IND vs NZ: హర్షల్ అరంగేట్రం సూపర్.. కివీస్ను కట్టడి చేసిన భారత్
మూడు టీ20ల సిరీస్లో భాగంగా రెండో టీ20 మ్యాచ్లో భారత్కు న్యూజిలాండ్ 175 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ నెగ్గిన టీమ్ఇండియా సారథి రోహిత్ శర్మ
రాంచీ: మూడు టీ20ల సిరీస్లో భాగంగా రెండో టీ20 మ్యాచ్లో భారత్కు న్యూజిలాండ్ 154 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ నెగ్గిన టీమ్ఇండియా సారథి రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకుని కివీస్కు బ్యాటింగ్ అప్పగించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ ద్వారా హర్షల్ పటేల్ భారత టీ20 జట్టులోకి అరంగేట్రం చేశాడు. సిరాజ్ బదులు తుది జట్టులోకి వచ్చాడు. భారీ స్కోరు సాధిస్తుందనుకున్న కివీస్ను భారత బౌలర్లు అడ్డుకున్నారు.
తొలుత బ్యాటింగ్కు దిగిన కివీస్కు ఓపెనర్లు మార్టిన్ గప్తిల్ (31), డారిల్ మిచెల్ (31) శుభారంభం ఇచ్చారు. వీరిద్దరూ ధాటిగా ఇన్నింగ్స్ను ప్రారంభించారు. తొలి వికెట్కు 48 పరుగులు జోడించారు. అయితే గప్తిల్ ఔటైన తర్వాత కివీస్ పరుగుల వేగం మందగించింది. అడపాదడపా బౌండరీలు ఇచ్చినా.. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. మిడిలార్డర్ బ్యాటర్లు మార్క్ చాప్మన్ (21), గ్లెన్ ఫిలిప్స్ (34) దూకుడుగా ఆడటంతో న్యూజిలాండ్ గౌరవప్రదమైన స్కోరును చేయగలిగింది. మిగిలిన బ్యాటర్లలో సీఫర్ట్ 13, నీషమ్ 3, సాట్నర్ 8*, మిల్నే 5* పరుగులు చేశారు. అరంగేట్ర బౌలర్ హర్షల్ పటేల్ (2/25) రెండు వికెట్లు తీసి సత్తా చాటాడు. అయితే ఆల్రౌండర్ వెంకటేశ్ అయ్యర్తో బౌలింగ్ చేయించకపోవడం గమనార్హం. భారత బౌలర్లలో హర్షల్ 2.. దీపక్ చాహర్, భువనేశ్వర్, అక్షర్ పటేల్, అశ్విన్ తలో వికెట్ తీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి.
తాజా వార్తలు (Latest News)
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్