T20 World Cup: అఫ్గాన్ను తక్కువగా అంచనా వేయొద్దు: భజ్జీ
టీ20 ప్రపంచకప్లో టీమ్ఇండియా తర్వాతి మ్యాచ్లో న్యూజిలాండ్తో తలపడనున్న నేపథ్యంలో దాన్ని క్వార్టర్ ఫైనల్లా చూడొద్దని వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు...
ఇంటర్నెట్డెస్క్: టీ20 ప్రపంచకప్లో టీమ్ఇండియా ఆదివారం న్యూజిలాండ్తో తలపడనున్న నేపథ్యంలో దాన్ని క్వార్టర్ ఫైనల్లా చూడొద్దని వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. కోహ్లీసేన సెమీస్కు చేరాలంటే ఈ మ్యాచ్లో తప్పనిసరిగా గెలవాల్సిందే. మరోవైపు న్యూజిలాండ్ది కూడా ఇదే పరిస్థితి. దీంతో ఈ మ్యాచ్ భారత జట్టుకు క్వార్టర్ ఫైనల్ వంటిదని అభిమానులు భావిస్తున్నారు. దాన్ని అలా భావించొద్దని.. ఈ గ్రూప్లో అఫ్గానిస్థాన్ కూడా ప్రమాదకరమైన జట్టేనని భజ్జీ అభిప్రాయపడ్డాడు. ఇటీవల ఆ జట్టు స్కాట్లాండ్ను 130 పరుగుల భారీ తేడాతో ఓడించిన విషయాన్ని గుర్తుచేశాడు. తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన సందర్భంగా భజ్జీ ఈ వ్యాఖ్యలు చేశాడు.
మరోవైపు గ్రూప్-2లో పాకిస్థాన్ ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్ల్లో విజయం సాధించి టైటిల్ రేసులో ఫేవరెట్గా ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. గత ఆదివారం టీమ్ఇండియాపై పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఆ జట్టు మంగళవారం న్యూజిలాండ్పైనా ఐదు వికెట్ల తేడాతో గెలుపొంది ఈ గ్రూప్ పాయింట్ల పట్టికలో పైనుంది. ఈ క్రమంలోనే మిగిలిన మ్యాచ్ల్లో ఆ జట్టు.. అఫ్గాన్, స్కాట్లాండ్, నమీబియాలను ఓడించి సెమీస్కు అర్హత సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఇదే గ్రూప్ నుంచి రెండో జట్టుగా సెమీస్లో అర్హత సాధించేందుకు టీమ్ఇండియా, న్యూజిలాండ్ ప్రధానంగా పోటీపడుతున్నాయి. దీంతో ఈనెల 31న జరగనున్న మ్యాచ్ ఇరు జట్లకూ కీలకం కానుంది. ఇందులో ఓడిన జట్టు సెమీస్కు చేరడం కష్టంగా మారే అవకాశం ఉంది. అలాగే ఏ జట్టు గెలిచినా తన తర్వాతి మ్యాచ్లో అఫ్గానిస్థాన్తో తలపడాల్సి ఉంటుంది. అలాంటప్పుడు టీమ్ఇండియాకు ఇది క్వార్టర్ ఫైనల్ కాదని హర్భజన్ అభిప్రాయపడ్డాడు.
‘న్యూజిలాండ్తో పోరు క్వార్టర్ ఫైనల్ లాంటిది కాదు. ఇది కూడా ఒక సాధారణ మ్యాచ్. అయితే, అఫ్గానిస్థాన్ను తక్కువ అంచనా వేయొద్దు. అదీ ప్రమాదకరమైన జట్టే.. ఏ టీమ్నైనా ఓడించగలదు. ఇక టీమ్ఇండియా సెమీస్ చేరాలంటే తొలుత చేయాల్సిన పని న్యూజిలాండ్ను ఓడించడం. మన ఆటగాళ్లపై నాకా నమ్మకం ఉంది. ఆ తర్వాత మిగిలిన మ్యాచ్ల్లో విజయం సాధించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో టీమ్ఇండియాకు ప్రతి మ్యాచ్ ముఖ్యమైందే. అందుకోసం కోహ్లీసేన సిద్ధంగా ఉందని బలంగా నమ్ముతున్నా. కచ్చితంగా గెలుస్తారనే అనుకుంటున్నా. భారత్ గొప్ప జట్టే అయినా పాకిస్థాన్తో తలపడిన రోజు మనదికాదు’ అని హర్భజన్ అన్నాడు. దాయాది జట్టుతో ఓటమి టీమ్ఇండియాకు మేలుకొలుపు లాంటిదని పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టే ఆలోచన లేదని వెస్టిండీస్ మాజీ ఆటగాడు సునీల్ నరైన్ (Sunil Narine) అన్నాడు. -
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
ముంబయి ఇండియన్స్ గురించి భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టులోని కొంతమంది ఆటగాళ్లు ఇప్పటికీ రోహిత్ శర్మ (Rohit Sharma)నే కెప్టెన్గా భావిస్తున్నారని వ్యాఖ్యానించాడు. -
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్లో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఎవరైతే బాగుంటారు. -
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ముంబయి తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. -
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు