Cricket News: రోహిత్కు పగ్గాలు అప్పగించేయాలి: గావస్కర్
రానున్న రెండు టీ20 ప్రపంచకప్లలో భారత జట్టుకు రోహిత్శర్మ సారథ్యం వహించాలని దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. వచ్చే ప్రపంచకప్తోనే పొట్టి ఫార్మాట్ పగ్గాలు
దుబాయ్: రానున్న రెండు టీ20 ప్రపంచకప్లలో భారత జట్టుకు రోహిత్శర్మ సారథ్యం వహించాలని దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. వచ్చే ప్రపంచకప్తోనే పొట్టి ఫార్మాట్ పగ్గాలు రోహిత్ చేపట్టాలని సూచించాడు. అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకు యూఏఈ, ఒమన్లలో టీ20 ప్రపంచకప్ జరుగనుంది. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్ నిర్వహించనుంది. వచ్చే నెలలో మొదలయ్యే పొట్టి కప్పు తర్వాత టీ20 సారథ్యానికి వీడ్కోలు పలుకుతానని కోహ్లి ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘‘వరుసగా రెండేళ్లలో రెండు టీ20 ప్రపంచకప్లు ఉన్నాయి. ఒకటి నెల రోజుల్లో ప్రారంభమవుతుంది. ఏడాది తర్వాత మరో కప్పు జరుగుతుంది. ఇలాంటి దశలో కెప్టెన్లను మార్చాలనుకోకూడదు. రెండు పొట్టి కప్పులకు సారథిగా నా ఓటు రోహిత్కే’’ అని గావస్కర్ వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
-
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
-
పనసపండు గుర్తు ఎక్కడ?.. గందరగోళానికి గురైన ఓటర్లు
-
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!
-
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు
-
వైకాపా నేతల సిఫార్సులతో పోస్టు.. మహిళా ఉద్యోగినులతో వెకిలి చేష్టలు