IND vs NZ: భారత్ గెలవాలంటే అలా చేయాలి..
టీ20 ప్రపంచకప్లో టీమ్ఇండియా మరో కీలక పోరుకు సిద్ధమైంది. సెమీస్ రేసులో నిలవాలంటే ఇకపై అన్ని మ్యాచ్లూ...
టీ20 ప్రపంచకప్లో టీమ్ఇండియా మరో కీలక పోరుకు సిద్ధమైంది. సెమీస్ రేసులో నిలవాలంటే ఇకపై అన్ని మ్యాచ్లూ తప్పక గెలవాలి. ఈ క్రమంలోనే మరికొన్ని గంటల్లో న్యూజిలాండ్తో చావోరేవో తేల్చుకోనుంది. అయితే, ఇక్కడో విషయం ఇప్పుడు భారత అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అదే.. గత 18 ఏళ్లుగా ఐసీసీ టోర్నీల్లో టీమ్ఇండియాపై కివీస్కు ఎదురులేకపోవడం. ఈసారి కూడా ఆ జట్టు విజయం సాధిస్తే ఇక కోహ్లీసేన సెమీస్ ఆశలు గల్లంతైనట్లే. ఈ నేపథ్యంలో ఆ ప్రమాదం నుంచి బయటపడాలంటే భారత్ ముందు ఓ మంచి ఉపాయం ఉంది. అదే.. గతేడాది న్యూజిలాండ్ పర్యటనలోని ఐదు టీ20ల సిరీస్ను గుర్తుచేసుకోవడం. అప్పుడు కివీస్పై ఎలా గెలిచారో భారత ఆటగాళ్లు ఒక్కసారి గుర్తు చేసుకుంటే జట్టులో నూతనోత్తేజం కలిగే అవకాశం ఉంది. అసలు అప్పుడు ఏం జరిగింది.. టీమ్ఇండియా ఏం చేసిందనే విషయాలు తెలుసుకుందాం..
ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అదే..
గతేడాది టీమ్ఇండియా ఐదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టుల సుదీర్ఘ పర్యటన కోసం న్యూజిలాండ్లో అడుగుపెట్టింది. అయితే, పొట్టి సిరీస్లో చెలరేగిన భారత జట్టు తర్వాత వన్డేల్లో, టెస్టుల్లో వరుస ఓటములు చవిచూసింది. కానీ, టీ20 సిరీస్ను క్లీన్స్వీప్ చేయడమే ఇప్పుడు టీమ్ఇండియాకు కలిసొచ్చే అంశం. ఈ సిరీస్లో ఓపెనర్లుగా బరిలోకి దిగిన కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఒకరు విఫలమైనా మరొకరు జట్టును ఆదుకున్నారు. ఆపై కెప్టెన్ విరాట్ కోహ్లీ, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ శ్రేయస్ అయ్యర్ సందర్భోచితంగా పరుగులు చేసి జట్టుకు అద్భుత సిరీస్ కైవసం చేశారు.
రెండుసార్లు రాహులే..
ఐదు టీ20ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసి ఐదు వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోర్ సాధించింది. టాప్ఆర్డర్ మొత్తం గప్తిల్ (30), మన్రో (59), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (51), రాస్ టేలర్ (54) రాణించారు. దీంతో భారత్ ముందు పెద్ద లక్ష్యమే నిర్దేశించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా 19 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరింది. ఓపెనర్ రోహిత్ (7) విఫలమైనా రాహుల్ (56), కెప్టెన్ కోహ్లీ (45), శ్రేయస్ అయ్యర్ (58) దంచికొట్టారు. దీంతో భారత్ సిరీస్లో శుభారంభం చేసింది.
ఇక రెండో మ్యాచ్లోనూ తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ఈసారి 132/5 తక్కువ స్కోరుకే పరిమితమైంది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో కివీస్ బ్యాట్స్మెన్ పరుగులు చేసేందుకు ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలోనే ఓపెనర్లు గప్తిల్ (33), మన్రో (26)తో పాటు వికెట్ కీపర్ సీఫర్ట్ (33*) కాసిన్ని పరుగులు చేయడంతో ఆ మాత్రం స్కోరైనా సాధించింది. ఇక స్వల్ప ఛేదనలో రోహిత్ (8), కోహ్లీ (11) విఫలమైనా రాహుల్ (57*), శ్రేయస్ అయ్యర్ (44) మ్యాచ్ను గెలిపించారు.
ఇది సూపర్ గేమ్..
ఇక తొలి రెండు మ్యాచ్ల్లో సాధించిన విజయాలతో జోరుమీదున్న కోహ్లీసేన తర్వాతి రెండు మ్యాచ్లను సూపర్ ఓవర్లో కైవసం చేసుకోవడం మరో విశేషం. మూడో మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా ఐదు వికెట్ల నష్టానికి 179/5 స్కోర్ చేసింది. రోహిత్ (65) ఈసారి చెలరేగి ఆడాడు. అతడికి రాహుల్ (27), కోహ్లీ (38)ల నుంచి మంచి సహకారం లభించింది. దీంతో చివరికి న్యూజిలాండ్ ముందు మంచి లక్ష్యమే నిర్దేశించింది. అయితే, అప్పటికే రెండు ఓటములపాలైన న్యూజిలాండ్ ఈసారి పట్టుదలగా ఆడింది. బ్యాటింగ్లో గప్తిల్ (31), మన్రో (14) విఫలమైనా విలియమ్సన్ (95) వేటాడాడు. 48 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లు సంధించి జూలు విదిల్చాడు. అయితే, చివరికి ఆ జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 179 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ టైగా మారి సూపర్ ఓవర్కు దారితీసింది.
* ఇక్కడ బుమ్రా వేసిన సూపర్ ఓవర్లో కివీస్ ఆటగాళ్లు విలియమ్సన్, గప్తిల్ ధాటిగా ఆడి 17 పరుగులు సాధించారు. అనంతరం రోహిత్, రాహుల్ బ్యాటింగ్కు వచ్చి నెమ్మదిగా ఆడారు. తొలి నాలుగు బంతుల్లో 8 పరుగులే చేశారు. ఇక చివరి రెండు బంతుల్లో 10 పరుగులు అవసరమైన వేళ హిట్మ్యాన్ రెండు సిక్సులు బాది జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో టీమ్ఇండియా 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది.
ఇది డబుల్ సూపర్..
టీమ్ఇండియా నాలుగో మ్యాచ్ ముందే సిరీస్ కైవసం చేసుకోగా ఇక క్లీన్స్వీప్పై కన్నేసింది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్లోనూ తొలుత బ్యాటింగ్ చేసిన కోహ్లీసేన 165/8 మంచి స్కోరే సాధించింది. ఈసారి రోహిత్ విశ్రాంతి తీసుకోగా రాహుల్ (39)తో కలిసి ఓపెనర్గా వచ్చిన సంజూ శాంసన్ (8) విఫలమయ్యాడు. ఆపై కోహ్లీ (11), శ్రేయస్ (1), శివమ్ దూబె(12) సైతం పరుగులు చేయలేకపోయారు. మనీశ్ పాండే (50) చివరివరకూ క్రీజులో ఉండి జట్టుకు పోరాడే స్కోర్ అందించాడు. అయితే, ఛేదనలో గప్తిల్ (4) విఫలమైనా మన్రో (64), సీఫర్ట్ (57) దంచికొట్టారు. మధ్యలో రాస్టేలర్ (24) కాసిన్ని పరుగులు చేశాడు. చివరికి మ్యాచ్ టైగా మారి వరుసగా రెండో మ్యాచ్ సూపర్ ఓవర్కు చేరింది.
* ఇక మరోసారి సూపర్ ఓవర్లో బౌలింగ్ చేసిన బుమ్రా 13 పరుగులిచ్చాడు. సీఫర్ట్, మన్రో ధాటిగా ఆడారు. అనంతరం రాహుల్, కోహ్లీ బ్యాటింగ్ చేసి జట్టుకు మరో విజయం ఖాయం చేశారు. రాహుల్ ఒక ఫోర్, ఒక సిక్సర్ బాదగా, కోహ్లీ ఒక బౌండరీ బాదాడు.
ఐదో మ్యాచ్తో క్లీన్స్వీప్..
చివరగా టీమ్ఇండియా ఐదో టీ20లోనూ మొదట బ్యాటింగ్ చేసి మూడు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. రాహుల్ (45), రోహిత్ (60), శ్రేయస్ అయ్యార్ (33) రాణించారు. అనంతరం సీఫర్ట్ (50), రాస్టేలర్ (53) అర్ధశతకాలతో రాణించినా మిగతా బ్యాట్స్మెన్ తేలిపోవడంతో చివరికి న్యూజిలాండ్ 156/9 స్కోరుకు పరిమితమైంది. దీంతో టీమ్ఇండియా ఏడు పరుగులతో విజయం సాధించి 5-0 తేడాతో సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది.
టీమ్ఇండియా గమనించాల్సిన విషయం..
ఈ సిరీస్లో భారత బ్యాట్స్మెన్ ఒకరు కాకపోయినా మరొకరు పరుగులు చేసి జట్టును ఆదుకున్నారు. కీలక సమయాల్లో దంచికొట్టి ఆధిపత్యం ప్రదర్శించారు. క్లిష్టపరిస్థితుల్లోనూ సమష్టిగా రాణించారు. ఒత్తిడి ఎదురైన వేళ ఒకరికి ఒకరు తోడుగా నిలిచారు. మరోవైపు బౌలింగ్లో శార్దూల్ ఠాకూర్, జస్ప్రిత్ బుమ్రా, షమి కీలక సమయాల్లో వికెట్లు తీసి జట్టు విజయాల్లో తమవంతు పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే టీమ్ఇండియా ఆటగాళ్లు ఇప్పుడు ప్రపంచకప్లోనూ అలాంటి పట్టుదలే ప్రదర్శిస్తే కివీస్తో పోరులో ఢోకా ఉండదు. కోహ్లీసేన ఆ సిరీస్ను గుర్తుచేసుకొని ఇకపై ఐసీసీ టోర్నీల్లో కివీస్కు చెక్ పెట్టాలని ఆశిద్దాం.. ఆల్ ది బెస్ట్ టీమ్ఇండియా..!
ఇంటర్నెట్డెస్క్..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్
భారత మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ (Sachin Tendulkar) బర్త్ డే సందర్భంగా పెద్దఎత్తున శుభాకాంక్షలు వచ్చాయి. మాజీ క్రికెటర్లు ప్రత్యేకంగా పోస్టులు పెట్టారు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అత్యంత దారుణంగా ట్రోలింగ్కు గురైన కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya). ఏ మైదానంలో చూసినా అతడిని హేళన చేస్తూ ఫ్యాన్స్ హోరెత్తించారు. -
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
లఖ్నవూ చేతిలో చెన్నైకి వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఈసారి సొంత మైదానంలోనే పరాజయం పొందడంతో ఆ జట్టు అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. -
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
మరో మూడు రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ తన టీమ్ను వెల్లడించాడు. -
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
David Warner: దిల్లీ ఆటగాడు డేవిడ్ వార్నర్.. భారత గుర్తింపు కార్డు ఆధార్ కోసం పరిగెడుతున్నాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో అతడు హిందీలో మాట్లాడటం విశేషం. -
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
సెంచరీతో చెన్నైపై భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో లఖ్నవూ బ్యాటర్ స్టాయినిస్ కీలక పాత్ర పోషించాడు. ఒకదశలో ఓడిపోతామని భావించిన ఆ జట్టును చివరి వరకూ క్రీజ్లో ఉండి విజయతీరాలకు చేర్చాడు. -
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
చెన్నై కెప్టెన్ రుతురాజ్ సెంచరీతో అలరించినా.. లఖ్నవూ జట్టే విజయం సాధించింది. మార్కస్ స్టాయినిస్ కీలకమైన శతకంతో తన జట్టును గెలిపించాడు. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!