T20 World Cup: సెలబ్రేషన్స్లో ధోనీని కాపీ కొట్టిన అసిఫ్ అలీ
టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్ వరుసగా మూడు మ్యాచ్లు గెలిచి సెమీస్ బెర్తు ఖాయం చేసుకునేందుకు దగ్గరైంది. శుక్రవారం రాత్రి అఫ్గానిస్థాన్తో జరిగిన ఉత్కంఠపోరులో...
ఇంటర్నెట్డెస్క్: టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్ వరుసగా మూడు మ్యాచ్లు గెలిచి సెమీస్ బెర్తు ఖాయం చేసుకునేందుకు దగ్గరైంది. శుక్రవారం రాత్రి అఫ్గానిస్థాన్తో జరిగిన ఉత్కంఠపోరులో అద్భుత విజయం సాధించిన పాక్ జట్టు ప్రస్తుతం గ్రూప్-2లో టాప్లో నిలిచింది. అయితే, ఆ మ్యాచ్ అనంతరం పాక్ బ్యాట్స్మన్ అసిఫ్ అలీ టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీలా ‘గన్షాట్ సెలబ్రేషన్స్’ చేసుకోవడమే ఇప్పుడు ఆసక్తిగా మారింది. ధోనీ భారత జట్టులో చేరిన కొత్తలో శ్రీలంకపై అద్భుత శతకం సాధించాక తన బ్యాట్తో గన్షాట్ సెలబ్రేషన్స్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఆపై పలు సందర్భాల్లోనూ ఇలాగే సంబరాలు చేసుకున్నాడు.ఇప్పుడు అఫ్గాన్పై గెలిచాక అసిఫ్ కూడా అలాగే బ్యాట్ పైకెత్తి గన్తో షూట్ చేస్తున్నట్లు పోజులిచ్చాడు. దీంతో నెటిజన్లు వాళ్లిద్దరి ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకొని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు అసిఫ్ ఈ మ్యాచ్లో చివర్లో వచ్చి.. కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకున్నాడు. 12 బంతుల్లో 24 పరుగులు అవసరమైన వేళ ఒకే ఓవర్లో నాలుగు సిక్సులు బాది పాకిస్థాన్కు అద్భుత విజయం అందించాడు. అతడు ఏడు బంతుల్లోనే 25 పరుగులు చేసి అఫ్గాన్తో ఘోర పరాభవాన్ని తప్పించాడు. ఈ క్రమంలోనే మ్యాచ్ అనంతరం ధోనీలా సంబరాలు చేసుకున్నాడు. అంతకుముందు న్యూజిలాండ్తో తలపడిన మ్యాచ్లోనూ అసిఫ్ (27; 12 బంతుల్లో 1x4, 3x6) చివర్లో ధాటిగా ఆడి పాకిస్థాన్ను గెలిపించాడు. ఇలా అతడు వరుసగా రెండు మ్యాచ్లు గెలిపించడంతో అభిమానులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాప్రే బట్లర్.. ఒత్తిడిలో అద్భుత బ్యాటింగ్
ఆరు ఓవర్లలో 96 పరుగులు... ఎలాంటి పిచ్పైనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఛేదన చాలా చాలా కష్టం. పైగా ఆరు వికెట్లు పోయాయి. కోల్కతాతో మ్యాచ్లో భారీ లక్ష్య ఛేదనలో పోరాడుతున్న రాజస్థాన్ ఓపెనర్ బట్లర్కు సహకరించే వారూ లేరు. -
జ్యోతి వెలిగింది.. పారిస్ మురిసింది
ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా పండుగ ఒలింపిక్స్కు సమయం దగ్గర పడుతోంది. సరిగ్గా ఇంకో వంద రోజుల్లోనే పారిస్లో ఈ మెగా ఈవెంట్ జరగబోతోంది. -
టీ20 ప్రపంచకప్లో.. హార్దిక్ బౌలింగ్ చేస్తేనే..
రాబోయే టీ20 ప్రపంచకప్లో హార్దిక్ పాండ్య ఆడతాడా? ఐపీఎల్లో ఇప్పటిదాకా ఈ ఆల్రౌండర్ ప్రదర్శన చూసిన అభిమానుల్లో తలెత్తుతున్న ప్రశ్న ఇదే. కొన్ని నెలల ముందు వరకు అతడి సారథ్యంలోనే టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ ఆడుతుందని అంతా అనుకున్నారు. -
ఐపీఎల్కు మ్యాక్స్వెల్ నిరవధిక విరామం
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పేలవమైన ఫామ్లో ఉన్న మ్యాక్స్వెల్ ఐపీఎల్ నుంచి నిరవధిక విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. -
నాదల్ విజయంతో..
స్పెయిన్ దిగ్గజం రఫెల్ నాదల్ పునరాగమనాన్ని విజయంతో మొదలుపెట్టాడు. బార్సిలోనా ఓపెన్ తొలి రౌండ్లో అతడు 6-2, 6-3తో ఫ్లావియో కొబాలి (ఇటలీ)పై విజయం సాధించాడు. -
అగ్రస్థానంలో గుకేశ్
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్మాస్టర్ గుకేశ్.. అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. నెపోమ్నియాషి (రష్యా)తో జరిగిన పదో రౌండ్ గేమ్ను అతడు డ్రాగా ముగించాడు. -
రోహిత్ ఓటమి
ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో రోహిత్ దహియా పోరాటం ముగిసింది. మంగళవారం 82 కేజీల విభాగం కాంస్య పోరులో ఈ భారత కుర్రాడు 1-3తో రసులోవ్ (ఉజ్బెకిస్థాన్) చేతిలో ఓడాడు. -
నరైన్ శతకం వృథా.. సెంచరీ చేసి రాజస్థాన్ను గెలిపించిన బట్లర్
కోల్కతాపై రాజస్థాన్ 2 వికెట్ల తేడాతో నెగ్గింది. 224 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ చివరి బంతికి విజయం సాధించింది. ఆ జట్టు ఆటగాడు జోస్ బట్లర్ శతకం(107*)తో చెలరేగాడు.
తాజా వార్తలు (Latest News)
-
జగనాసురుల కన్ను పడితే.. జగద్రక్షకుడి ఆస్తులు గోవిందా..
-
సమావేశానికి రాలేదని తెదేపా కార్యకర్త ఇంటిపై వైకాపా కార్యకర్తల దాడి
-
ఒకే రాయి ఇద్దరికి ఎలా తగిలింది?: ఎంపీ రఘురామ
-
మునుపెన్నడూ లేనంత తక్కువగా.. 326 సీట్లలోనే కాంగ్రెస్ పోటీ..
-
రాష్ట్రానికి విజనరీ కావాలా.. ప్రిజనరీ కావాలా?
-
ఘాట్రోడ్లకు జగన్ పోటు