IND vs PAK: పాక్తో మ్యాచ్.. ఇప్పుడు భారత్లో నిర్వహించడం కష్టం: గంగూలీ
ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్థాన్తో టీమ్ఇండియా మ్యాచ్ను భారత్లో నిర్వహించడం కష్టమని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ అన్నాడు...
ఇంటర్నెట్డెస్క్: ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్థాన్తో టీమ్ఇండియా మ్యాచ్ను భారత్లో నిర్వహించడం కష్టమని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ అన్నాడు. 2021 టీ20 ప్రపంచకప్లో భాగంగా దాయాది జట్లు ఆదివారం దుబాయ్లో పోటీపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ కీలక మ్యాచ్కు ముందు అక్కడ నిర్వహిస్తున్న ‘సలాం క్రికెట్’ కార్యక్రమంలో ఇరు జట్లలోని మాజీ ఆటగాళ్లు పాల్గొని తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. తాజాగా టీమ్ఇండియా మాజీ సారథి గంగూలీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.
‘పాకిస్థాన్తో టీమ్ఇండియా ప్రపంచకప్లలో మ్యాచ్లు ప్రారంభించడం ఇదేం తొలిసారి కాదు. గతంలో పలుమార్లు ఇలాగే తొలిపోరులో తలపడింది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీలోనూ పాకిస్థాన్తో ప్రారంభించి ఫైనల్లోనూ ఎదుర్కొంది. ఇదిలాగే కొనసాగుతుంది. ఎందుకంటే భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే ప్రతి ఒక్కరికీ అమితాసక్తి. పాక్తో మ్యాచ్ అంటే ఒత్తిడి బాగా ఉంటుందని కొందరు అంటుంటారు. నేనైతే అలా ఎప్పుడూ భావించలేదు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్కు తొలిసారి అధ్యక్షుడయ్యాక 2016 టీ20 ప్రపంచకప్లో భారత్-పాక్ మ్యాచ్ను ఈడెన్గార్డెన్స్లోనే నిర్వహించాం. అప్పుడు కూడా ఏమాత్రం ఒత్తిడి లేదు. అయితే, ఇప్పుడు ఈ మ్యాచ్ను భారత్లో నిర్వహించడం చాలా కష్టం. ఎందుకంటే టికెట్లకు భారీ డిమాండ్ పెరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడి కన్నా ఇక్కడ (దుబాయ్) నిర్వహించడమే మేలు. ఇక్కడంత ప్రభావం ఉండదు’ అని గంగూలీ వివరించాడు.
అనంతరం ప్రపంచకప్ టోర్నీల్లో దాయాది జట్టుపై భారత్ దిగ్విజయంగా కొనసాగడంపై స్పందించిన దాదా.. కొన్నేళ్లుగా భారత్ ప్రపంచకప్లో పాకిస్థాన్పై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తోందని, వరుస విజయాలతో మంచి రికార్డు కలిగి ఉందని మెచ్చుకున్నాడు. పాకిస్థాన్ ఒకప్పుడు చాలా బలమైన జట్టని, ఇప్పుడు టీమ్ఇండియా మరింత శక్తిమంతంగా తయారైందని చెప్పాడు. టీమ్ఇండియా క్రికెట్లో ఒక ప్రణాళిక బద్ధమైన కార్యాచరణ కొనసాగుతోందని, దీంతో మేటి ఆటగాళ్లను తయారు చేస్తున్నట్లు తెలిపాడు. ప్రతి ఒక్కరూ మంచి గుర్తింపు రావాలని కోరుకుంటారని, దీంతో పట్డుదలగా రాణిస్తున్నారని పేర్కొన్నాడు. జట్టులో ఆరోగ్యకరమైన పోటీ నెలకొందని గంగూలీ అభిప్రాయపడ్డాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
క్రికెటర్లు తాము కొట్టే షాట్.. లేదా తీసే వికెట్ జీవితాంతం మరిచిపోకుండా ఉంటారు. అలాంటి అనుభవం పంజాబ్ బ్యాటర్ అశుతోష్ శర్మకూ ఎదురైంది. -
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
ఐపీఎల్ 17వ సీజన్లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. తన సొంత మైదానంలో లఖ్నవూ జట్టు చెన్నైను ఢీకొట్టనుంది. -
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్