IND vs NZ: భారత్పై కివీస్దే ఆధిపత్యం.. కోహ్లీసేన 18 ఏళ్ల రికార్డు తిరగరాయాలి..!
భారత్, న్యూజిలాండ్ జట్లు మరో రసవత్తర పోరుకు సిద్ధమయ్యాయి. ప్రతిష్ఠాత్మక ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021 (T20 world cup 2021)లో ఆదివారం కీలక మ్యాచ్లో తలపడనున్నాయి...
ఐసీసీ ట్రోఫీల్లో షాకిస్తున్న న్యూజిలాండ్
భారత్, న్యూజిలాండ్ జట్లు మరో రసవత్తర పోరుకు సిద్ధమయ్యాయి. ప్రతిష్ఠాత్మక ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021 (T20 world cup 2021)లో ఆదివారం కీలక మ్యాచ్లో తలపడనున్నాయి. రెండు జట్లూ పాకిస్థాన్తో ఓటమిపాలైన నేపథ్యంలో సెమీస్కు అర్హత సాధించాలంటే ఈ మ్యాచ్లో తప్పక గెలవాలి. అయితే, ఐసీసీ టోర్నీల్లో రెండు దశాబ్దాలుగా టీమ్ఇండియాకు షాకిస్తున్న న్యూజిలాండ్ ఈసారి కూడా తన విజయపరంపర కొనసాగించాలని చూస్తోంది. దీంతో తన రికార్డును మరింత పదిలం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు టీమ్ఇండియా 2003 వన్డే ప్రపంచకప్లో చివరిసారి గంగూలీ నేతృత్వంలో కివీస్ను ఓడించగా.. ఆ తర్వాత జరిగిన అన్ని ఐసీసీ టోర్నీల్లోనూ న్యూజిలాండ్దే ఆధిపత్యం కొనసాగుతోంది. మెగా టోర్నీల్లో భారత్ అన్ని ప్రధాన జట్లను మట్టికరిపించినా కివీస్ను మాత్రం ఓడించలేకపోయింది. ఇటీవల జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లోనూ కోహ్లీసేన ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత 20 ఏళ్లుగా టీమ్ఇండియాపై న్యూజిలాండ్ ఆధిపత్యం ఎలా సాగిందో క్లుప్తంగా గుర్తు చేసుకుందాం..
దాదా శతకం వృథా..
2000 ఏడాది ఐసీసీ నాకౌట్ సిరీస్లో టీమ్ఇండియాకు న్యూజిలాండ్ తొలిసారి షాకిచ్చింది. సౌరభ్ గంగూలీ నేతృత్వంలోని జట్టును స్టీఫెన్ ఫ్లెమింగ్ టీమ్ ఫైనల్లో నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత ఓపెనర్లుగా బరిలోకి దిగిన గంగూలీ (117; 130 బంతుల్లో 9x4, 4x6), సచిన్ (69; 83 బంతుల్లో 10x4, 1x6) కివీస్ బౌలర్లపై సంపూర్ణ ఆధిపత్యం చలాయించారు. వీరిద్దరూ తొలి వికెట్కు 141 పరుగులు జోడించి శుభారంభం చేశారు. తర్వాత సచిన్ ఔటయ్యాక రాహుల్ ద్రవిడ్ (22), యువరాజ్ సింగ్ (18), వినోద్ కాంబ్లీ (1), రాబిన్సింగ్ (13), అజిత్ అగార్కర్ (15) పూర్తిగా విఫలమయ్యారు. దీంతో టీమ్ఇండియా చివరికి 50 ఓవర్లలో 264/6 స్కోర్ చేసింది. ఛేదనలో కివీస్ 49.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. క్రిస్కేర్న్స్ (102*; 113 బంతుల్లో 8x4, 2x6) శతకంతో మెరవగా క్రిస్ హారిస్ (46; 72 బంతుల్లో 4x4) సహకరించాడు. దీంతో న్యూజిలాండ్ రెండు బంతులు మిగిలివుండగానే విజయం సాధించింది.
కైఫ్, ద్రవిడ్ గెలిపించారు..
ఆపై 2003 వన్డే ప్రపంచకప్లో టీమ్ఇండియా ఫేవరెట్ జట్లలో ఒకటిగా అడుగుపెట్టింది. ఈ క్రమంలోనే సూపర్ సిక్స్ స్టేజ్లో న్యూజిలాండ్తో తలపడి విజయం సాధించింది. స్టీఫెన్ ఫ్లెమింగ్ నేతృత్వంలోని కివీస్ను భారత్ తొలి ఇన్నింగ్స్లో 146 పరుగులకే కట్టడి చేసింది. జహీర్ఖాన్ 4/42 విజృంభించడంతో పాటు మిగతా బౌలర్లు తలా ఓ చేయి వేయడంతో న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ పరుగులు చేసేందుకు తంటాలు పడ్డారు. ఫ్లెమింగ్ (30) టాప్ స్కోరర్గా నిలిచాడు. అయితే, స్వల్ప లక్ష్య ఛేదనలో టీమ్ఇండియా తడబడింది. టాప్ఆర్డర్ బ్యాట్స్మెన్ వీరేంద్ర సెహ్వాగ్ (1), సచిన్ తెందూల్కర్ (15), కెప్టెన్ సౌరభ్ గంగూలీ (3) పూర్తిగా విఫలమయ్యారు. 21 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఇబ్బందికర పరిస్థితుల్లో నిలిచిన జట్టును మహ్మద్ కైఫ్ (68; 129 బంతుల్లో 8x4), రాహుల్ ద్రవిడ్ (53; 89 బంతుల్లో 7x4) ఆదుకున్నారు. వీరిద్దరూ మరో వికెట్ పడకుండా చివరివరకూ క్రీజులో నిలబడి అర్ధశతకాలతో రాణించారు. ఈ క్రమంలోనే టీమ్ఇండియా 10 ఓవర్లు మిగిలి ఉండగానే విజయం సాధించింది.
వీరూ, గౌతీ రాణించినా స్వల్ప తేడాతో ఓటమి..
అనంతరం 2007 టీ20 ప్రపంచకప్లో టీమ్ఇండియా తొలి విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే, గ్రూప్ స్టేజ్లో ధోనీ సారథ్యంలోని టీమ్ఇండియా డేనియల్ వెటోరీ నేతృత్వంలోని న్యూజిలాండ్ చేతిలో 10 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. తొలుత ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 190 పరుగుల భారీ స్కోర్ చేసింది. బ్రెండన్ మెక్కలమ్ (45; 31 బంతుల్లో 9x4), క్రేగ్ మెక్మిలన్ (44; 23 బంతుల్లో 1x4, 4x6), జాకబ్ ఓరమ్ (35; 15 బంతుల్లో 2x4, 3x6) దంచికొట్టారు. ఆపై లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు గౌతమ్ గంభీర్ (51; 33 బంతుల్లో 5x4, 2x6), వీరేంద్ర సెహ్వాగ్ (40; 17 బంతుల్లో 6x4, 2x4) రెచ్చిపోయారు. తొలి వికెట్కు 76 పరుగులు జోడించి బలమైన పునాది వేశారు. అయితే, మిగతా బ్యాట్స్మెన్ ధోనీ (24), యువరాజ్ (5), దినేశ్ కార్తీక్ (17) విఫలమవడంతో జట్టు ఓటమిపాలైంది. చివర్లో శ్రీశాంత్ (19*; 10 బంతుల్లో 4x4) బౌండరీలతో చెలరేగినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
లక్ష్యం 127 కానీ..79కే ఆలౌట్..
ఇక 2016 టీ20 ప్రపంచకప్ సందర్భంగా భారత్, న్యూజిలాండ్ జట్లు గ్రూప్-2లో పదమూడో మ్యాచ్లో తలపడ్డాయి. నాగ్పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కేన్ విలియమ్సన్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 126/7 స్వల్ప స్కోరుకే పరిమితమైంది. దాంతో భారత్ సునాయాస విజయం సాధిస్తుందని అంతా అనుకున్నారు. కానీ, ధోనీసేన ఛేదనలో మరింత దారుణంగా ఆడి టీ20ల్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. భారత బౌలర్లు అశ్విన్, నెహ్రా, బుమ్రా, రైనా, జడేజా కట్టుదిట్టంగా బంతులేసి తలా ఓ వికెట్ తీసి కివీస్ను భారీ స్కోర్ చేయకుండా నిలువరించారు. ఆ జట్టులో కొరే అండర్సన్ (34; 42 బంతుల్లో 3x4), లుక్ రోంచి (21; 11 బంతుల్లో 2x4, 1x6) టాప్ స్కోరర్లుగా నిలిచారు. అనంతరం ఛేదనకు దిగిన భారత్ పూర్తిగా విఫలమైంది. కోహ్లీ (23; 27 బంతుల్లో 2x4), ధోనీ (30; 30 బంతుల్లో 1x4, 1x6) మినహా ఎవరూ రాణించలేదు. దీంతో చివరికి 18.1 ఓవర్లలో 79 పరుగులకే కుప్పకూలింది. మిచెల్ శాంట్నర్ 4/11 కెరీర్లోనే గొప్ప గణాంకాలు నమోదు చేశాడు.
ధోనీ రనౌటై.. నిరాశపర్చాడు..
2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్ భారత అభిమానులెవ్వరూ అంత తేలిగ్గా మర్చిపోరు. ఎందుకంటే అది టీమ్ఇండియా ఆటగాడిగా ధోనీకి చివరి మ్యాచ్. అప్పుడు కూడా న్యూజిలాండ్తోనే తలపడింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 239 పరుగులే చేసింది. రాస్టేలర్ (74; 90 బంతుల్లో 3x4, 1x6), కేన్ విలియమ్సన్ (67; 95 బంతుల్లో 6x4) నిలకడగా ఆడి జట్టుకు పోరాడే స్కోర్ అందించారు. కానీ, ఆరోజు వర్షం కురవడంతో ఆట మరుసటి రోజుకు వాయిదా పడింది. ఛేదనలో భారత టాప్ ఆర్డర్ పూర్తిగా చేతులేత్తేసింది. కేఎల్ రాహుల్ (1), రోహిత్ శర్మ (1), కోహ్లీ (1) దినేశ్ కార్తీక్ (6) విఫలమయ్యారు. మధ్యలో పంత్ (32), హార్దిక్ పాండ్య (32) ఫర్వాలేదనిపించినా భారీ స్కోర్లు చేయలేకపోయారు. ఈ క్రమంలోనే 92 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. అప్పుడే రవీంద్ర జడేజా (77; 59 బంతుల్లో 4x4, 4x6), ధోనీ (50; 72 బంతుల్లో 1x4, 1x6) అద్భుతంగా ఆడి మ్యాచ్పై ఆశలు రేకెత్తించారు. వీరిద్దరూ ఏడో వికెట్కు 116 పరుగులు జోడించారు. అయితే, చివర్లో సాధించాల్సిన రన్రేట్ పెరిగిపోగా స్వల్ప వ్యవధిలో ఇద్దరూ ఔటయ్యారు. ముఖ్యంగా ధోనీ అర్ధశతకం పూర్తయ్యాక రనౌట్ అవ్వడంతో భారత్ ఓటమి ఖాయమైంది.
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లోనూ ఓటములే..
మరోవైపు గతేడాది 2020 న్యూజిలాండ్ పర్యటనలోనూ టీమ్ఇండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పోటీల్లో కేన్ విలియమ్సన్ జట్టుతో ఓటమిపాలైంది. ఈ టోర్నీలో అన్ని జట్లపై ఆధిపత్యం చలాయించిన భారత్.. కివీస్తో మాత్రం గెలవలేకపోయింది. తొలి టెస్టులో న్యూజిలాండ్ 10 వికెట్ల తేడాతో గెలుపొందగా రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక ఈ ఏడాది జూన్లో జరిగిన ఛాంపియన్షిప్ ఫైనల్లోనూ న్యూజిలాండ్ కోహ్లీసేనకు మరోసారి షాకిచ్చింది. ఈ మ్యాచ్లో టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్లో 217 పరుగులు చేయగా కివీస్ 249 పరుగులు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్లో భారత్ 170 పరుగులకే ఆలౌటవ్వడంతో న్యూజిలాండ్ 2 వికెట్లే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ఐసీసీ టోర్నీల్లో గత రెండు దశాబ్దాలుగా న్యూజిలాండ్ ఎప్పుడూ భారత్కు చేదు అనుభవమే మిగిలిస్తోంది. ఇప్పుడు మరోసారి టీ20 ప్రపంచకప్లో కీలక మ్యాచ్లో కోహ్లీసేన తలపడుతుండటంతో ఇప్పుడైనా విజయం సాధించి 18 ఏళ్ల రికార్డును తిరగరాయాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ తెగ ఆసక్తి రేకెత్తిస్తోంది.
-ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
ఐపీఎల్ 2024లో బెంగళూరు వరుస ఆరు ఓటముల తర్వాత రెండో విజయం సాధించింది. హైదరాబాద్ను 35 పరుగుల తేడాతో ఆ జట్టు ఓడించింది. -
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
ముంబయి ఇండియన్స్ జట్టు గురించి తాను మాట్లాడిన మాటలు వక్రీకరణకు గురికావడం వల్లే సోషల్ మీడియాలో వైరల్గా మారినట్లు అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. -
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడించారు. -
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. -
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
లండన్లో ఖలిస్థానీ అనుకూలవాదుల దుశ్చర్య కేసు.. కీలక నిందితుడి అరెస్టు
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట