Rahul Dravid: రాహుల్ ద్రవిడ్తో ఆడుతూ స్కాట్లాండ్ కెప్టెన్ రనౌట్
టీమ్ఇండియా నూతన కోచ్, మాజీ సారథి రాహుల్ ద్రవిడ్ 2003లో స్కాట్లాండ్ తరఫున ఆడిన సందర్భాన్ని ఆ జట్టు కెప్టెన్ కైల్ కోజర్ గుర్తుచేసుకున్నాడు. అప్పుడు ద్రవిడ్తో ఆడుతూ తాను రనౌటైనట్లు పేర్కొన్నాడు...
2003 నాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్న కైల్ కోజర్
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా నూతన కోచ్, మాజీ సారథి రాహుల్ ద్రవిడ్ 2003లో స్కాట్లాండ్ తరఫున ఆడిన సందర్భాన్ని ఆ జట్టు కెప్టెన్ కైల్ కోజర్ గుర్తుచేసుకున్నాడు. అప్పుడు ద్రవిడ్తో ఆడుతూ తాను రనౌటైనట్లు పేర్కొన్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించడం గమనార్హం. తాజాగా టీమ్ఇండియా స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సెమీస్ రేసులో ఇంకా ఆశతో ఎదురుచూస్తుంది. ఈ సందర్భంగా కైల్ మాట్లాడుతూ ద్రవిడ్తో 18 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనను నెమరువేసుకున్నాడు.
‘అప్పుడు మా దేశవాళీ క్రికెట్లో ద్రవిడ్ పలు మ్యాచ్లు ఆడాడు. ఆ సమయంలో నార్తంప్టన్ జట్టుతో తలపడిన మ్యాచ్లో మేమిద్దరం కలిసి బ్యాటింగ్ చేశాం. అప్పుడు నేను రనౌటయ్యాను. ద్రవిడ్ బాగా ఆడాడు. శతకం బాది మా జట్టులో కీలక పాత్ర పోషించాడు. అందువల్ల ఆరోజు నాకు బాగా గుర్తుంది. అయితే, రనౌటయ్యేటప్పుడు ద్రవిడ్ చాలా స్పష్టంగా పరుగు కోసం రావొద్దని చెప్పాడు’ అని అప్పుడు 19 ఏళ్ల వయసున్న కైల్ తన అనుభవాలను పంచుకున్నాడు. కాగా, ఆ సమయంలో మిస్టర్ కూల్ మొత్తం 11 మ్యాచ్లు ఆడి 600 పరుగులు చేశాడు. అందులో మూడు శతకాలు, రెండు అర్ధశతకాలు నమోదు చేశాడు. స్ట్రైక్రేట్ 92.73తో మెరిశాడు. అదే సీజన్లో భారత జట్టు తరఫున సైతం ద్రవిడ్ రెచ్చిపోయి ఆడాడు. మరోవైపు ద్రవిడ్ ఇటీవలే టీమ్ఇండియా నూతన కోచ్గా ఎంపికైన విషయం తెలిసిందే. అతడి నేతృత్వంలో టీమ్ఇండియా ఎలా రాణిస్తుందో చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!