*) ఉన్నారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు 63 పరుగుల ఆధిక్యంలో భారత్ నిలిచింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్లో న్యూజిలాండ్ క్రికెట్ ప్రసార హక్కులు ఎస్పీఎన్ఐ సొంతం
న్యూజిలాండ్ పురుషుల (బ్లాక్ క్యాప్స్), మహిళల (వైట్ ఫెర్న్స్) క్రికెట్ జట్ల మ్యాచ్లను వచ్చే ఏడేళ్ల పాటు భారత్, అనుబంధ ప్రాంతాల్లో ప్రసారం చేసేందుకు సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా (ఎస్పీఎన్ఐ) టెలివిజన్, డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు. -
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
దాదాపు రెండు నెలలపాటు క్రికెట్ అభిమానులను అలరించే ఐపీఎల్.. రికార్డులను ఖాతాలో వేసుకుంటోంది. -
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యను ముంబయి మేనేజ్మెంట్ కెప్టెన్గా నియమించుకుంది. దీంతో సోషల్ మీడియాలో ఆ ఫ్రాంచైజీపై ట్రోలింగ్ వచ్చింది. ఇప్పుడు ముంబయి వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోవడంతో పాండ్య సారథ్యంపై విమర్శల దాడి ఎక్కువైంది. -
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
తన అభిమాన క్రికెటర్తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం ఎప్పటికీ మరిచిపోలేనని చెన్నై ఆటగాడు సమీర్ రిజ్వీ వ్యాఖ్యానించాడు. -
గత సీజన్లో విదేశీ క్రికెటర్లకు ఆ కోచ్ తీరు నచ్చలేదు: కోల్కతా మాజీ ఆటగాడు
కోల్కతా ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిత్ వల్ల చాలామంది విదేశీ క్రికెటర్లు ఇబ్బందిపడ్డారని నమీబియా క్రికెటర్ వ్యాఖ్యానించడం సంచలనమైంది. -
మా బౌలర్ల తప్పేమీ లేదు.. హైదరాబాద్ బ్యాటర్లకు హ్యాట్సాఫ్: హార్దిక్ పాండ్య
ముంబయి బౌలర్లు భారీగా పరుగులు ఇవ్వడంతో హైదరాబాద్ రికార్డు స్కోరును నమోదు చేసి చరిత్ర సృష్టించింది. దీంతో ఐపీఎల్ 17వ సీజన్లో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. -
‘అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఆమె’.. నెట్టింట వైరల్గా మారిన కావ్యా మారన్
కావ్యా మారన్.. సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ యజమాని. ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ భారీ స్కోరు సాధించడంతో ఆమె ఒక్కసారిగా నెట్టింట వైరల్గా మారారు. -
ముంబయి లక్ష్య ఛేదన దిశగా వస్తుందని భావించారా? ప్యాట్ కమిన్స్ సమాధానమిదే!
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ బోణీ కొట్టింది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబయిని చిత్తు చేసింది. -
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
ఉప్పల్ వేదికగా ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో పలు రికార్డులు నమోదు అయ్యాయి. -
ఉప్పల్ ఊగిపోయింది
ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్లో సన్రైజర్స్ అద్వితీయమైన బ్యాటింగ్తో అదరగొట్టింది. బ్యాటర్లు మెషీన్ గన్నుల్లా పేలడంతో ఐపీఎల్లో రికార్డు స్కోరుతో సత్తాచాటింది. తొలి మ్యాచ్లో త్రుటిలో ఓడినా.. రెండో పోరులో చిరస్మరణీయ విజయం అందుకుంది. -
ఇది సన్రైజర్సేనా?
సన్రైజర్స్ అంటే.. నత్తనడక బ్యాటింగ్కు మారు పేరు! సన్రైజర్స్ బ్యాటర్లది.. స్ట్రైక్రేట్లో ఎప్పుడూ వెనుకంజే! సన్రైజర్స్ మెరుపులన్నీ బౌలింగ్ వరకే! కానీ ఇదంతా పాత కథ! -
సింధు శుభారంభం
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. -
సెమీస్లో బోపన్న జోడీ
44 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్న భారత టెన్నిస్ వెటరన్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న మరో టైటిల్ దిశగా సాగుతున్నాడు. -
ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీలో శ్రీజేష్
అంతర్జాతీయ హాకీ సమాఖ్య నూతన ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీ సహ అధ్యక్షుడిగా భారత హాకీ వెటరన్ గోల్కీపర్ శ్రీజేష్ నియమితుడయ్యాడు. -
‘ఇంపాక్ట్ ప్లేయర్’ వల్లే ధోని అలా..
కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు. ఆటగాడిగా కూడా ఇదే చివరి సీజన్ అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేంద్ర ధోని బ్యాటు పట్టి కొన్ని మెరుపులు మెరిపిస్తే చూడాలన్నది అభిమానుల ఆశ. -
కోచ్కు జకోవిచ్ టాటా
కోచ్ గోరాన్ ఇవానిసెవిచ్తో ఆరేళ్ల బంధానికి జకోవిచ్ వీడ్కోలు పలికాడు. 2018లో ఇవానిసెవిచ్తో కలిసి జకోవిచ్ ప్రయాణం ప్రారంభించాడు. -
సచిన్ గోల్ఫాట
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ గోల్ఫ్ స్టిక్ చేతబట్టాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బౌల్డర్హిల్స్ క్లబ్లో బుధవారం గోల్ఫ్ ఆడాడు. -
భారత్-పాక్ సిరీస్.. ఆసీస్ ఆసక్తి
భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్కు ఆతిథ్యమివ్వడానికి ఆస్ట్రేలియా మరోసారి ఆసక్తి వ్యక్తం చేసింది. -
ముంబయిలో హార్దిక్కు మరింతగా..
రోహిత్ శర్మ స్థానంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా ఎంపికైన హార్దిక్ పాండ్యకు సామాజిక మాధ్యమాల్లోనే కాదు మైదానాల్లోనూ తీవ్ర వ్యతిరేకత తప్పడం లేదు. -
మళ్లీ బాబర్కే పగ్గాలు!
పాకిస్థాన్ క్రికెట్ జట్టు పగ్గాలు మళ్లీ బాబర్ అజామ్ చేతికి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అతణ్ని మరోసారి జట్టు కెప్టెన్గా నియమించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు