T20 World Cup: వార్నర్ని ఎంపిక చేయడం కచ్చితంగా తప్పుడు నిర్ణయమే: అక్తర్
టీ20 ప్రపంచకప్లో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ని ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా ఎంపిక చేయడం తప్పుడు నిర్ణయమని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అసహనం వ్యక్తం చేశాడు...
ఇంటర్నెట్డెస్క్: టీ20 ప్రపంచకప్లో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ని ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా ఎంపిక చేయడం తప్పుడు నిర్ణయమని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అసహనం వ్యక్తం చేశాడు. ఇది సరైన నిర్ణయం కాదన్నాడు. ఆదివారం రాత్రి న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో వార్నర్ (53) అర్ధ శతకంతో రాణించిన సంగతి తెలిసిందే. దీంతో అతడు ఈ టోర్నీలో మొత్తం 289 పరుగులు సాధించి.. అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. మరోవైపు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ 303 పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు. అయినా, అతడిని కాదని వార్నర్ని ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా ఎంపిక చేయడం అక్తర్కు నచ్చలేదు.
‘బాబర్ అజామ్ ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా ఎంపిక అవుతాడని నేను నిజంగా ఎదురుచూశాను. ఇది కచ్చితంగా సరైన నిర్ణయం కాదు’ అని తన అభిప్రాయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. కాగా, ఈ టీ20 ప్రపంచకప్ టోర్నీకి ముందు వార్నర్ ఫామ్ కోల్పోయి సతమతమయ్యాడు. ఐపీఎల్లోనూ పరుగులు చేయలేక ఇబ్బందులు పడ్డాడు. అయినా, ఏడు మ్యాచ్ల్లో మూడు అర్ధశతకాలతో రాణించాడు. ఒకవైపు కెప్టెన్ ఆరోన్ ఫించ్ విఫలమవుతున్న వేళ మరోవైపు టాప్ ఆర్డర్లో కీలక సమయాల్లో అదరగొట్టాడు. మరీ ముఖ్యంగా పాక్తో సెమీస్లో 49, కివీస్తో ఫైనల్లో 53 పరుగులు చేసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలోనే అతడిని ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా ఎంపిక చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు