Team India: అఫ్గానిస్థాన్పై టీమ్ఇండియా భారీ ఆశలు: అశ్విన్
టీమ్ఇండియా సెమీస్ చేరే విషయంపై జట్టులో ఎలాంటి చర్చలు జరగట్లేదని, తమ ధ్యాసంతా మిగిలిన మ్యాచ్ల్లో ఎలా గెలవాలనే దానిపైనే ఉందని సీనియర్ ఆఫ్స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు...
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా సెమీస్ చేరే విషయంపై జట్టులో ఎలాంటి చర్చలు జరగట్లేదని, తమ ధ్యాసంతా మిగిలిన మ్యాచ్ల్లో ఎలా గెలవాలనే దానిపైనే ఉందని సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. స్కాట్లాండ్తో మ్యాచ్కు ముందు మీడియాతో మాట్లాడిన అతడు ఇకపై మిగిలిన మ్యాచ్ల్లో ఎలా రాణించాలనే విషయంపై ఆలోచించాల్సిన అవసరం ఉందన్నాడు. చివరి రెండు మ్యాచ్ల్లో ప్రతి ఒక్కరూ తమ అవకాశాలను సద్వినియోగం చేసుకోడానికి ఎదురుచూస్తున్నారని చెప్పాడు. ఎవరెలా ఆడతారనేది తమ చేతుల్లో లేదని, అయినా ప్రతి ఒక్కరూ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనుకుంటున్నట్లు అశ్విన్ వివరించాడు.
మరోవైపు టీమ్ఇండియా సెమీస్ చేరాలంటే మిగిలిన మ్యాచ్ల్లో అఫ్గాన్.. న్యూజిలాండ్ను ఓడించాల్సినందున ఆ మ్యాచ్పై తాము భారీ ఆశలు పెట్టుకున్నట్లు చెప్పాడు. అఫ్గాన్ జట్టుకు యావత్ భారత అభిమానుల పూర్తి మద్దతు ఉంటుందన్నాడు. అఫ్గాన్ టీమ్ బాగా ఆడుతోందని.. కివీస్తో పోరు ఆసక్తిగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆ జట్టు న్యూజిలాండ్పై గెలవాలని ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఇక నాలుగేళ్ల తర్వాత తాను టీ20 ప్రపంచకప్ జట్టులోకి రావడం సంతోషంగా ఉందన్నాడు. ఈ మెగా టోర్నీలో రాణించాలని, జట్టుకు ఉపయుక్తమైన పాత్ర పోషించాలని కలలు కన్నట్లు చెప్పాడు. కాగా, టీమ్ఇండియా తొలి రెండు మ్యాచ్ల్లో ఓటమిపాలవ్వడంతో నిరాశ చెందానని, కానీ.. గత మ్యాచ్లో గెలవడంతో నూతనోత్తేజం కలిగిందని తెలిపాడు. భారత్ సెమీస్ చేరడానికి అన్నీ కలిసిరావాలని అశ్విన్ అభిప్రాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)