T20 World Cup: అదే జరిగితే.. బ్యాగ్ సర్దుకొని ఇంటికి తిరిగొస్తాం: జడేజా
టీమ్ఇండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్లో 3/15 మేటి ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. టీ20 క్రికెట్లో అతడికిదే అత్యుత్తమ ప్రదర్శన...
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్లో మేటి ప్రదర్శన(3/15) చేసిన సంగతి తెలిసిందే. టీ20 క్రికెట్లో అతడికిదే అత్యుత్తమ ప్రదర్శన. మరోవైపు షమి 3/15, బుమ్రా 2/10 సైతం రాణించారు. దీంతో స్కాట్లాండ్ 85 పరుగులకే కుప్పకూలగా టీమ్ఇండియా 6.3 ఓవర్లలోనే ఆ లక్ష్యాన్ని ఛేదించింది. ఈ క్రమంలోనే గ్రూప్-2లో అఫ్గానిస్థాన్ (1.481), న్యూజిలాండ్ (1.277) కన్నా మెరుగైన రన్రేట్ (1.619) సాధించింది. సెమీస్ పోరులో నిలవాలంటే భారత జట్టుకు ఈ రన్రేట్ చాలా కీలకం. అలాగే ఆదివారం అఫ్గానిస్థాన్తో జరిగే మ్యాచ్లో న్యూజిలాండ్ ఓడిపోవాల్సి ఉంటుంది. ఒకవేళ విలియమ్సన్ జట్టే గెలుపొందితే ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా భారత్ ఇంటిముఖం పడుతుంది.
అయితే, మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో జడేజా స్పందించాడు. ‘అఫ్గానిస్థాన్.. న్యూజిలాండ్ను ఓడిస్తేనే మనకు అవకాశం ఉంది. ఒకవేళ న్యూజిలాండే విజయం సాధిస్తే అప్పుడేం చేస్తారు?’ అని రిపోర్టర్ ప్రశ్నించాడు. ‘అలా జరిగితే ఏం చేస్తాం..? బ్యాగ్ సర్దుకొని ఇంటికి తిరిగొస్తాం’ అని వెంటనే జడేజా బదులిచ్చాడు. దీనికి అక్కడున్న వారంత సరదాగా నవ్వుకున్నారు. ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అయితే, జడ్డూ వ్యాఖ్యలపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు అతడి కామెడీకి నవ్వుకుంటుండగా మరికొందరు తొలి రెండు మ్యాచ్ల్లో ఓటమిపాలైనందుకు ట్రోలింగ్ చేస్తున్నారు. అప్పుడే విజయం సాధించి ఉంటే ఇప్పుడు అఫ్గాన్ మ్యాచ్పై ఆధారపడాల్సి వచ్చేది కాదని అంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!