T20 World Cup: చూడు పంత్.. నాకింకా చాలా మంది కీపర్లు ఉన్నారు: కోహ్లీ
రాబోయే టీ20 ప్రపంచకప్లో సిక్సర్లతో చెలరేగాలని టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ యువ కీపర్ రిషభ్ పంత్కు స్పష్టం చేశాడు. ధనాధన్ బ్యాటింగ్తో జట్టుకు విజయాలందించాలని కోరాడు...
ధోనీ తర్వాత అంతగొప్ప కీపర్ ఇంకా దొరకలేదు
ఇంటర్నెట్డెస్క్: రాబోయే టీ20 ప్రపంచకప్లో సిక్సర్లతో చెలరేగాలని టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ యువ కీపర్ రిషభ్ పంత్కు సూచించాడు. ధనాధన్ బ్యాటింగ్తో జట్టుకు విజయాలందించాలని కోరాడు. లేదంటే తనకు చాలా మంది కీపర్లు ఉన్నారని హెచ్చరించాడు. దీనికి స్పందించిన యువ బ్యాట్స్మన్, కీపర్.. అందుకు తగ్గట్టే తాను సన్నద్ధమవుతున్నానని చెప్పాడు. రెండు రోజుల్లో టీ20 ప్రపంచకప్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో టోర్నీ ప్రసార హక్కుదారులు తాజాగా ఓ సరదా యాడ్ రూపొందించారు. అందులో కోహ్లీ, పంత్ మధ్య ఇలాంటి సరదా సంభాషణ చోటుచేసుకుంది. ఇప్పుడా వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అందులో కోహ్లీ, పంత్ వీడియో కాల్లో మాట్లాడుతూ ఇలా ముచ్చటించారు.
కోహ్లీ: పంత్.. టీ20ల్లో సిక్సులే మ్యాచ్లు గెలిపిస్తాయి.
పంత్: నువ్వేం కంగారు పడకు సోదరా.. నేను రోజూ ప్రాక్టీస్ చేస్తున్నా. ఇంతకుముందు.. వికెట్ కీపరే టీమ్ఇండియాకు సిక్సర్ కొట్టి ప్రపంచకప్ గెలిపించాడు. (2011లో శ్రీలంకపై ధోనీని ఉద్దేశించి)
కోహ్లీ: నిజమే కానీ, ధోనీ భాయ్ తర్వాత టీమ్ఇండియాకు అంత గొప్ప వికెట్ కీపర్ ఇంకా దొరకలేదు.
పంత్: నేను కూడా టీమ్ఇండియా కీపరే..
కోహ్లీ: చూడు పంత్.. నాకు చాలా మంది కీపర్లు అందుబాటులో ఉన్నారు. వార్మప్ మ్యాచ్ల్లో ఎవరెలా ఆడుతారో చూద్దాం. అంటూ సరదాగా మాట్లాడుకున్నారు.
ఐపీఎల్ 14వ సీజన్ యూఏఈలో నేటితో పూర్తవుతుంది. ఇక ఈనెల 17 నుంచి టీ20 ప్రపంచకప్ మొదలవుతుంది. ఈ క్రమంలోనే టీమ్ఇండియా 18, 20వ తేదీల్లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లతో వార్మప్ మ్యాచ్లు ఆడనున్నాయి. ఆపై 24న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో తొలిపోరులో తలపడనుంది. ఈ మెగా ఈవెంట్ను మరింత ఎక్కువ మంది వీక్షించేందుకు ప్రసార హక్కుదారులు వినూత్న రీతిలో యాడ్లు రూపొందించారు. మరోవైపు భారత్-పాక్ మ్యాచ్ నేపథ్యంలోనూ రూపొందించిన మరో యాడ్ కూడా నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.