IND vs AFG: రోహిత్, రాహుల్, హార్దిక్, పంత్ దంచికొట్టుడు చూస్తారా?
టీ20 ప్రపంచకప్లో తొలి రెండు మ్యాచ్ల్లో పూర్తిగా విఫలమైన టీమ్ఇండియా బ్యాట్స్మెన్ బుధవారం రాత్రి అఫ్గానిస్థాన్తో జరిగిన మ్యాచ్లో బౌండరీ లక్ష్యంగా బ్యాటింగ్ చేశారు...
బాదడమే లక్ష్యంగా.. భారత్ x అఫ్గానిస్థాన్ హైలైట్స్
ఇంటర్నెట్డెస్క్: టీ20 ప్రపంచకప్లో తొలి రెండు మ్యాచ్ల్లో పూర్తిగా విఫలమైన టీమ్ఇండియా బ్యాట్స్మెన్ బుధవారం రాత్రి అఫ్గానిస్థాన్తో జరిగిన మ్యాచ్లో బౌండరీలే లక్ష్యంగా బ్యాటింగ్ చేశారు. ఓపెనర్లు రోహిత్ శర్మ (74), కేఎల్ రాహుల్ (69) ధాటిగా ఆడి తొలి వికెట్కు 140 పరుగులు జోడించారు. తొలి వికెట్గా రోహిత్ వెనుదిరగ్గా మరో ఏడు పరుగులకే రాహుల్ సైతం పెవిలియన్ బాట పట్టాడు. ఆపై హార్దిక్ పాండ్య (35 నాటౌట్), రిషబ్ పంత్ (27 నాటౌట్) మరింత దూకుడుగా ఆడి చివరి 21 బంతుల్లో 63 పరుగులు సాధించారు. దీంతో భారత్ ఈ ప్రపంచకప్లో అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా నిలిచింది. తొలి రెండు మ్యాచ్ల్లో పరుగులు చేయడానికి ఇబ్బందులు పడిన ఈ ఆటగాళ్లంతా ఈ మ్యాచ్లో ఎలాగైనా రాణించాలనే కసితో కనిపించారు. దొరికిన బంతిని దొరికినట్లు బౌండరీ లైన్ దాటించారు. అనంతరం భారత బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బంతులేయడంతో అఫ్గానిస్థాన్ 147/7కే పరిమితమైంది. దీంతో భారత్ 66 పరుగల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్కు సంబంధించిన కీలక ఘట్టాల వీడియోను ఐసీసీ ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో పంచుకుంది. మన బ్యాట్స్మెన్ ఎలా రెచ్చిపోయారో, బౌలర్లు ఎలా రాణించారో మీరూ చూసి ఆస్వాదించండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
-
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా