Stuart Binny: 4 పరుగులు 6 వికెట్లు.. మరెవరికీ లేని రికార్డు.. అంతర్జాతీయ క్రికెట్కు బిన్నీ వీడ్కోలు
టీమ్ఇండియా వెటరన్ ఆల్రౌండర్ స్టువర్ట్ బిన్నీ అంతర్జాతీయ, ఫస్ట్క్లాస్ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. 37 ఏళ్ల ఈ క్రికెటర్ 6 టెస్టులు, 14 వన్డేలు, 2 టీ20లు ఆడాడు....
దిల్లీ: టీమ్ఇండియా వెటరన్ ఆల్రౌండర్ స్టువర్ట్ బిన్నీ అంతర్జాతీయ, ఫస్ట్క్లాస్ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. 37 ఏళ్ల ఈ క్రికెటర్ 6 టెస్టులు, 14 వన్డేలు, 2 టీ20లు ఆడాడు. భారత్ తరఫున వన్డేల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు అతడి పేరుతోనే ఉండటం గమనార్హం.
‘ఫస్ట్క్లాస్, అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నాను. అత్యున్నత స్థాయిలో టీమ్ఇండియాకు ఆడటం నాకెంతో గర్వకారణం. అందుకు నేనెంతో సంతోషిస్తున్నా. నా కెరీర్ ఎదుగుదలకు ఉపయోగపడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని స్టువర్ట్ బిన్నీ తెలిపాడు.
ప్రత్యేక కారణాలతో బిన్నీకి అంతర్జాతీయ క్రికెట్లో ఎక్కువ అవకాశాలు రాలేదు. అతడు ఎక్కువ పరుగులేమీ చేయలేదు. అయితే, 2014లో ఢాకాలో బంగ్లాదేశ్తో జరిగిన వన్డేలో అతడు అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. కేవలం 4 పరుగులే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లేకు సైతం ఇలాంటి రికార్డు లేకపోవడం గమనార్హం. 1993లో వెస్టిండీస్పై కుంబ్లే 12 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు. దానిని బిన్నీ బద్దలు కొట్టాడు.
బిన్నీకి దాదాపుగా 95 ఫస్ట్క్లాస్ మ్యాచులు ఆడిన అనుభవం ఉంది. అందుకే మహేంద్రసింగ్ ధోనీ అతడిని టెస్టు క్రికెట్లో ఉపయోగించుకొని కొంత విజయవంతం అయ్యాడు. 2014, జులైలో ఇంగ్లాండ్పై టెస్టుల్లో బిన్నీ అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచు రెండో ఇన్నింగ్స్లో 78 పరుగులు చేశాడు. అతనాడిన ఆరు టెస్టుల్లో సాధించిన ఏకైక అర్ధశతకం ఇదే.
ఫ్లోరిడా వేదికగా వెస్టిండీస్తో జరిగిన టీ20 మ్యాచులో బిన్నీ ఓ ఓవర్లో 31 పరుగులు ఇచ్చాడు. దాంతో అంతర్జాతీయ క్రికెట్లో అతడికి దారులు మూసుకుపోయాయి. ఎవిన్ లూయిస్ ఆ ఓవర్లో ఏకంగా ఐదు సిక్సర్లు బాదడంతో బిన్నీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. భారత క్రికెట్లో పరస్పర విరుద్ధ ప్రయోజనాల కారణంగా అతడి తండ్రి రోజర్ బిన్నీ సెలక్షన్ కమిటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
ప్రస్తుతం హార్దిక్ పాండ్య వంటి విధ్వంసకర ఆల్రౌండర్ దొరకడంతో స్టువర్ట్ బిన్నీకి అవకాశాలు రావడం కష్టమైంది. కాగా, ఒకప్పుడు కర్ణాటకకు ఆడిన అతడు కొన్నాళ్ల క్రితం ఈశాన్య భారతం నుంచి ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!